కొవ్వూరు
తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ మండలానికి చెందిన ఇదే పేరు గల గ్రామము కోసం కొవ్వూరు తోర్పు గోదావరి జిల్లా గ్రామం చూడండి.
| ?కొవ్వూరు మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | కొవ్వూరు |
| జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
| గ్రామాలు | 15 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,08,159 (2001) • 53988 • 54171 • 70.81 • 75.0 • 66.63 |
కొవ్వూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు చిన్న పట్టణము.
కొవ్వురు నగరం గోదావరి నది తీరన ఒక సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలుక. పుష్కర సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదు గా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి ఇక్కడ నుండే రైలు-రోడ్డు వంతెన మరియు గోదావరి నది పై నిర్మితమైన కొత్త రైలు వంతెన ప్రారంభం అవుతాయి.
[మార్చు] కొవ్వూరు పేరు వెనుక చరిత్ర
కొవ్వూరు పేరు బ్రిటిషు వారు భారత దేశాన్ని పాలించడానికి మునుపు గోవురు అది కాల క్రమముగా కొవ్వూరు గా మారింది. గోదావరి నది పుట్టడానికి సంబంధించిన ఇతిహాసం గ్రామానికి సంబంధించిన ఇతిహాసం ఉన్నది.
పశ్చిమ గోదావరి జిల్లాలొని ముఖ్య పట్టణాలో కొవ్వూరు ఒకటి. చారిత్రక మరియు సాహిత్య ప్రాధాన్యం ఉన్న రాజమహేంద్రి (రాజమండ్రి)కి ఆవల ఒడ్డున ఉన్నదే కొవ్వూరు.భారతదేశంలోని జీవనదులలో ఒకటైన గోదావరి కొవ్వూరు మీదుగా ప్రవహించి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది.
నేటి కాలంలో కొవ్వూరుగా ప్రసిధ్దమైన ఈ పుణ్యక్షేత్రం గోవూరు లేక గోష్పాద క్షేత్రంగా పిలువబడేది. గోదావరీ తీరాన ఉన్న 'గోపాదాల రేవు' ఆశేష జన సందోహాన్ని ఆకర్షిస్తుంది.గౌతమ మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్టు పురాణగాధలు వివరించాయి. దేవి పురాణం ప్రకారం , పార్వతి దేవి సవతి పోరుని దూరం చేసుకొనుటకు ఒక మాయా ఆవుని సృష్టించి తపమాచరించుచున్న గౌతమ మహర్షి దగ్గరకి పంపగా తపోభంగం కలిగిన మహర్షి ఆ అవును తన తపశ్శక్థితో ధగ్దం చేశాడు. గోహత్యాపాతకం తనకంటకండా ఉండాలంటె దివి నుండి గంగను తీసుకువచ్చి ఆ గోవు మరణించిన ప్రదేశంలొ ప్రవహింపచేయాలని చెప్పిన పార్వతి దేవి ఆనతి మేర గౌతమ ఋషి తపస్సు చేసి గంగమ్మను దివి నుండి భువికి తెప్పించాడు. ఆ హిమగంగ పారిన ప్రదేశమే గోష్పాద క్షెత్రంగా, ఆ గంగే గౌతమి (గోదావరి) గా ప్రసిద్ధి చెందాయి. బ్రిటీష్ వారి కాలంలొ గోవూరు కాస్తా కొవ్వూరుగా మారింది.పన్నెండు వత్సరములకొక సారి వచ్చే గోదావరి పుష్కరములందు దేశపు నలుమూలల నుండి ఆశేష భక్తజనం ఈ గోష్పాద క్షేత్రమును దర్శించి, పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరిస్తారు.
కొవ్వూరు నుండి రాజమండ్రి వరకు గోదావరి పై కట్టిన మూడు వంతెనలు ఇక్కడి ప్రత్యేకత. సుమారు నూరు సంవత్సరాల క్రితము సర్. ఆర్థర్ కాటన్ కట్టించిన రైలు వంతెన ఇప్పటికి చెక్కుచెదరకండా ఉండటం విశేషం.
÷పిల్లలమర్రి.సర్వెస్వరరావు==శాసనసభ నియోజకవర్గం==
- పూర్తి వ్యాసం కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] దృశ్యమాలిక
[మార్చు] గ్రామాలు
- కొవ్వూరు
- అరికిరేవుల
- చిడిపి
- చిగురులంక (నిర్జన గ్రామము)
- డేచెర్ల
- ధర్మవరం
- దొమ్మేరు
- ఇసుకపట్లపంగిడి
- కుమారదేవం
- మద్దూరు
- మద్దూర్లంక
- నందమూరు
- పశివేదల
- పెనకనమెట్ట
- తోగుమ్మి
- వాడపల్లి
- వేములూరు
- కాపవరం
- పెనకల మెట్ట
- పంగిడి
|
||||||||||||||||||||
|
|
|
|---|---|
| కొవ్వూరు · అరికిరేవుల · చిడిపి · చిగురులంక (నిర్జన గ్రామము) · డేచెర్ల · ధర్మవరం · దొమ్మేరు · ఇసుకపట్లపంగిడి · కుమారదేవం · మద్దూరు · మద్దూర్లంక · నందమూరు · పశివేదల · పెనకనమెట్ట · తోగుమ్మి · వాడపల్లి · వేములూరు |