Coordinates: 16°01′19″N 81°03′37″E / 16.021875°N 81.060336°E / 16.021875; 81.060336

ఉల్లిపాలెం (నగరం)

వికీపీడియా నుండి
(ఉల్లిపాలెం(నగరం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఉల్లిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఉల్లిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఉల్లిపాలెం is located in Andhra Pradesh
ఉల్లిపాలెం
ఉల్లిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°01′19″N 81°03′37″E / 16.021875°N 81.060336°E / 16.021875; 81.060336
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 265
ఎస్.టి.డి కోడ్ 08648

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఈ పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులు, క్రీడలలో తమ సత్తా చాటుచున్నారు. వీరు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, పతకాలు సాధించుచున్నారు.
  2. ప్రభుత్వం కొన్ని గ్రామీణ పాఠశాలలను ఎంపికచేసి, దశలవారీగా కార్పొరేటు స్థాయికి అభివృద్ధిచేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన "సక్సెస్" పాఠశాలలకు రూపకల్పన చేసింది. ఈ పథకం క్రింద ఈ పాఠశాలను ఎంపిక చేసింది. ఈ పాఠశాలలో గత సంవత్సరం, రు. 33 లక్షలతో అదనపు తరగతి గదులు నిర్మించారు. గ్రామస్థులు, రు. 10 లక్షలతో అదనపు వసతులు సమకూర్చారు. ఈ విద్యాసంవత్సరంలో రు. ఐదున్నర లక్షల రూపాయలతో బల్లలు, కుర్చీలు తదితర సామాగ్రి పంపిణీ చేసారు.
  3. ఈ పాఠశాలలో చదువుచున్న పి.సమతా బ్లెస్సీ అను విద్యార్థిని, ఇటీవల తెనాలిలో నిర్వహించిన జిల్లాస్థాయి "ఇన్స్ పైర్" పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె అను "Earth with garbage Enzime" ప్రాజెక్టును ప్రదర్శించి ఈ అర్హత సాధించింది.
  4. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీమతి జి.రమాదేవి గురుబ్రహ్మ పురస్కారానికి ఎంపికైనారు. ఈ పురస్కారాన్ని ఈమె, విశాఖపట్నంలో 2015,సెప్టెంబరు-20వ తేదీనాడు అందుకుంటారు. ఉపాధ్యాయురాలిగా ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈమె ఈ పురస్కారానికి ఎంపికైనారు.
  5. ఈ పాఠశాలలో చదువుచున్న ఫర్మానా అను విద్యార్థిని, ఇటీవల కడప జిల్లాలోని రైల్వేకోడూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాపోటీలలో తన ప్రతిభప్రదర్శించి, జాతీయస్థాయిపోటీలకు ఎంపికైనది. ఈమె 2016,జనవరి-22 నుండి గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో నిర్వహించు జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటుంది.
  6. ఈ పాఠశాలలో ఒక గ్రంథాలయం గూడా ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు ఇంతవరకు రెండుసార్లు జాతీయస్థాయి క్రీడా పోటీలలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. గత సంవత్సరం ఈ పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో 1005 ఉత్తీర్ణత సాధించారు.
  7. ఇటీవల కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలికల అండర్-14 కబడ్డీ జట్టుకు కెప్టెనుగా ఈ పాఠశాలకు చెందిన కైతేపల్లి వెంకటేశ్వరమ్మ పాల్గొని తన ప్రతిభతో జట్టు విజయానికి తోడ్పడి, జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సంపాదించింది. ఈమె 2016,నవంబరు-17 నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టులో పాల్గొంటుంది.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

రక్షిత మంచినీటి పథకం:- గ్రామ శివారు లోని గౌడపాలెంలో, ఈ పథకం నిర్మాణానికి, 2016,డిసెంబరు-3న శంకుస్థాపన నిర్వహించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి పసుపులేటి అన్నపూర్ణ, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామివారి దేవాలయం.
  2. శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం.

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయము

మూలాలు[మార్చు]