కర్నూలు

వికీపీడియా నుండి
  ?కర్నూలు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 15°50′N 78°03′E / 15.83, 78.05
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ప్రాంతం రాయలసీమ
జిల్లా(లు) కర్నూలు జిల్లా జిల్లా
బస్టాండు ఎదుట కర్నూలు పట్టణం దృశ్యం

కర్నూలు దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క ముఖ్య పట్టణం. ఒకప్పుడు కందెనవోలు గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఇప్పుడు కర్నూలుగా మారింది. 1953 అక్టోబరు 1 నుండి 1956 అక్టోబరు 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధాని గా కొనసాగింది. అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు మరియు హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇండ్లు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

విషయ సూచిక

చరిత్ర [మార్చు]

కర్నూలులోని చారిత్రక కొండారెడ్డి బురుజు

ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపూరు లో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో నదిలోకి బళ్లు దిగేముందు బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది.

బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.

1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది.

కర్నూలు mandal map[1]

1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928 లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటి రాయలసీమ అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.

18వ శతాబ్ధం లో కర్నూలు, అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్‌ నవాబు యొక్క జాగీరు లో భాగముగా ఉండేది. 1838 లో ఈ నవాబు యొక్క వారసుని, బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది. నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో బనగానపల్లె సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉన్నది. 1947లో భారత దేశ స్వాతంత్రానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.

కర్నూలు ఎ.పి.ఎస్.ఆర్.టీ.సీ బస్టాండు రాష్ట్రములో మూడో పెద్ద బస్టాండు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రములో రెండో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి.

చూడదగ్గ ప్రదేశాలు [మార్చు]

కర్నూల్ లో చూడదగిన ప్రదేశాలలో ఒకటి బెలూం గుహలు. ఇవి కర్నూలు జిల్లాలో యాగంటి పుణ్య క్షేత్రానికి దగ్గరలో కొలిమిగుండ్ల దగ్గర ఉన్నాయి. ఇక్కడ గుహలను చూడడానికి ప్రజలు దూరప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆ గుహలు చాల చీకటిగాను లోతు గాను వుంటాయి. ఇప్పుడు వాటికీ ఎన్నో మార్పులను చేసి కిటికీలు , వెలుతురు సదుపాయాలు కల్పించారు. కర్నూలు లో పుల్లారెడ్డి నేతిమిఠాయిలు ప్రఖ్యాతి గాంచినవి. . శ్రీశైల0 కూడా ఛాలా ప్రసిద్ది ఛె0దినది.షిర్ది లో తరువాత కట్టిన సాయిబాబ గుడి యిక్కడ ఉంది.

ఉన్నత విద్యా సంస్థలు [మార్చు]

  • ఉస్మానియా డిగ్రీ కళాశాల
  • రాయలసీమ యూనివర్సిటి
  • గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (పురుషులు)
  • మాంటిస్సోరి విద్యాసంస్థలు
  • కర్నూలు వైద్య కళాశాల
  • పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల
  • సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల
  • కె.వి.ఆర్ డిగ్రీ కళాశాల (కశిరెడ్డి వెంకటరెడ్డి)
  • యస్.టి.బి.సి.కళాశాల,
  • బాలశివ డిగ్రీ కళాశాల
  • వాసవి డిగ్రీ కళాశాల,
  • కర్నూలు డిగ్రీ కళాశాల, కర్నూలు,
  • రవి జూనియర్ కళాశాల ,తిప్పా రెడ్డి పల్లె
  • కేశవ రెడ్డి విద్యాసంస్థలు, కర్నూలు
  • సెయింట్ జోసెఫ్ కాలేజీ, కర్నూల్.
  • ఉషొదయ బి.ఈడి కళశాల,ఎమిగనూరు
  • శ్రి వైష్ణవి జూనియర్ కళాశాల,కర్నూలు
  • రామక్రిష్న డీగ్రీ కళాశాల,న0ద్యాల
  • PullaReddy Medical College
  • sri gayatri junior college

అక్టోబరు 2009 వరదలు [మార్చు]

వరదల అనంతరం కర్నూలు పట్టణ దృశ్యం

అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు మరియు హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇండ్లు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.[2] హంద్రీ మరియు తుంగభద్ర నదుల తీరప్రాంతాలలోని ఇండ్లు రెండు అంతస్థులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల ముంపుసమస్య మరింతగా పెరిగింది. రెండు నదులు పట్టణాన్ని రెండువైపున నుంచి ఉధృతరూపంలో ప్రవహించి పట్టణాన్ని చుట్టుముట్టడంతో ప్రజలు భీతిల్లిపోయారు. వరదనీరు చారిత్రక కొండారెడ్డి బురుజు వరకు వచ్చిచేరింది.[3] అక్టోబరు 1 తేది అర్థరాత్రికి మొదలైన వరద సమస్య తెల్లవారుజాము వరకు తీరప్రాంతాలకు వ్యాపించింది. రెండవ తేది మద్యాహ్నం వరకు వరద నీరు ఉధృతరూపం దాల్చి దాదాపు 65 వేల ప్రజలు శిబిరాలలో తలదాచుకున్నారు.[4] అక్టోబర్ 3 సాయంత్రం తరువాత నీటిమట్టం తగ్గింది. ప్రాణనష్టంతో పాటు అపార ఆస్తినష్టం జరిగింది. రోడ్లపై చనిపోయిన పశువుల కళేబరాల దుర్గంధం, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, నీటి సరఫరా మరియు పూర్తిగా మునిగిన ఇండ్లలోని సామాగ్రి, దుస్తులు పనికిరాకుండా పోవడంతో పట్టణ వాసులు తీవ్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

కర్నూలు పట్టణంలో చలనచిత్ర ప్రదర్శనశాలలు [మార్చు]

ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద ఆరు(6) థియేటర్లు గల హాల్ ఆనంద్ సినీ కాంప్లెక్స్ కర్నూల్లో ఉంది.

కర్నూలులో చూడవలసినవి [మార్చు]

మూలాలు [మార్చు]

  1. http://asihyd.ap.nic.in/kurnool/index.htm
  2. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 03-10-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 04-10-2009

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=కర్నూలు&oldid=825818" నుండి వెలికితీశారు