Coordinates: 15°54′56″N 80°46′18″E / 15.915417°N 80.771743°E / 15.915417; 80.771743

అడవులదీవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడవులదీవి
—  రెవెన్యూ గ్రామం  —
అడవులదీవి is located in Andhra Pradesh
అడవులదీవి
అడవులదీవి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°54′56″N 80°46′18″E / 15.915417°N 80.771743°E / 15.915417; 80.771743
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నిజాంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి శొంటి రేణుక
జనాభా (2011)
 - మొత్తం 8,594
 - పురుషులు 4,381
 - స్త్రీలు 4,213
 - గృహాల సంఖ్య 2,602
పిన్ కోడ్ 522262
ఎస్.టి.డి కోడ్ 08648

అడవులదీవి, బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన నిజాంపట్నం నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రేపల్లె నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2602 ఇళ్లతో, 8594 జనాభాతో 3021 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4381, ఆడవారి సంఖ్య 4213. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1069 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 237. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590483[1].పిన్ కోడ్: 522262. ఎస్.టి.డి.కోడ్ = 08648.

గ్రామ చరిత్ర[మార్చు]

భీమవారిపాలెం అడవులదీకికి అనుబంధగ్రామంగా ఉంది. ఇది 1 కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడి ప్రజలు చాలా శక్తివంతమైనవారు. భీమ అనే ఇంటిపేరు కలిగిన ఈ గ్రామవ్యక్తులు పలనాడు వలసవచ్చారని పూర్వీకుల అభిప్రాయం. బాపట్లలో భీమావారిపాలెం ఉంది. వీళ్ళంతా కాపులు. 12 వ శతాబ్దంలో పల్నాటి యుద్ధంగా పేరుగాంచిన కారంపూడి యుద్ధం జరిగిన తరువాత జీవనం కోసం ఇక్కడికి వచ్చినట్లు కథప్రచారంలో ఉంది. భీమ అనే ఇంటిపేరు కలిగిన వారు బ్రహ్మనాయుడు వారసులని చరిత్రకారులు కూడా నిర్థారించారు. (ఆధారం కావాలి)

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

చాలా కాలం క్రితం అడవులదీవి మడ వృక్షాల అరణ్యంతో నిండి ఉండేది. సముద్ర తీరం కూడా సమీపంలో ఉంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ప్రజ్ఞం, కూచినపూడి, అల్లపర్రు, పల్లపట్ల, తుమ్మల గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 17, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి నిజాంపట్నంలో ఉంది. సమీప జూనియర్ కళాశాల నిజాంపట్నంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రేపల్లెలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు మట్టిలో మాణిక్యాల్లా పలు రంగాల్లో రాణిస్తూ దేశ విదేశాల్లో పేరు తెచ్చుకుంటున్నారు. శ్రీ గుమ్మడి సీతారామయ్య గారు ప్రధాన అధ్యాపకులుగా ఉన్న కాలంలో ఇక్కడి పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించారు. శ్రీ రామనాధ శర్మ గారు గణితం, సామాన్య శాస్త్రం, వెంకటేశ్వరరావు మాస్టారు సోషల్ ఇంగ్లీషు బాగా చెప్పేవారు. వారి దగ్గర చదువుకున్న పిల్లలు అందరూ బాగా పైకొచ్చారు. ఎలిమెంటరీ పాఠశాలల్లో కూడా మంచి విద్యాబోధన జరిగేది. బడుగు ప్రసాదరావు మాస్టారు, బెజవాడ మాస్టారు, కత్తుల సుబ్బారావు మాస్టారు, దుర్గారావు మాస్టారు, బి.యస్వీ.మరియమ్మ టీచర్ ఇలా ఎంతో మంది ఆరితేరిన మేధావులు ఆ మారుమూల గ్రామంలో పిల్లలకు మంచి ప్రమాణాలతో కూడిన విద్య అందించారు. ఈ గ్రామంలో చదివిన బి.డి.పాల్సన్ ఐ.పి.యస్.కు, బి.డి.యం. అంబేద్కర్ ఐ.ఐ.యస్.కు ఎంపికై ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఆంగ్లభాషోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ కోపూరి వసంతరావుకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేటు పట్టా ప్రదానం చేసింది. [10] ఈ పాఠశాలలో 1985-86 విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు, మరల, ఈ పాఠశాలలో 2016, మే-15వ తేదీ ఆదివారంనాదు తమ కుటుంబసభ్యులతోపాటు కలుసుకుని, ఈ పాఠశాలతో తమ చిన్ననాటి అనుభూతులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా వీరంతా కలిసి, ఈ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్ధం, ఒక లక్ష రూపాయాల విలువైన కూర్చునే బల్లలను వితరణగా అందజేసినారు. []

గున్నంతిప్ప మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

అడవులదీవిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

అడవులదీవిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. ఆటో సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

అడవులదీవిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 173 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 176 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 35 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 6 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 104 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 92 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 42 హెక్టార్లు
  • బంజరు భూమి: 284 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2106 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1456 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 976 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

అడవులదీవిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 976 హెక్టార్లు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

జనని జనసేన శ్రీ సాయి వృద్ధాశ్రమం:- సముద్రతీర గ్రామమైన అడవులదీవిలోని ఈ అశ్రమంలో వృద్ధులకు ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేస్తున్నారు.ఈ సంఘం వార్షికోత్సవాన్ని, 2017, మార్చి-12వతేదీ ఆదివారంనాడు నిర్వహించారు.

