Coordinates: 16°22′26″N 81°20′18″E / 16.374021°N 81.338425°E / 16.374021; 81.338425

కృత్తివెన్ను

వికీపీడియా నుండి
(కృతివెన్ను నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కృత్తివెన్ను
—  రెవిన్యూ గ్రామం  —
కృత్తివెన్ను is located in Andhra Pradesh
కృత్తివెన్ను
కృత్తివెన్ను
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°22′26″N 81°20′18″E / 16.374021°N 81.338425°E / 16.374021; 81.338425
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కృత్తివెన్ను
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 7,980
 - పురుషులు 4,007
 - స్త్రీలు 3,973
 - గృహాల సంఖ్య 1,994
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672

కృత్తివెన్ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం లోని గ్రామం.ఇది సమీప పట్టణమైన పెడన నుండి 37 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2213 ఇళ్లతో, 7585 జనాభాతో 2214 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3763, ఆడవారి సంఖ్య 3822. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 638 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 326. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589380.[1]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బంటుమిల్లిలోను, ఇంజనీరింగ్ కళాశాల భీమవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు భీమవరంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల భీమవరంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కృత్తివెన్నులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కృత్తివెన్నులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కృత్తివెన్నులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1395 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 559 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 33 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 8 హెక్టార్లు
  • బంజరు భూమి: 42 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 174 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 216 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

కృత్తివెన్నులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, చేపలు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ దుర్గాపార్వతీ సమేత శ్రీ నాగేశ్వరస్వామివారి దేవస్థానం[మార్చు]

ఊరికి దూరంగా సముద్రానికి సమీపాన గుడిదిబ్బ గ్రామములోగల శ్రీ నాగేశ్వరస్వామివారి దేవస్థానమునకు విచిత్రమైన కథ ఉంది. ఈ దేవస్థానములో స్వామి గర్భాలయముపై నుండి స్వామి వారి లింగాకృతిపై పిడుగు పడుటచే లింగము ముక్కలుగా విడిపోయింది. తదనంతరము ఆ ఆలయమును పడగొట్టి సరికొత్తగా మరొక ఆలయము నిర్మించి కొత్త లింగమును ప్రతిష్ఠించాలనుకొన్నారు అయితే సమావేశానంతరము ఆరాత్రి వారి కలలో స్వామి కనుపించి తనను కదలించవలదనిన్నీ పాతలింగమును అలాగే ఉంచి ఆలయము నిర్మింపవలెననీ తెలియజేయుటచే కేవలం ఆలయమును మాత్రం కొత్తది కట్టించారు. ఇప్పటికిన్నీ అదే లింగము పూజలందుకొనుచున్నది. మరొక చిత్రమైన విషయము దేవాలయమునకు వెళ్ళిన వారికి అదే లింగమునుండి చిన్న ముక్కను ప్రసాదంగా ఇస్తారు అలా అప్పటినుండి ఇస్తూ వస్తున్నా కూడా లింగములో ఏమాత్రము తరుగుదల లేదని అప్పటి మాదిరిగా ఇప్పటికిన్నీ అలాగే ఉన్నదని ఆలయ పూజారులు చెపుతారు. ఈ ఆలయమునకు తగిన మాన్యము ఉంది. ఏటా శివరాత్రికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. [6]

శ్రీ కోదండరామాలయం[మార్చు]

1952లో నిర్మితమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఆలయ పునర్నిర్మాణానానికి శ్రీకారం చుట్టి, పునర్నిర్మాణం పూర్తిచేసారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థుల సహకారంతోపాటు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారు, రు. 2.80 లక్షల నిధులు సమకూర్చారు. ఈ ఆలయంలో శ్రీ సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారల విగ్రహ, కలశ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, మార్చ్-25వ తేదీ ఉదయం 9-40 గంటలకు, అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిచారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించారు. అనంతరం దేవాలయం వద్ద, భక్తులకు పెద్దయెత్తున అన్నదానం నిర్వహించారు. [4]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయము[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి 51వ పంచరాత్ర మహోత్సవాలు, 2014. డిసెంబరు-2, మంగళవారం నుండి 6వ తేదీ శనివారం, మార్గశిర పౌర్ణమి వరకు, వైభవంగా నిర్వహించారు. ఐదవ రోజు శనివారం నాడు, ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలనుండి సాయంత్రం వరకు, దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. మద్యాహ్నం నుండి విచిత్రవేషధారణల నడుమ, పెద్దయెత్తున మందుగుండు సామగ్రి కాల్చుచూ, కనకడప్పులతో స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా మహిళలు స్వామివారికి హారతులు పట్టి ప్రత్యేకపూజలు నిర్వహించారు.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 16వ వార్షికోత్సవ కార్యక్రమాలు, 2015, ఫిబ్రవరి-12, గురువారం నుండి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. మూడవ రోజు శనివారంనాడు భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. నాల్గవరోజు, 15వ తేదీ ఆదివారం నాడు, స్వామివారిని గ్రామ వీధులలో ఊరేగించెదరు.

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, చేపలపెంపకం, కూరగాయలు పండించుట

గ్రామ విశేషాలు[మార్చు]

  • గ్రామ జనాభాలో ఆచంట పరిసర ప్రాంతాలనుండి వలస వచ్చిన వారు అధికం.
  • ఈ గ్రామములో 2016, ఫిబ్రవరి-29న, దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]