అక్షయ్ కుమార్ దత్తా

వికీపీడియా నుండి

అక్షయ్ కుమార్ దత్తా (బెంగాళీ: অক্ষয় কুমার দত্ত) (జూలై 15 1820 - మే 18 1886), బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకడు. ఈయన బర్ధమాన్ లోని చూపీలో జన్మించాడు. ఈయన తండ్రి పీతాంబర్ దత్త. హార్డ్‌మాన్ జెఫ్రాయ్ యొక్క పర్యవేక్షణలో ప్రాచ్య మతబోధన అభ్యసించిన అక్షయ్ కుమార్ దత్తా, తండ్రి అకాలమరణంతో చదువును మధ్యలోనే ఆపి ఉద్యోగప్రయత్నాలు చేయవలసి వచ్చింది. అయితే ఆయన జ్ఞానపిపాసను మాత్రం మరువలేదు. సోవాబజార్ రాజ్‌బరి గ్రంథాలయంలో కాలుక్యులస్ మరియు రేఖాగణితాన్ని అభ్యసించి నిష్ణాతుడయ్యాడు. సంస్కృత, పారశీకాలను నేర్చుకొని పాఠశాలలో హిందూ పురాణాలను చదివాడు. ఫ్రెంచి, జర్మన్ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో పట్టుసాధించాడు. 14 ఏళ్ల వయసులోనే "అనంగమోహన" అనే కవితాసంకలనాన్ని ప్రచురించాడు. యువకుడిగా ఉన్నప్పుడే ఈశ్వర చంద్ర గుప్త స్థాపించిన సంబద్ ప్రభాకర్ పత్రికకై వార్తలను మరియు ఫీచర్ కాలమ్స్ ను అనువదించేవాడు. ఈయన వృక్ష, జంతు మరియు రసాయన శాస్త్రాలలో తన జ్ఞానాన్ని పెంపెందించుకొనేందుకు కొంతకాలం వైద్య కళాశాలలో విద్యనభ్యసించాడు కూడా.

శాస్త్రపరమైన, విద్యాపరమైన విషయాలలో దత్త, రామ్మోహన్ రాయ్ ని తన గురువుగా భావించినా భారతదేశంలో బ్రిటీషు పాలనపై రామ్మోహన్ రాయ్ కున్న ఆశావాహక ధృక్పథాన్ని పంచుకోలేదు. బ్రిటీషు వాళ్ళు కుటిలంగా భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆ అక్రమ పరిపాలను కుటిలనీతితోనే కొనసాగిస్తున్నారు అని వ్రాశాడు.

1839లో తత్త్వబోధిని సభలో చేరి అనతికాలంలోనే సహాయకార్యదర్శి అయ్యాడు. ఆ తరువాత సంవత్సరం తత్త్వబోధిని పాఠశాలలో ఆధ్యాపకునిగా నియమితుడయ్యాడు. 1843లో తత్త్వబోధిని సభకు మరియు బ్రహ్మసమాజము యొక్క గళంగా తత్త్వబోధిని పత్రిక ప్రారంభమైంది. అక్షయ్ కుమార్ దత్తా ఈ పత్రిక యొక్క తొలి సంపాదకుడుగా పనిచేస్తూ బెంగాళీలో వచనసాహిత్యం యొక్క అభివృద్ధికై విశేష కృషి చేశాడు. ఆధునిక శాస్త్రీయ ధృక్పథాన్ని ప్రచారం చేయటానికి విశిష్టమైన కృషి మొట్టమొదటి బెంగాళీ రచయిత. ఈయన భౌతికశాస్త్రం మరియు భూగోళశాస్త్రాలపై బెంగాలీలో రచనలు చేశాడు. ఖగోళ శాస్త్రం, గణితం మరియు జియాలజీ వంటివిషయాలపై విరివిగా వ్రాశాడు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు