కేసరపల్లి
కేసరపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
కేసరపల్లి గ్రామ నామ ఫలకం | |
అక్షాంశరేఖాంశాలు: 16°31′15″N 80°46′37″E / 16.520759°N 80.777034°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | గన్నవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | సాతులూరి నాగరాజకుమారి |
జనాభా (2011) | |
- మొత్తం | 9,076 |
- పురుషులు | 4,490 |
- స్త్రీలు | 4,586 |
- గృహాల సంఖ్య | 2,384 |
పిన్ కోడ్ | 521102 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
కేసరపల్లి కృష్ణా జిల్లా, గన్నవరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2384 ఇళ్లతో, 9076 జనాభాతో 1770 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4490, ఆడవారి సంఖ్య 4586. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2224 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 304. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589242[1].పిన్ కోడ్: 521102, ఎస్.టీ.డీ.కోడ్=08676. కేసరపల్లి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడకు పరిసర ప్రాంతం.
మెట్రోపాలిటన్ ప్రాంతం[మార్చు]
2017 మార్చి 23న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంటు జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[2]
గ్రామ భొగోళికం[మార్చు]
సముద్రమట్టానికి 24 మీ.ఎత్తులో ఉంది. జాతీయ రహదారిని ఆనుకొని వున్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో వెటరినరీ కాలేజీ, విమానాశ్రయం, ప్రభుత్వ పాఠశాలలు 7వ తరగతి వరకు ఉన్నాయి. జాతీయ రహదారి మీద కేసరపల్లి గ్రామం పొలిమేరల నుండి ప్రసిద్ధ బేకన్ ఫ్యాక్టరీ సరిహద్దు మొదలవుతుంది. కొంత దూరం తరువాత మరో వైపు, గన్నవరం విమానాశ్రయం ప్రారంభమయి దాదాపుగా గన్నవరం ప్రారంభ ప్రవేశ ద్వారం వరకు విస్తరించి వుంటుంది. గన్నవరం, కేసరపల్లి గ్రామానికి మధ్య దూరం మూడు మైళ్ళు.
- విజయవాడ, విశాఖపట్నం జాతీయ రహదారి మార్గంలో కేసరపల్లి గ్రామం ఉంది.
- విజయవాడ నుండి కంకిపాడు మీదుగా గుడివాడ వెళ్ళే రోడ్డులో నుండి కేసరపల్లి గ్రామానికి చేరుకోవచ్చు.
- విజయవాడ నుండి రామవరప్పాడు జాతీయ రహదారి మీదుగా కేసరపల్లి గ్రామానికి వెళ్ళవచ్చు.
సమీప గ్రామాలు[మార్చు]
ఈ గ్రామానికి సమీపంలో బుద్దవరం, గన్నవరం, అజ్జంపూడి, వేల్పూరు, కొండపవుల్లూరు గ్రామాలు ఉన్నాయి.
సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]
కేసరపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
విమానాశ్రయం[మార్చు]
విజయవాడకు 18 కిలోమీటర్ల దూరంలో 5వ జాతీయ రహదారి ప్రక్కన విజయవాడ విమానాశ్రయం ఉంది.ఇచ్చట నుండి హైదరాబాదు,చెన్నై,ఢిల్లీ ప్రాంతములకు విమాన సౌకర్యం ఉంది.7,500 అడుగుల పొడవు గల విమానములు దిగుటకు ఎగురుటకు బాట ఉంది.భారతీయ విమానాశ్రయాల సంస్థ ఆద్వర్యంలో ఈ విమానాశ్రయ మార్గాన్ని ఎక్కువ విమానములు ప్రయానించుటకు అభివృద్ధి చెయుచున్నారు.ఇంతక ముందు కేవలం రెండు విమానాలు ప్రయానించుటకు అనుమతి ఉండేది.కాని ఇప్పుడు రోజుకి ఆరు విమానాలు ప్రయానించుచున్నవి.
విమానాలు | దూరాలు |
---|---|
ఎయిర్ ఇండియా | ఢిల్లీ,హైదరాబాదు |
జెట్ ఎయిర్వేస్ | హైదరాబాదు,బెంగుళూరు,ముంబాయి |
స్పైస్ జెట్ | హైదరాబాదు,బెంగుళూరు |
ఎయిర్ కోస్తా | జైపూరు,బెంగుళూరు |
విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాలలు గన్నవరంలో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల గన్నవరంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బుద్ద్దవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ గన్నవరంలోను, మేనేజిమెంటు కళాశాల గూడవల్లిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[3][4] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది.
ఎన్.టి.ఆర్. పశువైద్య కళాశాల[మార్చు]
కేసరపల్లి సరిహద్దు నందు, ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ కళాశాలను 1998 లో ప్రారంభించారు.ఇక్కడ విద్యార్థులు జంతువులకు సంబంధించిన విద్యను, చికిత్స గురించి అభ్యసిస్తారు.ఇచ్చట నుండి ఎందరో విద్యార్థులు ప్రయోజకులై బయటకి వచ్చారు. ఈ కళాశాలలో 2014, సెప్టెంబరు-29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని, జంతువుల గుండె జబ్బులపై జాతీయస్థాయి సదస్సు నిర్వహించెదరు.
మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల[మార్చు]
శ్రీ పేర్లి దాసు[మార్చు]
- ఈ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ పేర్లి దాసు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. వీరు తన ఉపాధ్యాయ ప్రయాణంలో, ఎక్కువ కాలంపాటు రిసోర్స్ పర్సనుగా అదనపు బాధ్యతలు చూడటంతో, సుమారు 450 మంది బడిబయట పిల్లలను గుర్తించి, బడిబాట పట్టించారు. ప్రస్తుతం వీరు సర్వశిఖా అభియాన్ జిల్లా రిసోర్స్ పర్సనుగా కొనసాగుచున్నారు.
- విద్య, సామాజిక సేవారంగాలలో విశిష్ట సేవలందిస్తున్న వీరికి, 2017,నవంబరు-27న, హైదరాబాదులోని ఆల్ ది బెస్ట్ ఎకాడమీ అను సంస్థ, ఉపాధ్యాయ రత్న అను పురస్కారం అందజేసినది. ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేయుచున్నది.
- 2016,నవంబరు-30న హైదరాబాదులోని రవీంద్రభారతిలో ముంబై నగరానికి చెందిన "మనుష్య బాల్ వికాస్ లోక్ సేవా ఎకాడమీ" అను సంస్థవారి ఆధ్వర్యంలో, గ్లోబల్ టీచర్స్ కాన్ ఫరెన్స్-2016 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో విద్యారంగంలో విశిష్టసేవలందించిన వారికి పురస్కారాలు అందజేసినారు. అందులో భాగంగా వీరికి, గ్లోబల్ హాల్ ఆఫ్ ఫేం టీచర్ అను పురస్కారం అందజేసినారు.
- వీరు ఇటీవల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ పురస్కారo నకు ఎంపికైనారు. వీరికి ఈ పురస్కారాన్ని, ప్రశంసా పత్రాన్నీ, 2016,డిసెంబరు-6న హైదరాబాదులోని సుందరయ్య విఙానకేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సమావేశంలో అందించారు. విద్యార్థి మనో వికాసం, సామాజిక చైతన్యం కోసం వీరు చేసిన కృషిని ఈ సమావేశంలో అతిధులు కొనియాడినారు.
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]
- కేసరిపల్లె శివారు గ్రామమైన దుర్గాపురంలో ఉంది.
- కేసరిపల్లె గ్రామ శివారులోని చెంచుల కాలనీలో ఉంది.
- కేసరపల్లిలోని సుందరయ్య కాలనీలో ఉంది.
వైద్య సౌకర్యం[మార్చు]
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
కేసరపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]
గ్రామంలో ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ పశువైద్య ఉపకేంద్రం ఉంది.
బ్యాంకులు[మార్చు]
- ఆంధ్రా బ్యాంక్.
- సప్తగిరి గ్రామీణ బ్యాంక్.
- సెంట్రల్ బ్యాంక్:- కేసరపల్లి-సావరగూడెం రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంకు బ్రాంచిని, 2015,మార్చి-10వ తేదీ మంగళవారం నాడు ప్రారంభించారు. [7]
వ్యక్తిగత మరుగుదొడ్లు[మార్చు]
దాతల సహకారంతో ఈ గ్రామంలో 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరుగుచున్నది.
