కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కెఎస్‌ఆర్‌ఎమ్ ఇంజనీరింగ్ కళాశాల (కందుల శ్రీనివాస రెడ్డి ఇంజనీరింగ్ మెమోరియల్ కళాశాల), భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైయస్ఆర్ జిల్లా లోని ఒక ఇంజనీరింగ్ కళాశాల.[1] ఇది కడప నగరం వెలుపల, కడప నుండి చింతకొమ్మదిన్నె వెల్లే రహదారిలోని ఎర్రమాసుపల్లె వద్ద ఉంది. ఈ కళాశాల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుమల - తిరుపతినకు అనుబంధ సంస్థ. మాజీ కడప పార్లమెంటు సభ్యుడు కందుల ఓబుల రెడ్డి కుమారుడు కందుల శ్రీనివాస రెడ్డి, న్యాయవిద్య చదువుతుండగా, కొత్త డిల్లీలోని ఒక స్కూటర్ ప్రమాదంలో మరణించిన సందర్బంగా ఈ కళాశాల వారి జ్ఞాపకార్థం1979 లో స్థాపించబడింది.[2]

వివరాలు[మార్చు]

ఈ కళాశాల రాయలసీమ ప్రాంతంలోని ఫిబ్రవరి, 2007 సంవత్సరంలో [ఆధారం చూపాలి] నిర్మించబడిన మొట్ట మొదటి ఇంజనీరింగ్ కళాశాల. దీని నినాదం చీకటిలో వెలుగులుగా ఉంటుంది. వివిధ ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, నిర్వహణ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఈ కళాశాల జవహర్‌లాల్ నెహ్రు టెక్నాలజీ విశ్వవిద్యాలయం, అనంతపురంతో అనుబంధంగా ఉంది.

అందించబడే విద్యా కోర్సులు:

  • బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
  • బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
  • బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
  • బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
  • బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్,
  • బ్యాచిలర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్.

ఎం.టెక్‌లో

  • సివిల్ ఇంజనీరింగ్ (జియోటెక్నికల్ ఇంజనీరింగ్),
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (పవర్ సిస్టమ్స్),
  • ఈసిఈ (డిజిటల్ కమ్యూనికేషన్స్)
  • ఎమ్‌ఈ (సిఏడి/సిఏఎం).
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ [ఆధారం చూపాలి]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "KSRM students excel in sports contests". The Hindu. Retrieved 2016-12-01.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-18. Retrieved 2014-11-12.

వెలుపలి లంకెలు[మార్చు]