Coordinates: 16°29′03″N 80°46′33″E / 16.484249°N 80.775802°E / 16.484249; 80.775802

ఉప్పలూరు (కంకిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పలూరు
—  రెవెన్యూ గ్రామం  —
ఉప్పలూరు రైలు స్టేషన్ నామఫలకం
ఉప్పలూరు రైలు స్టేషన్ నామఫలకం
ఉప్పలూరు రైలు స్టేషన్ నామఫలకం
ఉప్పలూరు is located in Andhra Pradesh
ఉప్పలూరు
ఉప్పలూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°29′03″N 80°46′33″E / 16.484249°N 80.775802°E / 16.484249; 80.775802
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి నెర్సు రాజ్యలక్ష్మి
జనాభా (2011)
 - మొత్తం 5,105
 - పురుషులు 2,511
 - స్త్రీలు 2,594
 - గృహాల సంఖ్య 1,394
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్ 08676

ఉప్పులూరు, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కంకిపాడు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1394 ఇళ్లతో, 5105 జనాభాతో 675 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2511, ఆడవారి సంఖ్య 2594. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1993 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 89. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589486[1].పిన్ కోడ్: 521151.సముద్రమట్టానికి 24 మీ. ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో గూడవల్లి, ఈడుపుగల్లు, పునాదిపాడు, గంగూరు, తెన్నేరు గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు ఉన్నాయి.బాలబడి ఉప్పలూరులోను, మాధ్యమిక పాఠశాల మంతెనలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల ఈడుపుగల్లులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గన్నవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ విజయవాడలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఉప్పలూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

76 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ కేంద్ర భవన నిర్మాణం పూర్తి అయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ భవనం ప్రారంభమయినచో, ఉప్పలూరు, వేల్పూరు, మంతెన, తెన్నేరు, ఈడుపుగల్లు, మారేడుమాక తదితర గ్రామాలవారికి లబ్ధిచేకూరగలదు. [8]

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో8 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ఉప్పలూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ఉప్పలూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 119 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 3 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 22 హెక్టార్లు
  • బంజరు భూమి: 12 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 517 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 36 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 515 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఉప్పలూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 432 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 82 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ఉప్పలూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరకు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

రైలు సౌకర్యం[మార్చు]

రైలు వసతి[మార్చు]

మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

బ్యాంక్ ఆఫ్ బరోడా.

పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం[మార్చు]

ఉప్పలూరు గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం, 1950లో స్థాపించబడింది. ఈ సంఘం 25 సంవత్సరాలుగ, లాభాలబాటలో పయనించుచున్నది. ప్రస్తుతం 530 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ కంప్యూటరు ద్వారా వెన్నశాతం రీడింగు, పాల పరిమాణం నిర్ధారణ చేస్తున్నారు. నెలకు రెండుసార్లు, చెల్లింపులు చేస్తున్నారు. సక్రమ నిర్వహణద్వారా ఈ సంఘం వలన, పశుపోషకులకు చాలా మేలు జరుగుచున్నది. పశువుల భీమ పథకం అమలుచెయుచున్నారు. పశువుల దాణా వగైరాలు ప్రభుత్వ ధరలకే అందించుచున్నారు. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించుచున్నారు. పశువులకు సమతుల్యాహారం అందించడంలో సహాయపడుచున్నారు. శాస్త్రీయ పద్ధతులలో పశుపోషణకై అవగాహన సదస్సులు నిర్వహించుచున్నారు. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2021 ఫిబ్రవరి 9లో జరిగిన ఎన్నికలలో లాం సోనియా సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా బొడ్డు నాగమల్లేశ్వరరావు ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామాలయం[మార్చు]

ఉప్పలూరు పాత హరిజనవాడలో ఉన్న ఈ ఆలయాన్ని, 200 సంవత్సరాల క్రితం దళితుల ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ఆలయానికి చెందిన భజనబృందం, జిల్లాలోని నలుమూలలలోనూ ప్రదర్శనలిచ్చేవారు. పౌరాణిక రూపాలతో, శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వంటి పౌరాణిక కార్యక్రమాలు ప్రదర్శించేవారు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన ఈ ఆలయం, శిథిలావస్థకు చేరుకున్నది. దీనిని ఎలాగైనా పునర్నిర్మించాలనే పట్టుదలతో గ్రామస్థులు, ముఖ్యంగా దళితులు నిర్ణయించారు. గ్రామస్థులు, ప్రవాసాంధ్రులు వారి శక్తిమేరకు విరాళాలందించారు. రు. 20 లక్షల అంచనా వ్యయంతో ఈ ఆలయనిర్మాణం పూర్తిచేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఈ ఆలయానికి కావలసిన శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల నూతన విగ్రహాలు అందించారు. భద్రాచలం తరహాలోనే ఇక్కడ గూడా సీతా, రామ, లక్ష్మణ విగ్రహాలు ఏర్పాటుచేసారు. ఈ అలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,జూన్-8వతేదీ బుధవారంనాడు వేకువఝామునే, స్వామివారి సుప్రభాతసేవతో వైభవంగా ప్రారంభమైనవి. ఆరోజున నూతన విగ్రహాలకు గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. 9వ తేదీ మంగళవారం ఉదయం సుప్రభాతసేవ నిర్వహించారు. తదుపరి విశేషపూజలు నిర్వహించారు. 10వ తేదీ బుధవారం వేకువఝామున సుప్రభాతసేవ, మండపరాధన, మూర్తిహోమం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల శిలా విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణగావించారు. [6]&[7]

