కొచ్చి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
మూస:Infobox Indian jurisdiction
కొచ్చిన్ లేదా కొచ్చి (మలయాళం: കൊച്ചി) కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకుళం జిల్లా లోని అతిపెద్ద నగరం.మరియు ఒక రేవు పట్టణం. తరచూ కొచ్చిన్ ని ఎర్నాకుళం అనే వ్యవహరిస్తూ ఉంటారు. కొచ్చి జనాభా 601,574.
[మార్చు] చరిత్ర
కొచ్చిన్ పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పేరొందినదిగా గ్రీకులు, రోమనులు, యూదులు, అరబులు మరియు చైనీయులు ఎరుగుదురు. 1341 వ సంవత్సరములో పెరియార్ నది లో వరదల వలన కోడుంగళ్ళూరు లోని వ్యాపార కేంద్రం నశించడంతో కొచ్చిన్ కి గుర్తింపుకు వచ్చినది.
పలు చరిత్రకారుల ప్రకారం కులశేఖర సామ్రాజ్యము పతనము తర్వాత కొచ్చిన్ రాజ్యము 1102 లో ఏర్పడినది. అప్పట్లో రాజుకు ప్రస్తుతమున్న కొచ్చి పట్టణం తో బాటు చుట్టు ప్రక్కల ప్రదేశాలపై కూడా అధికారము ఉండేది. వంశ పారంపర్యముగా వచ్చెడి రాజవంశమును 'పెరుంపడుప్పు స్వరూపం' లేదా 'కురు స్వరూపం' అని స్థానిక భాషలో వ్యవహరించేవారు.
1503 నుండి 1663 వరకు ఫోర్ట్ కొచ్చిని పోర్చుగల్ పాలించినది. 1773 లో మైసూరు రాజు హైదర్ ఆలీ మలబారు ప్రాంతాన్ని కైవసం చేసుకొని కొచ్చి ని తన రాజ్యంలో కలిపి వేసుకొన్నాడు.
20వ శతాబ్ద ప్రారంభంలో ఇక్కడి వ్యాపారం విస్తరించడంతో దీనిని అభివృద్ధి చేయవలసి వచ్చినది. అప్పటి మద్రాసు గవర్నరు లార్డ్ విల్లింగ్డన్ రాబర్ట్ బ్రిస్టోవ్ అను హార్బరు ఇంజినీరును ఆహ్వానించాడు. 21 ఏళ్ళలో బ్రిస్టోవ్ కొచ్చి పోర్టుని ద్వీపకల్పములోనే ఒక సురక్షితమైన పోర్టుగా మార్చి వేసాడు.