అశోక స్తంభం

వికీపీడియా నుండి

వైశాలి లోని అశోకుని స్తంభం.
వైశాలి లోని అశోకుని స్తంభం.

అశోక స్తంభాలు (Pillars of Ashoka) ఉత్తరభారతదేశంలో తరచూ కానవచ్చే స్తంభాలు. వీటిని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీ.పూ. మూడవ శతాబ్దంలో స్థాపించాడు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

చాలా స్తంభాలలో 'అశోకుని శాసనాలు', 'గౌతమబుద్ధుని ఉపదేశాలు' కానవస్తాయి. ఇందులో సారనాథ్ లోని 'నాలుగు సింహాల' స్తంభం ముఖ్యమైనది. ఈ స్తంభం నేటికినీ సారనాథ్ సంగ్రహాలయం లో భద్రపరచబడినది.

బొమ్మ:Sarnath Lion Capital of Ashoka.jpg
ప్రసిద్ధ 'అశోకుని సింహ రాజధాని', సారనాథ్ సంగ్రహాలయం లో భద్రపరచబడినది.

సారనాథ్ స్తంభం పై భాగాన ఈ 'అశోకుని సింహ రాజధాని, గలదు. ఈ స్తంభంలో అశోకుని శాసనాలు వున్నవి.

ఈ స్తంభంలో, 'కలువ పువ్వు' (క్రిందివైపుకు తిరిగివున్నది), అశోకచక్రం, నాలుగు జంతుబొమ్మలు 'ఏనుగు, ఎద్దు, గుర్రం మరియు సింహం' గలవు.

బొమ్మ:Sarnath Ashoka Pillar.jpg
అశోకుని స్తంభం శిథిలాలు. సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడినవి.

[మార్చు] ఏక సింహ రాజధాని

వైశాలి లోని, ఏక సింహ రాజధాని యొక్క ముఖదృశ్యం.
వైశాలి లోని, ఏక సింహ రాజధాని యొక్క ముఖదృశ్యం.

ఈ ఏకసింహ రాజధాని వైశాలి లో గలదు.

[మార్చు] నోట్స్


[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు


క్రీ.పూ. 238 కి చెందిన ఆరవ స్తంభానికి చెందిన భాగం, ఇందులో అశోకుని శాసనాలు, బ్రాహ్మీ లిపిలో వ్రాయబడినవి. బ్రిటిష్ మ్యూజియం లో భద్రపరచబడినది. లుంబినీ లోని అశోక స్తంభం. థాయిలాండ్ లో చియాంగ్‌మాయి వద్ద గల 'వాట్ ఉ మాంగ్' లో గల అశోక స్తంభం.
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు