షంసుద్దీన్ అల్తమష్

వికీపీడియా నుండి
(అల్తమష్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
షంసుద్దీన్ అల్తమష్
ఢిల్లీ సుల్తాను
అల్తమష్ సమాధి (మక్బరా)
Reign1210–1236
Predecessorఅక్రం షాహ్
Successorరుకునుద్దీన్ ఫిరోజ్
మరణంMay 1, 1236
Delhi
Burial
Spousesషాహ్ తుక్రాన్, ఇతరులు
Issueనాసిరుద్దీన్ మహమూద్, రుకునుద్దీన్ ఫిరోజ్, రజియా సుల్తానా, మొయిజుద్దీన్ బహ్రామ్
Names
షంసుద్దీన్ అల్తమష్
రాజవంశంమమ్లూక్
మతంఇస్లాం

షంసుద్దీన్ అల్తమష్ (Shams-ud-din Iltutmish) (Hindi: अलतामश/AlTaMash/Iltutmish)(Persian شمس الدین التتمش) (r. 1211–1236)బానిస వంశానికి చెందిన ఒక రాజు. టర్కిక్ మూలాలు గలవాడు.[1] ఇతను కుతుబుద్దీన్ ఐబక్ యొక్క బానిస. తరువాత ఐబక్ ఇతడిని తన అల్లుడిగా చేసుకున్నాడు. బదాయూన్ గవర్నర్ గా నియమింపబడ్డాదు. ఐబక్ సంతానమైన అరం షాహ్ కు బదులుగాఅ 1211 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు రాజధానిని లాహోరు నుండి ఢిల్లీ కి మార్చాడు. మే నెల 1, 1236 వరకు సుల్తానుగా మరణించేతవరకు వున్నాడు. అల్తమష్, ఢిల్లీ సల్తనత్ కాలంలో వెండి "టంకా" నాణేలను, రాగి "జీతాల్" నాణేలను మూల నాణేలుగా ప్రవేశపెట్టాడు. తన సామ్రాజ్యాన్ని "ఇక్తా"లుగా విభజించి "ఇక్తాదారీ" విధానాన్ని ప్రవేశపెట్టాడు, వీటికి అమీరులుగా అధికారులను జీతాలపై నియమించాడు.

ఇతను మెహ్రౌలీ లో 1230 లో హౌజ్ ఎ షంసీ అనే జలాశయాన్ని నిర్మించాడు, అలాగే దీనినానుకును "జహాజ్ మహల్" నిర్మించాడు. 1231లో ఇతడు ఢిల్లీలో తన కుమారుడైన నసీరుద్దీన్ మహ్మూద్ యొక్క "సుల్తాన్ ఘరీ" సమాధిని (ఢిల్లీ లో ఇస్లామీయ శైలిలో గల తొలి సమాధి), తన స్వీయ సమాధిని (కుతుబ్ కాంప్లెక్స్ లో కలదు) నిర్మించాడు.

అంతర్గత కలహాలను అణచివేశాడు, ఢిల్లీ సల్తనత్ ను స్థిరపరచాడు. కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని పూర్తిగావించాడు.

మంగోలుల నుండి రక్షణ[మార్చు]

అల్తమష్ కాలంలో ఢిల్లీ సల్తనత్ విస్తరణ.

1221 లో మంగోలుల నాయకుడైన చెంఘీజ్ ఖాన్ దురాక్రమణ నుండి అల్తమష్ తన రాజకీయ చతురత వలన, భారత్ వైపు దండయాత్ర జరుగకుండా చూసుకున్నాడు.[2]

మరణము, వారసులు[మార్చు]

అల్తమష్ సమాధి - కుతుబ్ మినార్ దగ్గర ఢిల్లీ

1236 లో మరణించాడు. ఇతడి సమాధి ఢిల్లీ మెహ్రౌలీ లోని "కుతుబ్ కాంప్లెక్స్" లో గలదు.[3] తన వారసురాలిగా రజియా సుల్తానా ను ప్రకటించాడు.

నాణెములు[మార్చు]

తొలి ఘోరీ పాలకులు, రాజపుత్ర నాణెముల విధానాన్నే పాటించారు, దీని ప్రకారం "హిందూషాహీ" విధానంలో ఎద్దు-గుర్రపురౌతు బొమ్మ నాణేలపై వుండేది.[4] వెండి "టంకా" నాణేలు ప్రవేశపెట్టాడు. ఆతరువాత టంకా రూపాయి గా మార్పు చెందినది.[5][6]

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. Faith & philosophy of Hinduism, Rajeev Verma, 2009, page 27
  2. Chandra 2004, p. 40
  3. Ikram 1966, p. 52
  4. Blanchard 2005, p. 1263-64
  5. Blanchard 2005, p. 1264-65
  6. Wink 1997, p. 155

మూలాలు[మార్చు]

  • Blanchard, Ian (2005), Mining, Metallurgy and Minting in the Middle Ages, vol. 3, Franz Steiner Verlag
  • Chandra, Satish (2004), Medieval India: From Sultanat to the Mughals-Delhi Sultanat (1206-1526) - Part One, Har-Anand Publications.
  • Ikram, Sheikh Mohamad (1966), Muslim Rule in India & Pakistan, 711-1858 A.C., Star Book Depot.
  • Jackson, Peter (2003), The Delhi Sultanate: A Political and Military History, Cambridge University Press, ISBN 0-521-54329-0.
  • Mehta, J.L. (1986), Advanced Study in the History of Medieval India, Vol. 1, Sterling Publishers.
  • McLeod, John (2002), The History of India, Greenwood Press.
  • Wink, Andre (1997), Al-Hind: The Making of the Indo-Islamic World, Vol. II - The Slave Kings and the Islamic Conquest 11th-13th centuries, Brill, ISBN 90-04-10236-1.
అంతకు ముందువారు
Aram Shah
Sultan of the Mamluk Dynasty
1211–1236
తరువాత వారు
Rukn ud din Firuz
అంతకు ముందువారు
Aram Shah
Sultan of Delhi
1211–1236
తరువాత వారు
Rukn ud din Firuz