గుంటూరు
| ?గుంటూరు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 11,391 కి.మీ² (4,398 చ.మై) |
| ముఖ్య పట్టణము | గుంటూరు |
| ప్రాంతం | కోస్తా |
గుంటూరు దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి ఒక ముఖ్య నగరము మరియు అదే పేరుతో గల గుంటూరు జిల్లాకు పరిపాలనా కేంద్రము. ఈ పట్టణము 6,00,000 జనాభాతో రాష్ట్రం లోని ఐదవ పెద్ద నగరము. భారత దేశములోని పెద్ద విశ్వవిద్యాలయములలో ఒకటైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము గుంటూరు - మంగళగిరి మధ్యలో ఉన్నది.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ జిల్లా కూడా ఉంది. క్రీస్తు శకం 8 వ శతాబ్దం నుండి 12 శతాబ్దం వరకూ ధరణికోటను రాజధానిగా చేసుకుని నేటి ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రీకుల పూర్వీకులైన కోట వంశస్తులు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పాలించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్యాన సుందరమైన కొండవీడు పర్వత శ్రేణికి 9 కి మీ ల తూర్పున గుంటూరు పట్టణం ఉన్నది. అదే పేరుతోనున్న జిల్లా, రెవెన్యూ విభాగం, మండలానికి ఈ పట్టణం కేంద్రము. 1866 లో ఏర్పడిన గుంటూరు పురపాలక సంఘం రాష్ట్రం లోని అతి పురాతనమైన పురపాలక సంఘాలలో ఒకటి. 18 వ శతాబ్దపు మధ్యలో ఇది ఫ్రెంచి వారి చేతుల్లోకి వెళ్ళినా, 1788 లో శాశ్వతంగా బ్రిటిషు వారికి సొంతమైంది. 1995లో నగరపాలక సంస్థగా [1] మార్చ బడినది. ప్రస్తుతం గుంటూరు పట్టణంలో భాగమైన రామచంద్రాపురము అగ్రహారము అను గ్రామము గుంటూరు కంటే ఎంతో ప్రాచీనమైనదిగా భావించుచున్నారు. లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయపు మంటపం యొక్క స్థంభంపైనున్న 1296 నాటి శాసనాలలో దీని పేరు కనిపించుచున్నది.
నగర పరిధి [మార్చు]
గుంటూరు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేయనున్నారు.విలీనానికి ప్రతిపాదించబడిన గ్రామాలు:పెదకాకాని ,వెనిగండ్ల ,అగతవరప్పాడు ,తక్కెళ్ళపాడు ,ఉప్పలపాడు ,ఏటుకూరు ,దాసరిపాలెం ,నల్లపాడు ,రెడ్డిపాలెం ,అడవితక్కెళ్ళపాడు , అంకిరెడ్డిపాలెం ,గోరంట్ల ,లాం ,బుడంపాడు .పెదకాకాని,నల్లపాడు గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామపంచాయితీలు గ్రేటర్ లో కలవటానికి అంగీకరించాయి. నగర జనాభా 6 లక్షలు. 52 డివిజన్లు. సమీప పంచాయతీల విలీనం జరిగితే జనాభా 8 లక్షలకు చేరుతుంది. జవహర్లాల్ నెహ్రూ నగర నవీకరణ పథకం (JNNURM) కింద నిధులు పొందటానికి వీలుంది.
నగర పాలన సంస్థ [మార్చు]
నగర పాలక సంస్థ కు వార్డు సభ్యులను, మేయర్ ను ప్రజలు ఎన్నుకుంటారు. వీరి ఆధ్వర్యంలో నడిచే నగర పాలన సంస్థ కి అత్యున్నత అధికారి కమీషనర్ . వీరికి సహాయంగా అదనపు కమీషనర్, ఖాతాపరీక్షకుడు,ఉప కమీషనర్, పురపాలక ఇంజనీర్, అరోగ్య అధికారి, జీవశాస్త్రవేత్త, ఉప నగర ప్రణాళిక అధికారి వుంటారు.
రైల్వే జంక్షన్ [మార్చు]
గుంటూరు ప్రముఖ రైల్వే జంక్షను. విజయవాడ, రేపల్లె, మచిలీపట్నం, హైదరాబాదు, మాచర్ల, తెనాలి మొదలైన పట్టణాలకు రైలు మార్గం ద్వారా కలపబడి ఉన్నది. గుంటూరు-తెనాలి రైలుమార్గాన్ని డబ్లింగ్ విద్యుదీకరణ, గుంటూరులో మరో పిట్ లైన్ ఏర్పాటు, నల్లపాడు- పగిడిపల్లి మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ, వినుకొండ-విష్ణుపురం, నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ఏర్పాటు లాంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి.
విద్యాకేంద్రం [మార్చు]
గుంటూరు ప్రముఖ విద్యా కేంద్రము మరియు వ్యాపార కేంద్రము. పత్తి, నూనె, ధాన్యం మిల్లులే కాక పొగాకును శుద్ధి చేసే బారనులు పట్టణము చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వర్జీనియా పొగాకుకు గుంటూరు ముఖ్య కేంద్రం. భారత పొగాకు నియంత్రణ బోర్డు కూడ గుంటూరులో కలదు.
గుంటూరు ప్రత్యేకతలు [మార్చు]
- 1868, ఆగష్టు 18 న గుంటూరులో నుండి సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూస్తూ పియర్ జాన్సన్ అనే శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొన్నాడు. అప్పటి సూర్యగ్రహణం అసాధారణంగా 10 నిముషాల సేపు వచ్చి, ఎందరో శాస్త్రవేత్తలను ఆకర్షించింది.
- మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన అప్పటి అతి పెద్ద ప్రయాణీకుల ఓడ- టైటానిక్ నౌక లోనున్న ఒక కుటుంబం గుంటూరు కు సంబంధించినది.
- పాకిస్తాన్ ఏర్పాటుకు కర్త అయిన మొహమ్మదు ఆలీ జిన్నా పేరిట గుంటూరులో ఒక స్థూపం ఉన్నది. (హిందూ పత్రికలోని ఈ వ్యాసం దీని ప్రత్యేకతను వివరిస్తుంది)
- గుంటూరు యొక్క ప్రాచీన నామము గర్తపురి.
- గుంటూరు నగరంలోని రామచంద్రాపుర అగ్రహారం అతిపురాతనమైన ప్రాంతం.
- స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త వావిలాల గోపాలక్రిష్ణయ్య గారి జన్మస్ధలం గుంటూరు.
- గుంటూరు నగరానికి విద్య, ఆరోగ్య రంగాలలో మంచి గుర్తింపు గలదు.
- కేంద్రీయ వ్యవసాయ పరిశోధన కేంద్రము గుంటూరు సమీపములోని ' లాం ' వద్ద కలదు. ఇచ్చట వివిధ వ్యవసాయ ఉత్పత్తులలో సరిక్రొత్త వంగడాలను కనుగొనడానికి పరిశోధోన జరుగును.
- గుంటూరు పొగాకు వ్యాపారానికి మరియు మిర్చి, ప్రత్తి ఉత్పత్తికి బాగా ప్రసిద్ది చెందినది.
- మిర్చి శీతల గిడ్డింగ్ లు ( కోల్డ్ స్తోరేజేస్ ) ఎక్కువగా ఉన్నప్రదేశాల లో గుంటూరు ఆసియా లో నే రెండవ స్థానం లో ఉన్నది.
- అభ్రకము (మైకా) 2200 సంవత్చరాల క్రితము మొదట గుంటూరు ప్రాంతము లొనే కనుగొనపడింది.
- తొలి భారత కళాశాలలో ఒకటైన ఆంధ్ర క్రైస్తవ కళాశాల 1885 లొ గుంటూరులో స్థాపించబడినది.
- ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు.
- మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల లో విద్యాబ్యాసం చేశారు.
మూలాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
|
||||||||||||||
|
|
|
|---|---|
| చినపలకలూరు · పెదపలకలూరు · జొన్నలగడ్డ · గోరంట్ల (గుంటూరు మండలం) · నల్లపాడు (గ్రామీణ) · గుంటూరు(గ్రామీణ) · అక్కిరెడ్డిపాలెం(గ్రామీణ) · పొత్తూరు · చౌడవరం · ఏటుకూరు · బుడంపాడు · గుంటూరు · లాలుపురం |
