గుల్బర్గా
|
|
This article may require cleanup to meet Wikipedia's quality standards. (March 2010) |
|
|
This article needs additional citations for verification. (May 2010) |
| ?ಗುಲ್ಬರ್ಗ Gulbarga Karnataka • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 454 మీ (1,490 అడుగులు) |
| Division | Gulbarga Division |
| జిల్లా(లు) | Gulbarga District జిల్లా |
| Municipal commissioner | |
| కోడులు • పిన్కోడు • టెలిఫోను • వాహనం |
• 585101 • +91 8472 • KA32 |
భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా (కన్నడ: ಗುಲಬರ್ಗಾ, ఉర్దూ: گلبرگہ) నగరం ఉంది. ఇది గుల్బర్గా జిల్లా మరియు గుల్బర్గా విభాగం యొక్క పాలనా కేంద్రంగా ఉంది. ఇది గతంలోని నిజాంల యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. హైదరాబాద్ నుండి 200 కిమీ మరియు బెంగుళూరుకు ఉత్తరంగా 623 కిమీ దూరంలో గుల్బర్గా ఉంది.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
6వ శతాబ్దంలో, రాష్ట్రకూటులు ప్రస్తుత గుల్బర్గా చుట్టుప్రక్కల ప్రాంతం మీద నియంత్రణను సాధించారు, కానీ చాళుక్యులు వారి రాజ్యాన్ని తిరిగి సంపాదించి రెండు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించారు. 12వ శతాబ్దం చివరినాటికి, దేవగిరి యాదవులు మరియు హళేబీడు హోయసాలులు ఈ జిల్లాను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ప్రస్తుత గుల్బర్గా జిల్లా మరియు రాయచూరు జిల్లా, వారి రాజ్యంలో భాగంగా ఉండేవి.
14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు వారి రాజధానిగా గుల్బర్గా నగరాన్ని స్థాపించారు. గుల్బర్గా జిల్లాతో పాటు ఉన్న ఉత్తర డెక్కన్ ముస్లిం సుల్తనేట్ ఆఫ్ ఢిల్లీ నియంత్రణలో ఉంచబడింది. ఢిల్లీకి చెందిన ముస్లిం అధికారులను నియమించటం కారణంగా ఏర్పడిన తిరుగుబాటు ఫలితంగా బహమనీ సుల్తనేట్ను 1347లో హసన్ గంగూ స్థాపించారు, ఆయన గుల్బర్గాను(ఆ కాలంలో అసేనాబాద్గా ఉంది) తన రాజధానిగా ఎంచుకున్నారు.
1724 నుండి 1948 వరకు ప్రఖ్యాత నిజాంలచే పాలించబడిన హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా గుల్బర్గా ఉంది. నిజాంలను భారత సైనికదళం ఓడించిన తరువాత సెప్టెంబర్ 1948లో ఇది భారతదేశంలో విలీనం అయ్యింది.
శీతోష్ణస్థితి [మార్చు]
గుల్బర్గా ప్రధానంగా మూడు ఋతువులను కలిగి ఉంది. వేసవికాలం ఫిబ్రవరి చివర నుండి జూన్ మధ్య వరకు ఉంటుంది. దీనిని నైరుతి ఋతుపవనాలు అనుసరిస్తాయి, ఇవి జూన్ చివర నుండి సెప్టెంబర్ చివర వరకు ఉంటాయి. దీని తరువాత పొడిగా ఉండే శీతాకాల వాతావరణం జనవరి మధ్య వరకు ఉంటుంది.
వేర్వేరు ఋతువుల్లోని ఉష్ణోగ్రతలు:
- వేసవికాలం : 40 నుండి 46 °సెం
- వర్షాకాలం: 27 నుండి 37 °సెం
- శీతాకాలం: 11 నుండి 26 °సెం
జనాభా [మార్చు]
2001 భారత జనగణన ప్రకారం,[1] గుల్బర్గాలో 427,929 మంది జనాభా ఉన్నారు. మొత్తం జనాభాలో పురుషులు 52% మరియు స్త్రీలు 48% ఉన్నారు. గుల్బర్గాలో సగటు అక్షరాస్యతా రేటు 67%, ఇది జాతీయ సగటు 59.5% కంటే అధికంగా ఉంది: పురుషుల అక్షరాస్యత 73%, మహిళల అక్షరాస్యత 60%గా ఉంది. గుల్బర్గాలో 13% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసును కలిగి ఉన్నారు.
కన్నడ, మరాఠీ మరియు ఉర్దూ ప్రధానంగా మాట్లాడే భాషలలో ఉన్నాయి. నగరంలో ప్రధానంగా అనుసరించే మతాలలో హిందూమతం మరియు ఇస్లాం ఉన్నాయి. ఉర్దూ మాట్లాడే ముస్లిం జనాభాను హైదరాబాద్ విపరీతంగా ప్రభావితం చేసింది.
మతసంబంధ ప్రాముఖ్యమున్న ప్రదేశాలు [మార్చు]
గుల్బర్గా చుట్టుప్రక్కల దర్శించటానికి అనేక సుందరమైన దేవాలయాలు ఉన్నాయి: శ్రీ శరణ బస్వేశ్వర్ ఆలయం, శ్రీ సద్గురు దత్తాత్రేయ నరసింహ సరస్వతి దేవుని యొక్క ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ క్షేత్ర ఘనగాపూర్(ఘనగాపుర), శ్రీ. హులకంఠేశ్వర్ ఆలయం(హెరుర్. B), మరియు భీమా నదీ తీరంలో ఘథార్గి భాగమ్మ ఆలయం (ఆఫ్జల్పూర్ తాలూకా) ఉన్నాయి.
గుల్బర్గాలో మతపరంగా ప్రాముఖ్యమైన ప్రదేశాలలో ఖ్వాజా బందే నవాజ్ దర్గా, శరణ బసవేశ్వర్ దేవస్థానం మరియు షేక్ రోజా దర్గా ఉన్నాయి. ఈ ఆరాధనా స్థలాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ సందర్శిస్తారు.
వంటకాలు [మార్చు]
జొన్న రొట్టె : ఈ ప్రాంతంలో జొన్న రొట్టె ప్రధాన ఆహారంగా ఉంది. దీనిని జొన్న పిండితో తయారుచేస్తారు. జొన్న రొట్టెతో పాటు సంప్రదాయమైన కూర మరియు కారంగా ఉండే వేరుశనగల పొడిని వడ్డిస్తారు. సాధారణంగా, రాష్ట్రంలోని మిగిలిన భాగాలతో పోలిస్తే గుల్బర్గాలో ఆహారం బాగా కారంగా ఉంటుందని భావించబడుతుంది.
హూరణ హోలిగే : ఈ తీపివంటకం ఈ ప్రాంతానికే చెందిన ప్రత్యేక వంటకం మరియు అన్ని పండుగల సమయంలో దీనిని తయారుచేస్తారు. ఇది పూరణం పెట్టిన దోశవంటిది. శనగలు మరియు బెల్లంను మెత్తగా రుబ్బి గోధుమపిండిలో పూరణంగా పెట్టి వండుతారు. దీనితో నంచుకోవటానికి మామిడి పండు గుజ్జును వడ్డిస్తారు.
మాల్పురి : ఈ తీపిపదార్థాన్ని గోధుమపిండి మరియు కోవాతో చేస్తారు.
ముద్ది పాల్య : కందిపప్పుతో, వేయించిన పాలకూర, మెంతికూర వంటి ఆకులను కలిపి ఈ కూరని చేస్తారు. ఇది చాలా కారంగా ఉండే కూర. దీనిని సాధారణంగా ఈ ప్రాంతంలోని బ్రాహ్మణులు వండుకుంటారు. గుల్బర్గాలోని బ్రాహ్మణుల యొక్క పండగలు మరియు శుభకార్యాలలో ఇది తప్పనిసరిగా చేసే వంటకం.
తహరి : గుల్బర్గాలో ప్రసిద్ధి చెందిన తహ్రి లేదా తహరి అనే వంటకం పలావును పోలి ఉంటుంది. సంప్రదాయబద్ధమైన బిర్యానీలో మాంసానికి అన్నాన్ని కలపగా తహ్రిలో అన్నానికి మాంసాన్ని కలుపుతారు.
రవాణా [మార్చు]
గుల్బర్గా రోడ్డు మరియు రైలు మార్గం ద్వారా బెంగుళూరు, ముంబాయి మరియు ఇతర అతిపెద్ద నగరాలకు కలపబడింది.
స్థానిక రవాణా [మార్చు]
నగరంలోపల అందుబాటులో ఉండే రేటుతో తిరగటానికి ఆటోరిక్షాలు లభ్యమవుతాయి. NEKRTC సిటీ బస్సులు నగరంలోపల మరియు సమీపాన ఉన్న పట్టణాలు ఇంకా గ్రామాలలో తిరుగుతాయి.
సుదూర ప్రాంతాల కొరకు బస్సు మార్గాలు [మార్చు]
కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (KSRTC) ఇతర నగరాలకు మరియు గ్రామాలకు బస్సులను నడుపుతుంది. అంతేకాకుండా అనేక ప్రైవేటు బస్సు సేవలు కూడా ఉన్నాయి. బీదర్-శ్రీరంగపట్నం మధ్య ఉన్న రాష్ట్ర హైవే వల్ల బెంగుళూరు మరియు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా చేరుకోవటాన్ని సులభతరం అయ్యింది. బెంగుళూరు మరియు గుల్బర్గా, ఇంకా ముంబాయి మరియు గుల్బర్గా మధ్య ఓల్వో బస్సులను అనేక ప్రైవేటు సర్వీసులు నడుపుతున్నాయి.
రైల్వేలు [మార్చు]
గుల్బర్గా అతిపెద్ద రైలు మార్గంను కలిగి ఉంది మరియు భారతదేశంలోని అతిపెద్ద నగరాలు అన్నింటికీ ఇక్కడ నుండి చక్కటి రైలు సదుపాయాలు ఉన్నాయి, ఆ నగరాలలో బెంగుళూరు, ముంబాయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, త్రివేండ్రం, కన్యాకుమారి, పూణే, భుబనేశ్వర్, భోపాల్ మరియు ఆగ్రా ఉన్నాయి.
విద్య [మార్చు]
గుల్బర్గాలోని విశ్వవిద్యాలయం గుల్బర్గా యూనివర్శిటీని [2] 1980లో స్థాపించారు. దీని అధికార హద్దులు ఐదు జిల్లాలకు విస్తరించింది, ఇందులో గుల్బర్గా, బీదర్, రాయచూరు, బళ్ళారి మరియు కొప్పల్ ఉన్నాయి. గతంలో ఇది 1970 నాటినుండి ధార్వాడ్లోని కర్ణాటక్ యూనివర్శిటీ యొక్క పోస్ట్-గ్రాడ్యుయేట్ కేంద్రంగా ఉంది. ముఖ్య ఆవరణ
860 acres (3.5 km2) భూమిని ఆక్రమించి
6 kilometres (3.7 mi) గుల్బర్గా నగరానికి తూర్పున ఉంది. ఇందులో 37 పోస్ట్-గ్రాడ్యుయేట్ విభాగాలు మరియు 4 పోస్ట్-గ్రాడ్యుయేట్ కేంద్రాలు కృష్ణదేవరాయనగర్, బళ్ళారి, రాయచూర్ మరియు బీదర్లో ఉన్నాయి. ఇంకొక పోస్ట్-గ్రాడ్యుయేట్ కేంద్రంను బసవకళ్యాణ్లో స్థాపిస్తున్నారు. ప్రతి సంవత్సరం 3500ల మంది విద్యార్థులను వివిధ పోస్ట్-గ్రాడ్యుయేట్, M.Phil. మరియు Ph.D. ప్రోగ్రాంలకు చెందిన అనేక అంశాలలో చేర్చుకుంటుంది. ఇక్కడ దాదాపు 200ల మంది శిక్షణా సిబ్బంది మరియు దాదాపు 700ల మంది సాంకేతిక మరియు అసాంకేతిక సహాయక సిబ్బంది పనిచేస్తున్నారు. 230 కళాశాలలు ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి, ఇది గ్రాడ్యుయేట్/డిప్లొమా పాఠ్యాంశాలను ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, సంగీతం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం మరియు సాంకేతికం, వాణిజ్యం, విద్య ఇంకా న్యాయశాస్త్రంలో అందిస్తోంది.
ఈ నగరానికి సమీపాన సెంట్రల్ యూనివర్శిటీని స్థాపించాలనే నూతన ప్రణాళికను ప్రతిపాదించబడింది. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలచే నిర్వహించబడుతున్న విద్యాసంస్థల కొరకు గుల్బర్గా 'సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్'గా పేరుపొందింది.
ప్రధాన పాఠశాలలు [మార్చు]
- ప్రజ్ఞ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్
- St. జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్
- శరణబసవేషర రెసిడెన్షియల్ స్కూల్
- శ్రీ గురు విద్య పీఠ-బసవరాజ్ D (ప్రస్కిన్)
- ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ స్కూల్
- ది నోబుల్ హై స్కూల్
- నూతన్ విద్యాలయ
- విజయ విద్యాలయ హై స్కూల్ (VVHS)
- St. మేరీస్ స్కూల్
- మదర్ థెరిస స్కూల్
- చంద్రశేఖర్ పాటిల్ స్కూల్
- చంద్రకాంత్ పాటిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (C.P.E.M.S.)
- ఖవాజా ఎడ్యుకేషన్ సొసైటి, ఖవాజా హై స్కూల్
- ఖవాజా ఎడ్యుకేషన్ సొసైటి, బిబి రాజా గాళ్స్ హై స్కూల్
- నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటి
- లిలి రోస్ హయ్యర్ ప్రైమరీ అండ్ ఫరాన్ హై స్కూల్
- గుల్బర్గా యునివర్సిటీ హై స్కూల్ (GUHS)
- నేషనల్ స్కూల్
- ఫరాన్ ప్రీ యునివర్సిటీ
- రోటరీ క్లబ్
- లైనన్ మెమోరియల్ స్కూల్
ఇంజనీరింగ్ కళాశాలలు [మార్చు]
- PDA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (PDACE)
- అప్ప ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (AIET)
- K.C.T. ఇంజనీరింగ్ కాలేజ్ (KCTEC)
- ఖజ బండ నవాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(KBNCE)
వైద్య కళాశాలలు [మార్చు]
- మహాదేవప్ప రంపురే మెడికల్ కాలేజ్ (MRMC)
- ఖజ బండ నవాజ్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KBNIMS)
- S. నిజలింగప్ప ఇన్స్టిట్యుట్ ఆఫ్ డెంటల్ సైన్స్(NIDS)
- ఆల్ బదర్ డెంటల్ కాలేజ్ & హాస్పిటల్ (ABDC)
- K.E. సొసైటీస్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (KESHMC)
- హింగులంబిక ఎడ్యుకేషన్ ట్రస్ట్స్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ (HETAMC)
- ఇస్లామీయ ఎడ్యుకేషన్ ఆయుర్వేద కాలేజ్ (IEAC)
- తిపు సుల్తాన్ ఉనాని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (TSUMC)
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలు(B.Ed) [మార్చు]
- గ్లోబల్ ఉమెన్స్ B.Ed కాలేజ్
- మదర్ థెరిస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
- జైన హింద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
- నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
- డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
- డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమన్
- మొహమ్మది కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
- చాంద్ బి బి B.Ed కాలేజ్
ఫార్మసి కళాశాలలు [మార్చు]
- రాజీవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసి(RMECOP)
- లుక్మాన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసి
- KCT కాలేజ్ ఆఫ్ ఫార్మసి
పాలిటెక్నిక్ కళాశాలలు [మార్చు]
- గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్
- N.V. సొసైటీస్ పాలిటెక్నిక్ కాలేజ్
- K.C.T. పాలిటెక్నిక్ కాలేజీ ఐడేడ్
- K.E సొసైటీస్ పాలిటెక్నిక్ కాలేజ్
- గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ కాలేజ్
- K.E.S. పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ కాలేజ్
BBM/BCA/B.Com కళాశాలలు [మార్చు]
- శరణ్బసవేశ్వర్ కాలేజ్ ఆఫ్ BCA
- ముక్తంబిక ఉమెన్స్ కాలేజ్
- శరణ్బసవేశ్వర్ కాలేజ్ ఆఫ్ కామర్స్
MBA / MCA / MTA కళాశాలలు [మార్చు]
- గుల్బర్గా యునివర్సిటీ క్యాంపస్, డిపార్ట్మెంట్ ఆఫ్ మానేజ్మెంట్ స్టడీస్
- దొడ్డప్ప అప్ప ఇన్స్టిట్యుట్ ఆఫ్ బిజినెస్ మానేజ్మెంట్
- అప్ప ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
- ICFAI MBA కాలేజ్
- వీరనా గౌడ డిగ్రీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్సు (BCA)
- శరణ్బసవేశ్వర్ కాలేజ్ ఆఫ్ MTA (మాస్టర్ ఆఫ్ టూరిజం అడ్మినిస్ట్రేషన్)
బయోటెక్నాలజీ కాలేజీలు [మార్చు]
- విశ్వేశరయ్య కాలేజ్ BSc బయోటెక్నాలజీ
- డెక్కన్ బయోటెక్ కాలేజ్
- V. G. ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ B.Sc బయోటెక్నాలజీ
- లుక్మాన్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ సైన్సు అండ్ ఆర్ట్స్
విశ్వవిద్యాలయాలు [మార్చు]
- గుల్బర్గా విశ్వవిద్యాలయం
- సెంట్రల్ యునివర్సిటీ ఆఫ్ కర్ణాటక
రాజకీయాలు [మార్చు]
కాంగ్రెస్ పార్టీకు చెందిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు వీరేంద్ర పాటిల్ (1968–1971, 1988–1990) మరియు ధరం సింగ్ (2004–2006) ఇద్దరూ గుల్బర్గాకు చెందినవారు.