గ్రామానికి సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. వీరంకిపాలెం, అడవులదీవి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలైలో అడవులదీవి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి శొంటి రేణుక, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పోలవరపు రాజేష్ ఎన్నికైనారు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు మాఘపౌర్ణమికి జరుగును. తిరునాళ్ళలో భాగంగా ముందురోజు, అర్ధరాత్రి అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. నిజాంపట్నం, అడవులదీవి, హ్యారీస్ పేట, కొత్తపాలెం, గుర్నాధనగర్ తదితరప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో వచ్చి, స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేకపూజలు చేయుదురు. తిరునాళ్ళలో రెండోరోజు, మాఘపౌర్ణమి రోజున, పరిశావారిపాలెంలో బీచ్ లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సముద్రపు ఒడ్డున ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేయుదురు. తిరునాళ్ళను పురస్కరించుకొని రంగురంగుల విద్యుత్తు దీపాలతో ప్రభలు ఏర్పాటు చేయుదురు.
  2. శ్రీ అనంత షిర్డీసాయి ఆలయం:- ఈ ఆలయం 4వ వార్షికోత్సవం, 2014, ఏప్రిల్-1వ తేదీన నిర్వహించారు. ఆరోజు ఉదయం, సుప్రభాతసేవ, నగరకీర్తన, కాగడాహారతి, భజనకార్యక్రమాలు, వివిధ ద్రవాలతో అభిషేకాలు జరిగినవి.
  3. శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు.
  4. శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం:- గ్రామంలోని యల్లావుల ఇంటిదేవత శ్రీ నాగార్పమ్మ తల్లికొలుపులు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో నాలువగ గురువారంనాడు వైభవంగా నిర్వహించెదరు.
  5. శ్రీ అంకమ్మ తల్లి ఆలయం, పల్లెపాలెం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాహాధారిత వృత్తులు

పరిశ్రమలు[మార్చు]

దిండి కెమికల్ & ఫార్మా పార్క్[మార్చు]

ఈ గ్రామంలో 2700 కోట్ల రూపాయల అంచనావ్యయంతో ఈ పార్క్ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం ఆమోదం లభించినద్ ఇ. దీనికి పర్యావరణ అనుమతులు గూడా వచ్చినవి. ఇక్కడ 200 పైగా కంపెనీలు రావడానికి అంగీకారం తెలిపినవి. ఈ పార్క్ వలన 45,000 పైగా ఉద్యోగ అవకాశాలు రాగలవు. కృషా, గుంటూరు జిల్లాలలోని 100 ఫార్మసీ కళాశాలకు ఈ పార్క్ వలన ప్రయోజనం లభించగలదు.

గ్రామ విశేషాలు[మార్చు]

  1. అడవులదీవి గ్రామానికి చెందిన బడుగు ప్రసాదరావు మాస్టర్ గారి పిల్లలు బి.డి.పాల్సన్ ఐ.ఏ.ఎస్. అధికారిగా ఉత్తర ప్రదేశ్ లో డి.ఐ.జీ.గా, బి.డి.యం. అంబేద్కర్ ఐ.ఐ.ఎస్. అధికారిగా హైదరాబాద్ దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
  2. అడవులదీవి సెక్టార్, అంగనవాడీ పర్యవేక్షకురాలిగా పనిచేయుచున్న మణెమ్మ, ఉత్తమ పర్యవేక్షకురాలిగా ఎంపికైనది. ఈ మేరకు ఈమె, 2015, మార్చి-8వ తేదీ నాడు, నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా, పురస్కారం అందుకుంటారు.
  3. అడవులదీవి గ్రామానికి చెందిన శ్రీ నర్రా సుబ్బారావు, జాతీయస్థాయి ఓపెన్ క్రికెట్ పోటీలకు ఎంపికైనారు. ఈయన 2015, అక్టోబరు-31న మచిలీపట్నంలో జరిగిన అర్హత పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి, ఈ పోటీలకు ఎంపికైనారు. ఈయన 2015, నవంబరు-19 నుండి 23 వరకు రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8964.[2] ఇందులో పురుషుల సంఖ్య 4529, స్త్రీల సంఖ్య 4435, గ్రామంలో నివాసగృహాలు 2487 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3021 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 8,594 - పురుషుల సంఖ్య 4,381 - స్త్రీల సంఖ్య 4,213 - గృహాల సంఖ్య 2,602

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-10-21.