అఖండ భారత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగోళంలో అఖండ భారత్ స్థానం చూపే పటం

భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లను కలిపి అఖండ భారత్ అంటారు. అంటే బ్రిటిష్ పాలనకు ముందున్న భారతదేశం. బ్రిటీష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి, కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. హిందూ మహాసభ, విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బజరంగదళ్, దుర్గావాహిని, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన, హిందూ సేన, హిందూ జనజాగృతి సమితి వంటి హిందూ జాతీయవాద సంస్థలు నేటికీ అఖండ భారత్ సాధించాలని కృషిచేస్తున్నాయి.[1] అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన సరస్వతి పీఠం పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాదుకు 150 కి.మీ. దూరంలో ఉన్నదని, అలాగే వేదాలు పుట్టిన సింధూ నదీ ప్రాంత పవిత్రభూమి కూడా పాకిస్థాన్ లోనే ఉందని చెబుతారు.

చరిత్ర[మార్చు]

భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, కనైయాలాల్ మానెక్లాల్ మున్షీ అఖండ హిందుస్థాన్ కోసం వాదించారు, ఈ ప్రతిపాదనను మహాత్మా గాంధీ అంగీకరించారు, "బ్రిటన్ విభజించి పాలించే విధానాన్ని అనుసరించడం ద్వారా తన సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలని కోరుకున్నందున, హిందూ-ముస్లిం ఐక్యతను సాధించలేము. బ్రిటిష్ వారు అక్కడ ఉన్నంత కాలం. "అదనంగా, మజర్ అలీ ఖాన్ "ఖాన్ సోదరులు [అఖండ్ హిందుస్థాన్ కోసం పోరాడాలని నిశ్చయించుకున్నారు] , ప్రావిన్స్ ఓటర్ల ముందు ఈ సమస్యపై పోరాడాలని లీగ్‌ను సవాలు చేశారు" అని రాశారు. 1944 అక్టోబరు 7న, ఢిల్లీలో, రాధా కుముద్ ముఖర్జీ అఖండ హిందుస్థాన్ నాయకుల సమావేశానికి అధ్యక్షత వహించారు.

1937లో అహ్మదాబాద్‌లో జరిగిన హిందూ మహాసభ యొక్క 19వ వార్షిక సమావేశంలో భారతీయ సామజికవేత్త, హిందూ మహాసభ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ "కాశ్మీర్ నుండి రామేశ్వరం వరకు, సింధ్ నుండి అస్సాం వరకు" "ఒకే , అవిభాజ్యత" అని అఖండ భారత్ అనే భావనను ప్రతిపాదించారు. "భారత దేశానికి , భారత రాజ్యానికి అవిభక్త విధేయత , విధేయత కలిగిన పౌరులందరూ పరిపూర్ణ సమానత్వంతో పరిగణించబడతారు. , కుల, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఉమ్మడిగా విధులు , బాధ్యతలను సమానంగా పంచుకుంటారు , ప్రాతినిధ్యం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఓటు ఆధారంగా లేదా ప్రత్యేక ఓటర్ల విషయంలో జనాభా నిష్పత్తిలో , ప్రజా సేవలు మెరిట్ ద్వారా మాత్రమే జరుగుతాయి.

వివాదాలు[మార్చు]

పాకిస్తాన్‌ వ్యవ స్థాపకుడు జిన్నా, కాలానుగ తంగా భిన్నవ్యక్తిత్వాలను ప్రదర్శించారని ఆరెస్సెస్‌ మాజీ చీఫ్‌ కె.ఎస్‌ సుదర్శన్‌ అన్నారు. ఒక దశలో ఆయన లోక్‌మాన్య తిలక్‌తో కలసి అఖండ భారతావనికి కట్టుబడి పనిచేశారని సుదర్శన్‌ పేర్కొన్నారు. గాంధీ గనుక విభజన కూడదంటూ పట్టుబట్టి ఉంటే, విభజన జరిగి ఉండేదే కాదని’ అన్నారు. "ముస్లింలీగ్‌ నేత జిన్నా లౌకిక వాదేనా?" అన్న ప్రశ్నకు అవునని సుదర్శన్‌ సమాధాన మిచ్చారు. టర్కీలో ఖలీఫా పదవీభ్రష్ఠుడైతే దాంతో భారత్‌కు ఏం సంబంధమని కూడా జిన్నా ప్రశ్నించి నట్లు ఈ సందర్భంగా సుదర్శన్‌ గుర్తు చేశారు. జశ్వంత్‌సింగ్‌ బహిష్కరణపై వ్యాఖ్యానిస్తూ, ‘అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని’ సుదర్శన్‌ వ్యాఖ్యా నించారు. పాకిస్తాన్‌ పర్యటన సందర్భంగా జిన్నాను ప్రశంసించిన అద్వానీ ఆ తరువాత ఆ వ్యాఖ్యలపై వివరణను ఇచ్చారన్నారు.[2] దేశ విభజనకు జిన్నా బాధ్యుడు కారని, ఆయన అఖండ భారత్‌ను కోరుకున్నారని జశ్వంత్‌సింగ్‌ అన్నారు. దేశ విభజన అంశంపై పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి నాయకులను 'కించపరిచి, పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నాను కీర్తించవద్దని ప్రణబ్‌ముఖర్జీ కోరారు. దేశ విభజనలో హిందూ మహాసభ నాయకుడు, తర్వాత జనసంఘ్‌, బిజెపిల ఆవిర్బావానికి మూలకారకుడైన శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ, జిన్నాకు ఎలాంటి పాత్ర లేదని చెప్పడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన ధ్వజమెత్తారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]