అమృత్‌పుర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఏకకుట, అమృతేశ్వర దేవాలయం, 1196, చిక్‌మగళూరు

అమృతపుర కర్ణాటక రాష్ట్రంలో చిక్‌మగళూరు జిల్లాలో జిల్లా రాజధాని చిక్‌మగళూరుకి 67 కి.మి దూరంలో ఉత్తరాన ఉంది. హసన్కు 110 కి.మి దూరంలో, షిమోగాకు 35 కి.మి దూరంలో జాతీయ రహదారి 48 మీద ఉన్నఈ గ్రామంలో ప్రసిద్ధమైన అమృతేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని 1196 సంవత్సరంలో అమృతేశ్వర దండనాయక హొయసల రాజు రెండవ వీర బల్లాల్ కట్టించాడు. ఈ గ్రామానికి అతి చేరువలో ఉన్న తరికెరిలో భద్ర నది రిజర్వాయిరు ఉంది.

చరిత్ర[మార్చు]

11-12 శతాబ్ధాల మధ్య కర్ణాటకని పరిపాలించిన హొయసల రాజులు మలనాడుకి దగ్గరలో అనేక నగరాలు, పట్టణాలు నిర్మించారు. ఈ పట్టణాలలో అత్యంత అద్భుతమైన అలంకారమైన దేవాలయాలు నిర్మించారు. ఈ పట్టణాలు, దేవాలయాలు ఒకదానికి మరోకటి అతి దగ్గరలో ఉండడం విశేషం.

అమృతేశ్వర ఆలయం గోడలపై చెక్కబడీన భారత ఇతిహాసాలు

అమృతేశ్వర దేవాలయం[మార్చు]

హొయసల రాజుల కాలంలో శిల్ప కళాచాతుర్యానికి ఈ దేవాలయ బయటి మండపం ఒక ప్రతీక.[1] ఈ ఆలయ బయటి మండపం తాటి, కొబ్బరి తోటల మధ్య ఉంది. వెలుపలి మండపం బయటి గోడలపై అత్య అద్భుతంగా గుండ్రటి ఆకారంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి (బొమ్మలో చూడవచ్చు) . ఈ దేవాలయంకి ఒకే విమానం ఉండడం వల్ల ఏకకుట అని పిలుస్తారు.[2] వెలుపలి మండపం నుండి లోపలికి వెళ్ళితే లోపలి మండపం వస్తుంది. ఈ గుడి నిర్మాణ శైలి, మండపాలు బెల్‌వాడి నందున్న విద్యానారాయణ దేవాలయ శైలిని పోలి ఉంటుంది. వెలుపలి మండపంలో 29 దీర్ఘచతురస్ర విభాగా (ప్రక్క బొమ్మలో చూడవచ్చు) లు, లోపలి మండపంలో 6 దీర్ఘచతురస్ర విభాగాలు ఉన్నాయి.[3] లోపలి గర్భ గుడి చతురస్రాకారంలో ఉండి, గర్భ గుడి శిఖరంపై భాగంలో కీర్తిముఖులు చెక్కబడి ఉన్నారు (బొమ్మలో చూడండి) . ఈ కీర్తి ముఖుల క్రింది భాగం దేవతా శిల్పాలు లేవు. సుఖాశిని పై హొయసలరాజుల రాజ చిహ్నమైన శాల [4] పులితో యుద్ధం చేస్తు సంహరిస్తున్న శిల్పం ఉంది.[5]
వెలుపలి మండపం బయటి గోడలపై 140 పలకల మీద భారత ఇతిహాసాలు చెక్కబడ్డాయి. మిగతా హొయసల దేవాలయల వలే ఇక్కడి దేవాలయం పై చెక్కబడిన శిల్పాలు చిన్నవిగా కాకుండా పెద్దవిగా చెక్కబడ్డాయి. వెలుపలి మండపం దక్షిణం వైపు గోడపై రామాయణ కథ 70 పలకలపై అపసవ్య దిశలో చెక్కబడింది. ఉత్తర గోడపై 25 పలకలపై శ్రీకృష్ణ జీవిత చరిత్ర, మిగిలిన 45 పలకలపై మహాభారతం చెక్కబడింది.

కిర్తిముఖుల శిల్పాలు

ప్రసిధ్ధ హొయసల శిల్పి రువరి మల్లిటమ్మ, ఈ ఆలయంలోని గోపురంలోని పైకప్పు మీద, లోపలి మండపంలోను శిల్పాలు చెక్కాడు.[6] ఈ దేవాలయ ముంగిటిలో ఉన్న పెద్ద శిలలపై అప్పటికి కన్నడ కవి జన్నచే కూర్చబడిన సాహిత్యం, కవితలు చెక్కబడి ఉన్నాయి.

ఇది కూడా చూడండి[మార్చు]

హొయసల సామ్రాజ్యం
చిక్‌మగళూరు

Notes[మార్చు]

  1. Gerard Foekema, A హొయసల దేవాలయాల పూర్తి మార్గదర్శక పుస్తకం, pp 37
  2. ఆలయంపై నున్న విమాన సంఖ్యతో ఏకకుట, ద్వికుట, త్రికుట, చతుర్ఖుట, పంచకుట అని పిలుస్తారు. చతుర్ఖుట, పంచకుట కొద్దిగా అరుదు. కొన్ని మార్లు త్రికుట అంటే గర్భగుడికి మూడు విమానాలు ఉన్నట్టు. Gerard Foekema, రచించిన హొయసల రాజుల కాలంలో ఆలయ నిర్మాణ శైలి, pp 25
  3. A bay is a square or rectangular compartment in the hall, Gerard Foekema, A Complete Guide to Hoysala Temples pp 36 pp 93
  4. A tower on top of the vestibule. The vestibule connects the shrine and the mantapa. The sukanasi is called the nose of the superstructure, Gerard Foekema, A Complete Guide to Hoysala Temples, pp 22
  5. According to historians C. Hayavadhana Rao, J. D. M. Derrett, B. R Joshi, Sala was a mythical founder of the empire, A Concise History of Karnataka pp 123, Dr. S.U. Kamath, History of Karnataka, Arthikaje.
  6. An article Architectural marvel by P.B.Premkumar, Spectrum, Tuesday, January 20, 2004 [1]

వనరులు[మార్చు]

  • Gerard Foekema, A Complete Guide to Hoysala Temples, Abhinav, 1996 ISBN 978-81-7017-345-8
  • Dr. Suryanath U. Kamath, A Concise history of Karnataka from pre-historic times to the present, Jupiter books, 2001, MCC, Bangalore (Reprinted 2002)