ఇక్ష్వాకులు

వికీపీడియా నుండి
ఇది క్రీ.శ.7వ శతాబ్దంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజుల గురించి, ఆంధ్ర ప్రదేశ్ చరిత్రకు చెందిన వ్యాసం.
రామాయణంలో చెప్పబడిన శ్రీరాముని వంశాన్ని గురించిన వ్యాసం ఇక్ష్వాకు వంశము చూడండి.
Guntupalli Buddist site 8.JPG
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
----------- కాలరేఖ -----------
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.త.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు • క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు • క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు • క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు • 210 - 300
బృహత్పలాయనులు • 300 - 350
అనందగోత్రులు • 295 - 620
శాలంకాయనులు • 320 - 420
విష్ణుకుండినులు • 375 - 555
పల్లవులు • 400 - 550
పూర్వమధ్య యుగము 650 - 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు • 624 - 1076
పూర్వగాంగులు • 498 - 894
చాళుక్య చోళులు • 980 - 1076
కాకతీయులు • 1083 - 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320 - 1565
ముసునూరి నాయకులు • 1320 - 1368
ఓఢ్ర గజపతులు • 1513
రేచెర్ల పద్మనాయకులు • 1368 - 1461
కొండవీటి రెడ్డి రాజులు • 1324 - 1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు • 1395 - 1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము • 1336 - 1565
ఆధునిక యుగము 1540 – 1956
అరవీటి వంశము • 1572 - 1680
కుతుబ్ షాహీ యుగము • 1518 - 1687
నిజాము రాజ్యము
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము • 1800 - 1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ
ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాధ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ధి
చారిత్రిక నగరాలు
భట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురి
హంపిసింహపురిహైదరాబాదు
చారిత్రిక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

గ్రామ పాలన: ఇక్ష్వాకుల కాలంలో ఐదేసి గ్రామాలను కలిపి గ్రామ పంచికగా పిలిచేవారు. మహాగ్రామ అనే భూభాగం మహాగ్రామిక ఆధీనంలో ఉండేది. వ్యవసాయం ప్రధాన వృత్తి. పంటలో ఆరో వంతు పన్నుగా చెల్లించేవారు. భూమిపై రాజుకే సర్వాధికారం. వృత్తి పనివారు శ్రేణులుగా ఏర్పడేవారు. పర్ణిక శ్రేణి (తమలపాకుల వారి సంఘం), పూసిక శ్రేణి (మిఠాయిలు చేసేవారి సంఘం) ఉండేవి. వీటికి కులిక ప్రముఖుడు శ్రేణి నాయకుడుగా ఉండేవాడు. దేవాలయాలు, మంటపాల నిర్వహణ కోసం అక్షయనిధి ఉండేది.

సమాజం: వర్ణ వ్యవస్థ ఉండేది. సంఘంలో బ్రాహ్మణులకు అధిక గౌరవం దక్కింది. రాజులు బ్రాహ్మణులకు అగ్రహారాలు, బ్రహ్మదేవాలు బహుమతులుగా ఇచ్చేవారు. సంఘంలో స్త్రీలకు గౌరవం ఉండేది. వృత్తిపనివారు శ్రేణులుగా ఏర్పడి వర్తకం చేసేవారు. బౌద్ధ, జైన భాగవత మతాలు ప్రాచుర్యం పొందాయి. రాణివాసపు స్త్రీలు, వివిధ వృత్తుల వాళ్లు బౌద్ధ విహారాలు, చైత్యాలు, స్థూపాలకు విరివిగా దానాలు చేసేవారు. ఇక్ష్వాకుల శాసనాల్లో నిగమ, గోఠీ అనే పదాలు కన్పిస్తాయి. ఇవి స్వయం సంఘాలని చెప్పొచ్చు.

ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వాణిజ్యం రోమన్ దేశంతో జరిపినట్లు తెలుస్తోంది. అమరావతి, వినుకొండ, చేబ్రోలు, భట్టిప్రోలు, నాగార్జునకొండ ప్రాంతాల్లో రోమన్ బంగారు నాణేలు లభ్యమవ్వడమే ఇందుకు నిదర్శనం. ఘంటశాల, కొడ్డూర (గూడూరు), మైసోలియా (మచిలీపట్నం) తూర్పు తీరంలో రేవు పట్టణాలుగా ప్రసిద్ధి చెందాయి. పశ్చిమ తీరంలో కళ్యాణ్, సోపార, బారుకచ్ఛ ప్రధాన వర్తక రేవులుగా గుర్తింపు పొందాయి.

మత పరిస్థితులు: ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధంతో పాటు, కార్తికేయ, శివ, అష్టభుజస్వామి, మాతృదేవత ఆరాధన కన్పిస్తుంది. అమరావతి, నాగార్జునకొండ మహాసాంఘిక శాఖ భిక్షువులకు కేంద్ర స్థానాలు. ఇక్కడ అపరమహావినయ శైలీయులు, బహుశృతీయులు, మహిశాసకులు మొదలైన బౌద్ధ సంఘాలు నివసించేవారు. బోధివృక్షం, బుద్ధుడి పాదాలు, ధర్మచక్రాలు, మహాస్థూపాలను ప్రజలు ఆరాధించేవారు. నాగార్జునుడు, ఆర్యదేవుడు మహాసాంఘిక శాఖకు ప్రధాన సిద్ధాంతకర్తలు.

శూన్యవాదాన్ని ఆచార్య నాగార్జునుడు, భావవివేకుడు, ఆర్యదేవుడు ప్రతిపాదించారు. ధర్మకీర్తి బౌద్ధయోగాచార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దిన్నాగుడు సంస్కృత భాషలో ప్రమాణ సముచ్ఛయం గ్రంథాన్ని రచించారు. సాంఖ్యసారికా గ్రంథాన్ని ఈశ్వర కృష్ణుడు రచించారు. ఎహువల ఛాంతమూలుడి సేనాని ఎలిసిరి సర్వదేవ ఆలయం నిర్మించాడు. ఇతడి కాలంలోనే పుష్పభద్రస్వామి, హరీతి, కుమారస్వామి ఆలయాలు నాగార్జునకొండ లోయలో నిర్మించారు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె