గుండమ్మ కథ
| గుండమ్మ కథ (1962) | |
| దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
|---|---|
| నిర్మాణం | బి.నాగిరెడ్డి , చక్రపాణి |
| రచన | పింగళి నాగేంద్రరావు |
| కథ | చక్రపాణి |
| తారాగణం | నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, రేలంగి , జమున , ఎస్.వి.రంగారావు , సూర్యకాంతం , ఛాయాదేవి , రమణారెడ్డి , హేమలత , హరనాథ్ , ఎల్ విజయలక్ష్మి , ముక్కామల, ఋష్యేంద్రమణి , రాజనాల |
| సంగీతం | ఘంటసాల |
| నేపథ్య గానం | ఎస్.జానకి, పి.లీల, ఘంటసాల, పి.సుశీల |
| గీతరచన | పింగళి నాగేంద్రరావు |
| సంభాషణలు | డి.వి.నరసరాజు |
| ఛాయాగ్రహణం | మార్కస్ బార్ట్లీ |
| నిర్మాణ సంస్థ | విజయా ప్రొడక్షన్స్ |
| విడుదల తేదీ | 7 జూన్ 1962 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో ఆఖరి విజయవంతమైన చిత్రం గుండమ్మ కథ. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కధ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి.
విషయ సూచిక |
[మార్చు] సంక్షిప్త చిత్రకథ
గుండమ్మ (సుర్యకాంతం) ఒక గయ్యాళి గృహిణి. ఆమె స్వంత కూతురు సరోజగా జమున, సవతి కూతురు జమునగా సావిత్రి నటించారు. ఇంటెడు చాకిరీ సవతి కూతురు మీద పడుతుంది. స్వంత కూతురు మాత్రం పెంకిగా తయారవుతుంది. గుండమ్మగారి గతించిన భర్తకు స్నేహితుడైన ఒక జమీందారు రామ భద్రయ్య (ఎస్.వి.రంగారావు) పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్ధం చేసుకొంటాడు. ఇద్దరు పిల్లలనూ తన కోడళ్ళుగా చేసుకొని చనిపోయిన తన స్నేహితుని ఆత్మకు శాతి కలిగించాలనుకొంటాడు.
వారి పధకం ప్రకారం పెద్దకొడుకు అంజి (ఎన్.టి.ఆర్.) గుండమ్మగారి ఇంట్లో పనివాడిగా చేరతాడు. పొగరున్న పనిమంతుడుగా గుండమ్మ విశ్వాసాన్ని, తోటి పనివాడిగా లక్ష్మి మనసును చేజిక్కించుకుంటాడు. ఇంట్లోనే ఉండి చాకిరీ చేస్తాడని గుండమ్మ అంజికి సవతికూతురునిచ్చి పెళ్ళి చేస్తుంది. ఇక రామ భద్రయ్య రెండవ కొడుకు రాజా (ఏ.ఎన్.ఆర్.) సరోజను పెళ్ళి చేసుకొని కాస్త కటువుగా ప్రవర్తించి ఆమె పెంకి తనాన్ని అదుపులో పెడతాడు.
[మార్చు] చిత్రవిశేషాలు
పౌరాణిక చిత్రాల దర్శకునిగా పేరు పొందిన కమలాకర కామేశ్వరరావు ఈ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించి శభాష్ అనిపించుకొన్నాడు. ఊ చిత్రానికి మాతృక ఒక కన్నడ సినిమా. అందులో గుండమ్మ మొగుడి పాత్ర ఉంది. చేత కాని మొగుడు ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు దండగ.. కథకు అడ్డు వస్తున్నాడని ఆ పాత్రని తీసి గుండమ్మకు వైధవ్యం కలిగించారు చక్రపాణి. ఐత ఈ చిత్రకథ విజయా సంస్థ కుటుంబ సభ్యుడు, పాతాళభైరవి, మాయాబజార్ వంటి ఎనలేని రత్నాలన విజయా వారి కీర్తి కిరీటంలో పొదిగిన దర్శకుడు కె.వి. రెడ్డి గారికి నచ్చ లేదు. ఈచిత్రం ఎంత మాత్రము విజయం సాధించదని నిక్కచ్చిగా చెప్పేశారు. కాని చిత్రం విజయవంతమైనా ఆయన ఉద్దేశం మార్చుకోలేదు. ఈ చిత్రంలోని ఒక పాట కోలో కోలో... యన్న కోలో నాసామి కొమ్మరిద్దరు మంచి జోడు... ఈ పాటలో నాగేశ్వరావు, రామారావు, సావిత్రి, జమున నలుగురు నటించారు. సినిమా తీసె సమయంలో హీరోలిద్దరికి ఒకేసారి సమయం చిక్కనందున... నాగేశ్వరావు... జమునను ఒకసారి, రామారావును.. సావిత్రిని ఒకసారి విడివిడిగా ఈ పాటను చిత్రీకరించారు. అయినా ఆతేడా ఎక్కడా సినిమాలో కనబడదు. ఎంత అద్బుతమో?? ఎంత మంది ప్రముఖులు ఈ సినిమాపై పెదవి విరువగా ధైర్యంలేక ఈ సినిమా చాల కాలం విడుదలకు నోచుకోలేదు. చివరకు సాహసించి విడుదల చేయగా ఎవరు ఊహించినంత విజయం సాదించింది. అప్పటికి కె.వి.రెడ్డి గారు ఇందులో ఏముందని అంతగా విజయం సాగించింది నాకేం అర్థం కాలే దనేవారు. అలాంటి సినిమా తెలుగు చలనచిత్ర జగతిలో ఆణి ముత్యాలనదగిన కొద్ది చిత్రాలలో ఇది ఒకటిగా ఈ నాటికి కొనసాగడము చిత్రమే .....?????.
[మార్చు] గుండమ్మ కథ సినిమాలో కొన్ని సన్నివేశాలు
[మార్చు] సంభాషణలు
డి.వి.నరసరాజు పసందైన సంభాషణలు అందించాడు. మచ్చుకు:
- పాలలో నీళ్ళు కలపకపోతే పెట్రోల్ కలుపుతారా?
- వున్నోళ్ళంతా యదవలైతే మన తెలివికేం? దివిటీలా వెలిగిపోదూ?
- ఆశకు చావు లేదు
[మార్చు] సంగీతం సాహిత్యం
ఈ సినిమాలో ఘంటసాల బాణీలు కూర్చిన పాటలు చిరకాలం నిలచిపోయాయి.
- కోలు కోలోయమ్మ కోలో! కొమ్మలిద్దరు మాంచి జోడూ
- వేషము మార్చెను, భాషను మార్చెను... అయినా మనిషి మారలేదూ.. ఆతని ఆస తోరలేదూ
- ప్రేమ యాత్రలకు బృందావనము కాష్మీరాలు ఏలనో
ఈ పాటలలో పింగళి నాగేంద్రరావు "సఖినెర చూపుల చల్లదనం", "జగమున ఊటీ సాయగా" వంటి అందమైన పదాలు క్రొత్తగా పొందుపరచాడు. ప్రేయసి జడను వలపుపాశంతో పోల్చాడు.
[మార్చు] పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఎంత హాయి ఈ రేయి, ఎంత మధుర మీ హాయి | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
| కోలోకోలో యన్నకోలో నాసామి కోమ్మలిద్దరు మాంచిజోడు | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
| ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
| మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటిలే | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల |
| లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల |
| వేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
| సన్నగవీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయె | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | పి.సుశీల |
| అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ, రుసరుసలాడే చూపులతోనే ముసిముసి నవ్వుల చందాలూ | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | పి.సుశీల |
[మార్చు] మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- http://www.idlebrain.com/nosta/index.html