ఆరుణి మహర్షి

వికీపీడియా నుండి
(అరుణి మహర్షి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పూర్వకాలమున ఆరుణుడను పేరు గల ముని ఉండెడివాడు.ఆయనకు ఆరుణి యను పేరు గల కుమారుడు గలడు.ఆరుణి చిన్నతనమునుండి తపస్సాధనలో ఉండేవాడు.ఈతడు సర్వ గుణ శోభితుడు, మౌనవ్రతుడు.

బ్రహ్మతేజస్వి.దేవికా నదీతీరాన ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు.

ఒకనాడు ఆరుణి దేవికానదిలో స్నానం చేయుటకు బయలుదేరిపోతూ ఉండగా భయంకరాకారంలో ఒకక్రూరుడు ఎదురుగా రాసాగాడు.మహర్షి శ్రీహరినాయం జపిస్తూ నడుస్తూన్నాడు.అంత

ఆ క్రూరుడు ఆ మహర్షి దివ్వతేజస్సును చూపి మంత్రముగ్ధుడై సాష్ఠాంగపడ్డాడు.అతడొక దొంగల నాయకుడు.అనేక క్రూరకృత్యాలు చేసాడు.మహర్షిని చూడగానే అతని మనస్సు మారినది.వద్దన్నా

మహర్షి వెంటబడ్డాడు.అతనికి సేవ చేయసాగాడు.సంవత్సరముల తరబడిసేవచేస్తూనే ఉన్నాడు.మహర్షికి ఏ ఆపదా రాకుండ కాపాడుచున్నాడు.ఒకనాడొక బెబ్బులి మహర్షి పైకి రాబోగా ఆ దొంగల నాయకుడు బాణంతో దానిని సంహరించాడు.

అది అరుస్తూ ఆరుణి సమీపాన పడి మరణించింది.ఆ అరుపునకు అదిరిపడి నమో నారాయణాయ అని బిగ్గరాగా అన్నాడు.

మరణించి పడివున్న బెబ్బులి శరీరం నుండి ఒక దివ్వ పురుషుడు బయటకు వచ్చాడు.అతడు మహర్షికి నమస్కరించి మహాత్మా నేనొక వీరుడను.విప్రులను బాధించుటచే వారు నన్ను పులివికమ్మని శపించారు.

శాపవిమోచనం ప్రసాదించమని కోరగా వారు నారాయణ మంత్రం నా చెవిని శోకిన మరు క్షణం ఈ పులి రూపం పోయి మనుష్యు రూపం వస్తుందని పలికారు.మీరు పలికిన నారాయణ మంత్రం నేను విన్నాను.శాపవిమోచనం కలిగింది.అని చెప్పాడు.మహర్షి ఆనందించడు

తను సేవించే దొంగలరాజుని పిలిచి నాయనా|నీ సాహసానికి ఎంతో సంతోషంగా ఉంది.నీకు ఏం కావాలో కోరుకో అని పలుకగా దొంగలనాయకుడు మహర్షి మోక్షమార్గ ముపదేశించు అనగా ఆరుణి నీవు నేటి నుండి మాంసము తినడం మాని, సత్య వ్రతుడివై నారాయణ స్మరణ చేయుచూ జీవించు అదే నీకు మార్గం ప్రసాదిస్తూంది.

సాధన చేయి అని మహర్షి మౌనం వహించాడు ముని అదేశానుసారం హరిస్మరణ చేస్తూ తపస్సు ప్రారంభించడు.అతడే సత్యతవుడను నామంతో ముక్తినందాడు.మహర్షుల కృపకు పాత్రులైనవారు దేనినైనా సాధించగలదు గదా.

ఆరుణి మరికొంతకాలమునకు పెళ్ళిచేసికొని, భార్య వలన ఒక కుమారుని కన్నాడు.అతనికి శ్వేతకేతు అని నామకరణం చేసి పెంచి పెద్దచేశారు.తల్లి తండ్రులు .శ్వేతకేతు బ్రహ్మచర్య దీక్షతో విద్యాధ్యయనం సాగించాడు.తను నేర్చినదే సమస్తమని గర్వించసాగాడు.

అంత తండ్రి అతని గర్వమణచి నీవు నేర్చినది చాలా తక్కువ నీకు ఏమియూ తెలియదు.నేర్చుకోవలసినది ఎంతయే ఉంది.గర్వపడకు.ప్రశాంతచిత్తుడవై సర్వమును తెలిసికొనుటకు ప్రయత్నించు.అంతేగాని గ్రహించినదే సర్వమని గర్వపడరాదు అని మందలించగ అతడు తండ్రి పాదాలపై పడి క్షమించమని ప్రార్థిచాడు.అనంతరం తండ్రి వద్ద బ్రహ్మ జ్ఞానం తెలిసికొని

మనస్సు అన్నమయమని, ప్రాణము ఉదకమయమని, వాక్కు తేజోమయమని విభజించి విడమరచి తెలియజేశాడు.పరమాత్మ సర్వస్వమని తెలియజేశాడు.

ఆరుణి కుమారునకు ఇంకనూ తెలియజేస్తూ, నాయానా మర్రి కాయను తెచ్చిపగులగొట్టిన అందు ఏమియూ కనపడదు.కాని ఈ విత్తనము వల్లనే పెద్ద వృక్షము పెరుగుచున్నది.జీవుడు కూడా ఇంతే.నిన్ను నీ వున్న ప్రదేశం నుండి దూరంగా గొనిపోయి అక్కడ నీ కనులకు గంతలు కట్టి నీ ప్రదేశమునకు పో అని అన్ననాడు నీవు రాగలవా దారి తెలిసికోగలవా కష్టపడి సాధించగలవు

అట్లే గురువునుచేరి మానవుడు దారి తెలిసికొని ముక్తి పొందాలి అని ఎన్నో విషయాలు తెలిపాడు.అంతా విని శ్వేతకేతు తండ్రికి పాదాభివందనం చేసి తండ్రిని విడిచిపెట్టి బ్రహ్మర్షియై తరించాడు.

మనిమిప్పుడు చదువుకున్న ఈ ఆరుణి మహర్షి చరిత్ర అంత ప్రచారంలో ఉన్నట్లు కనపడదు.మహర్షులలో ఆరుని మహర్షి ఒకడుగా పరిగణింపబడ్డాడు.అటువంటి పరమపవిత్రుడైన మహర్షి జీవితం మనకు ఆదర్శప్రాయమైనది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]