తాగు నీరు[మార్చు]
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం[మార్చు]
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
గ్రామ పంచాయతీ[మార్చు]
2021 ఫిబ్రవరిలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో 1 వార్డు మెంబర్ గా మూల్పూరు మాధవన్ ఎన్నికైనారు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ గోపాలకృష్ణమూర్తి విగ్రహo[మార్చు]
కేసరపల్లి గ్రామంలో 2014,ఫిబ్రవరి-23న శ్రీ గోపాలకృష్ణమూర్తి విగ్రహప్రతిష్ఠ ఘనంగా జరిగింది. కృష్ణసాయి హౌసింగ్ ప్రైవేట్ లి., ఆధ్వర్యంలో, ఈ ఆలయంలో, తొలుత గణపతి పూజ, శాంతిహోమాలు నిర్వహించి తరువాత గణపతి, ఆంజనేయ సహిత గోపాలకృష్ణమూర్తి విగ్రహాలను ప్రతిష్ఠించారు.
శ్రీ సోమలింగేశ్వర, గుమ్మడినాగేంద్ర దేవస్థానం[మార్చు]
- ఆ ఆలయంలో, కాలభైరవ, చండీశ్వర, దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మ, నందీశ్వరుడు, ఆంజనేయస్వామి, నాగేంద్రస్వామి దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనా కార్యక్రమాలు, 2014,జూన్-15 నుండి 18వ తేదీ బుధవారం వరకూ నిర్వహించారు. 18వ తేదీ బుధవారం ఉదయం 11-09 గంటలకు విగ్రహ ప్రతిష్ఠలు నిర్వహించారు.
- గుమ్మడి నాగేంద్ర క్షేత్రంలో, ధర్మకర్తలు, దాతల ఆర్థికసహకారంతో, 15 లక్షల రూపాయల అంచనావ్యయంతో నిర్మించనున్న ముఖమండప నిర్మాణానికి, 2015,జూన్-11వ తేదీనాడు, భూమిపూజ నిర్వహించారు.
శ్రీ వీరాంజనేయ, శ్రీ షిర్డీ సాయి మందిరo[మార్చు]
- జాతీయ రహదారిని ఆనుకొని, కేసరపల్లి బైపాస్ వద్దగల శ్రీ వీరాంజనేయ, శ్రీ షిర్డీ సాయి మందిరప్రాంగణంలో నూతనంగా నెలకొల్పిన శ్రీ జంట నాగేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ, 2014, ఆగష్టు-20 బుధవారం ఉదయం 8-46 గంటలకు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, యఙం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు.
- ఇచ్చటకి ఎందరో భక్తులు నమ్మకంతో వీరిని దర్శించుకొనుటకు వచ్చెదరు.
శ్రీ భువనేశ్వరీ పీఠం[మార్చు]
ఈ ఆశ్రమ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా శ్రీ దేవీనవరాత్రి ఉత్సవాలు, పది రోజులపాటు కన్నులపండువగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు విచ్చేసెదరు.
మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]
గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు[మార్చు]
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
గ్రామ విశేషాలు[మార్చు]
ఐటి పార్కు[మార్చు]
ఎల్ అండ్ టి వారి ఆద్వర్యంలో ఈ గ్రామంలో ఐ.టి పార్కును జాతీయ రహదారి ప్రక్కగా నిర్మించారు. దీనిని గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు ప్రారంభించారు. దీనిని 70 కోట్ల వ్యయంతో 23 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఐ.టి పార్కు ప్రారంభము చేత విమానాశ్రయ రద్దీ పెరుగుచున్నది.
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8675. ఇందులో పురుషుల సంఖ్య 4404, స్త్రీల సంఖ్య 4271, గ్రామంలో నివాసగృహాలు 2167 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1770 హెక్టారులు.
భూమి వినియోగం[మార్చు]
కేసరపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 551 హెక్టార్లు
- బంజరు భూమి: 67 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1150 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1218 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]
కేసరపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 1045 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 64 హెక్టార్లు
- చెరువులు: 67 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 40 హెక్టార్లు
ఉత్పత్తి[మార్చు]
కేసరపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు[మార్చు]
పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]
బియ్యం, నూనెలు
మూలాలు[మార్చు]
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 27 March 2017.
- ↑ "School Education Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 27 December 2015. Retrieved 7 November 2016.
- ↑ "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.