అండమాన్ నికోబార్ దీవులు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
అండమాన్ నికోబార్ దీవులు భారత దేశము యొక్క కేంద్ర పాలిత ప్రాంతము. ఈ దీవులు బంగాళా ఖాతము నకు దక్షిణమున హిందూ మహాసముద్రము లో ఉన్నవి. అండమాన్ దీవులను మరియు నికోబార్ దీవులను వేరుచేస్తున్న 10° ఉ అక్షాంశమునకు ఉత్తరమున అండమాన్ దీవులు, దక్షిణమున నికోబార్ దీవులు ఉన్నవి. ఈ కేంద్ర పాలిత ప్రాంతము యొక్క రాజధాని నగరము పోర్ట్ బ్లెయిర్.
| విస్తీర్ణము | 8293 చ.కి.మీ. |
| జనాభా | 2,77,989 |
| రాజధాని | పోర్ట్ బ్లెయిర్ |
| అక్షరాస్యత | 73.74% |
| ప్రధాన భాషలు | అధికార భాష తెలుగు. స్థానిక గిరిజన భాషలు, హిందీ, తమిళము మరియు బెంగాలీ |
విషయ సూచిక |
[మార్చు] పేరు
అండమాన్ అను పేరు హండుమాన్ అను పదమునుండి పుట్టినది. మలయు భాష లో హిందూ దేవుడు హనుమాన్ లేదా హనుమంతుడిని హండుమాన్ అని పిలుస్తారు.
మలయు భాషలో నికోబార్ అనగా నగ్న మనుషుల భూమి.
[మార్చు] చరిత్ర
17వ శతాబ్దంలొ మరాఠీలు(మహారాష్ట్రీయులు) ఈ దీవులను ఆక్రమించారు. అటు పిమ్మట ఈ దీవులు బ్రిటిషు ఇండియాలో భాగం అయినవి. రెండవ ప్రపంచ యుద్ద కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్, జపనీ యుల సహాయముతో ఈ దీవులను బ్రిటిషు వారి నుండి స్వాధీనం చేసుకొన్నది. జనరల్ లోకనాధన్ గవర్నర్ గా తాత్కాలిక స్వతంత్ర భారత ప్రభుత్వం నెలకొల్పబడినది. నేతాజీ ఈ దీవులకు షహీద్(అమరజీవి) మరియు స్వరాజ్య్(స్వరాజ్యం) అని నామకరణం చేసాడు. కాని, రెండవ ప్రపంచ యుద్ధములో జపనీయుల ఓటమి మరియు నేతాజీ మరణంతో ఈదీవులు తిరిగి బ్రిటిషు వారి అధీనంలోకి వచ్చినవి. 1947 లో ఇవి స్వతంత్ర భారతంలో భాగం అయినవి.
ప్రవాస లేదా ఏకాంత ద్వీపాంతర వాస శిక్ష విధించబడిన భారత స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి సెల్యులార్ జైలు లో బంధించేది. ఈ జైలును కాలాపానీ అని కూడా పిలిచేవారు. పోర్ట్ బ్లెయిర్ లోని ఈ సెల్యులార్ జైలును భారతదేశ పు సైబీరియా గా పరిగణించేవారు.
డిసెంబర్ 26, 2004 న హిందూ మహాసముద్రము లో సంభవించిన భూకంపం ఫలితంగా వచ్చిన సునామీ 7వేలకు పైగా అండమాను మరియు నికోబార్ దీవుల వాసులను పొట్టన పెట్టుకొంది. మరణించిన వారిలో అధికులు వేరే ప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడ స్థిరపడ్డవారే కాగా ఈ దీవులలోని ఆదిమవాసులు క్షేమముగా తప్పించుకోగలిగారు. [1]
[మార్చు] మార్గం
అండమాన్-నికోబార్ దీవులకు వెళ్లాలంటే ముందుగా వాటి రాజధాని పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాలి. అక్కడికి చెన్నై, కోల్కతా ల నుంచి విమాన సర్వీసులున్నాయి. ఓడలోనూ వెళ్లొచ్చు. ప్రయాణం కనీసం మూడు రోజులు పడుతుంది. బంగాళాఖాతంలో దాదాపు 8,249 చదరపు కిలోమీటర్ల మేర ఈ అండమాన్-నికోబార్ దీవులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 572 దీవులు సముద్రంలో అక్కడక్కడా విసిరేసినట్టు ఉంటాయి. వీటిల్లో అండమాన్ దీవుల్లోకి మాత్రమే పర్యటకుల్ని అనుమతిస్తారు. నికోబార్ దీవులలోనికి ప్రవేశం లేదు.
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
- అండమాన్ నికోబార్ దీవుల పరిపాలనా వెబ్ సైటు
- అండమాన్ సంఘము
- అండమాన్ఇండియా.కాం
- భారతదేశపు పగడపు దీవుల ప్రాంతము - అండమాన్
- 2004 హిందూ మహాసముద్రపు భూకంపముపై సన్ నెట్వర్క్ లో వ్యాసము
[మార్చు] మూలాలు
|
|
|
|---|---|
| రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ · అరుణాచల్ ప్రదేశ్ · అసోం · బీహార్ · ఛత్తీస్గఢ్ · గోవా · గుజరాత్ · హర్యానా · హిమాచల్ ప్రదేశ్ · జమ్మూ కాశ్మీరు · జార్ఖండ్ · కర్ణాటక · కేరళ · మధ్య ప్రదేశ్ · మహారాష్ట్ర · మణిపూర్ · మేఘాలయ · మిజోరాం · నాగాలాండ్ · ఒరిస్సా · పంజాబ్ · రాజస్థాన్ · సిక్కిం · తమిళనాడు · త్రిపుర · ఉత్తరాంచల్ · ఉత్తర ప్రదేశ్ · పశ్చిమ బెంగాల్ |
| కేంద్రపాలిత ప్రాంతములు | అండమాన్ నికోబార్ దీవులు · చండీగఢ్ · దాద్రా నగరు హవేలీ · డామన్ డయ్యు · లక్షద్వీపములు · పుదుచ్చేరి |