అనంత్ పాయ్
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
అంకుల్ పాయ్ గా (తెలుగులో విడుదలైన పుస్తకాల్లో "పాయ్ మామ"గా) సుప్రసిద్ధుడైన అనంత్ పాయ్ (17 సెప్టెంబర్ 1929 – 24 ఫిబ్రవరి 2011) ఒక భారతీయ కామిక్స్ సృష్టికర్త. 1967 లో ఆయన ప్రారంభించిన అమర్ చిత్ర కథ పుస్తకాల ద్వారా పాఠకులకు బాగా చేరువయ్యాడు. బొమ్మల ద్వారా భారతీయ జానపద కథలను, పౌరాణిక కథలను తరువాతి తరం వారికి చేరువయ్యేలా చేశాడు. ఇది కాక, 1980లో పిల్లల కోసం మరొక బొమ్మల కథల పత్రిక "టింకిల్" ను కూడా ప్రారంభించాడు.
[మార్చు] తొలినాళ్ళ జీవితం
అనంత్ పాయ్ కర్ణాటక లోని కర్కాలా లో వెంకటరాయ పాయ్, సుశీలా పాయ్ దంపతులకు జన్మించాడు. ఆయనకు రెండు సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులిద్దర్నీ పోగొట్టుకున్నాడు. పన్నెండు సంవత్సరాల వయసులో ముంబై కి వచ్చి మాహిమ్ లోని ఓరియంటల్ స్కూల్ లో చదివాడు. బాంబే విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం చదివాడు.
కామిక్స్, పుస్తక ప్రచురణ పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ 1954లో "మానవ్" అన్న పిల్లల పత్రిక ఒకటి స్థాపించాడు కానీ, అది ఎక్కువ కాలం నిలబడలేదు. తరువాత "టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రికలో చేరాడు. ఆ సమయంలోనే ఆ పత్రిక "ఇంద్రజల్ కామిక్స్" మొదలుపెట్టింది.
ఆయన ధర్మపత్ని లలితా పాయ్.