శ్రీ షిర్డీసాయి మందిరం[మార్చు]

ఈ మందిరం ఎదుట దాతల ఆర్థిక సహకారంతో ఒక విశాలమైన మండపం నిర్మించారు. దీనితో కళ్యాణోత్సవం, భజనలు, అన్నప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించడానికి సౌకర్యం ఏర్పడినది. [10]

శ్రీ భోగమల్లేశ్వర స్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయానికి 9 ఎకరాల మాన్యం భూమి ఉంది. [8]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయానికి 8.55 ఎకరాల మాన్యం భూమి ఉంది. [8] శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, శ్రీ భోగమల్లేశ్వరస్వామివారి ఆలయాలకు కలిపి, ఉమ్మడిగా, 10.27 ఎకరాల మాన్యం భూమి ఉంది. [8]

ప్రముఖులు[మార్చు]

  • అన్నె రాధాకృష్ణమూర్తి - ఈ గ్రామంలో జన్మించిన ఇతను, 1934-37 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ధర్మశాస్త్రంలో బి.య్యే.ఆనర్స్ చదివాడు. అనంతరం 1937-38 లో, రీసెర్చ్ స్కాలర్ షిప్పు పొందారు. ఆ రోజులలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు-5వ తేదినాడు భారతదేశంలో ఆచరించే గురువుల దినోత్సవానికి కారకులైన శ్రీ సర్వేపల్లి గారితో, అనుబంధం కలిగిన ఏకైక ఉపాధ్యాయులు ప్రస్తుతం శ్రీ రాధాకృష్ణమూర్తి కావడం విశేషం. ఇతను 1939 నుండి 2 సంవత్సరాలు ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో అసిస్టెంట్ లెక్చరరుగా, లెక్చరరుగా తర్కశాస్త్ర బోధనలో గడిపినారు. మరోదశాబ్ద కాలం, ఎస్.ఆర్.ఆర్. & సి.వి.ఆర్.కళాశాలలో దర్శనశాస్త్ర, మానసిక శాస్త్ర బోధనతోపాటు, విభాగాధిపతిగా కొనసాగాడు. అప్పుడు కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ ఇతను సహోపాధ్యాయులు. 1968లో ధరణికోటలోని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాలలో ప్రిన్సిపాలుగా బాధ్యతలు చేపట్టాడు. 1974 లో విజయవాడలో ఏర్పాటు చేసిన సిద్ధార్ధ ఆర్ట్స్ కళాశాలలో ఫౌండర్ ప్రిన్సిపాలుగా బాధ్యతలు చేపట్టాడు. రాష్ట్రానికి చెందిన ఎందరో అధికార, రాజకీయ ప్రముఖులు ఇతని శిష్యులు. నందమూరి తారకరామారావు, చనుమోలు వెంకటరావు, పాలడుగు వెంకటరావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి, ప్రముఖ మానసిక శాస్త్రవేత్త కోనేరు రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు డి.జి.పి. సురేంద్రబాబు, జార్జియా దేశంలో భారతదేశ రాయబారి టి. సురేశ్ బాబు, ఇలా ఎందరో ప్రముఖులు ఉన్నారు. విజ్ఞానం పంచే గురువు నిరంతరం విద్యార్థుల సేవలో నిస్వార్ధంగా గడపాలని చెప్పే రాధాకృష్ణమూర్తి, 1983 నుండి ఇటీవలి వరకు, పోరంకిలోని వికాసవిద్యానవనం పాఠశాలకు అధ్యక్షులుగా కొనసాగాడ. గురువృత్తికి వన్నెలద్దిన కొందరిలో ఇతనొకడు. 2017, జూన్ 9న విజయవాడలో ఆనారోగ్యంతో కన్నుమూసాడు.[11]
  • ఏ.బి.కె. ప్రసాద్

గ్రామ విశేషాలు[మార్చు]

  1. శాసనసభ్యులు బోడే ప్రసాద్, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దడానికై, ఉప్పలూర్ గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. [5]
  2. ఉప్పలూరు గ్రామ పరిధిలో మన్నేరు వాగు ఉంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5130. ఇందులో పురుషుల సంఖ్య 2575, స్త్రీల సంఖ్య 2555, గ్రామంలో నివాసగృహాలు 1264 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 675 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,ఆగస్టు-5; 1వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-8; 12వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,నవంబరు-2; 2వపేజీ [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2015,మార్చి-15; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,మే-24; 22వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,జూన్-11; 21వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,జూన్-13; 22వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-5; 10వపేజీ. [10] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,మార్చి-24; 2వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2017,జూన్-10; 14వపేజీ.