గుల్బర్గా నుండి ప్రస్తుత పార్లమెంటు సభ్యుడిగా మల్లికార్జున్ ఖార్గే ఉన్నారు. ఆయన భారతదేశ కార్మిక మరియు ఉద్యోగశాఖా మంత్రిగా ఉన్నారు.
రాష్ట్ర శాసన సభ సభ్యులుగా కమర్ ఉల్ ఇస్లాం (ఉత్తర గుల్బర్గా), అరుణా పాటిల్ రెవూర్ (దక్షిణ గుల్బర్గా) మరియు రేవు నాయక్ బేలంగి (గుల్బర్గా పల్లెప్రాంతానికి) ఉన్నారు.
ఆకర్షణలు [మార్చు]
హిందూ మరియు ముస్లిం భక్తులకు శరణ బసవేశ్వర దేవస్థానం అతిపెద్ద ఆకర్షణీయ స్థలంగా ఉంది. ప్రముఖ హిందూ మతసంబంధ అధ్యాపకుడు మరియు తత్వవేత్త అయిన శ్రీ శరణ బసవేశ్వరకు ఈ దేవస్థానం అంకితమివ్వబడింది. దాసోహం ("దానం చేయటం") మరియు కర్మ అనేవి ఆయన ప్రాథమికమైన మరియు సరళమైన సూత్రాలుగా ఉన్నాయి. హిందూ మరియు ముస్లిం భక్తులకు ఇంకొక అతిపెద్ద ఆకర్షణీయ స్థలంగా హజ్రత్ ఖ్వాజా బందే నవాజ్ దర్గా ఉంది, దీనిని వివేకం, సహనం మరియు ఐకమత్యం బోధించిన ప్రముఖ సూఫీ గురువుకు అంకితం చేశారు. అందుచే గుల్బర్గా హిందూ-ముస్లింల ఐకమత్యానికి ప్రతీకగా ఉంది.
గుల్బర్గాలో ఉన్న పురాతన కందక కోట అవసాన దశలో ఉన్నప్పటికీ ఇందులో అనేక ఆసక్తికరమైన భవంతులు ఉన్నాయి, అందులో ముఖ్యంగా 14వ శతాబ్దం చివరలో లేదా 15వ శతాబ్దం ఆరంభంలో మూరిష్ శిల్పిచే నిర్మించబడిన జామా మసీదు ఉంది, దీనిని శిల్పి కార్డోబ, స్పెయిన్లో ఉన్న గొప్ప మసీదును అనుకరించి నిర్మాణం చేశాడు. మసీదు ప్రాంతంనంతా అతిపెద్ద బురుజు కప్పివేసి ఉండగా మూలలలో నాలుగు చిన్నవి మరియు దోవ అంతటా 75 అతిచిన్న బురుజులను కలిగి భారతదేశంలో అసాధారణంగా ఉంది. కోట ఒక్కదానిలోనే 15 స్తంభాలు ఉన్నాయి. గుల్బర్గాలో బహమనీ రాజుల యొక్క అద్భుతావహమైన సమాధులు, గొప్ప ముస్లిం గురువు పుణ్యస్థానం, (హజ్రత్ ఖ్వాజ బందే నవాజ్), శరణ బసవేశ్వర దేవాలయం, శ్రీ సాయిబాబా దేవాలయం, శ్రీ రామ్ మందిర్ మరియు శ్రీ భవానీ శంకర్ దేవాలయం (శ్రీ సదాశివ్ మహారాజ్) ఉన్నాయి.
గుల్బర్గాకు అత్యంత సమీపంలో శ్రీ సద్గురు దత్తాత్రేయ దేవుని యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ క్షేత్ర ఘనగాపూర్ ఉంది. ఖ్వాజా బందే నవాజ్ యొక్క వార్షిక జయంతి ఉత్సవాల సమయంలో వేలసంఖ్యలో భక్తులు గుల్బర్గాను సందర్శిస్తారు.
మధ్వాచార్య యొక్క ద్వైత తత్వాన్ని ప్రభోధించే ఉత్తరాది మఠం ఇక్కడ ఉంది. ఈ మఠం యొక్క ఉత్కృష్టమైన వ్యక్తులలో ఒకరైన శ్రీ జయతీర్థుల వారి భౌతికశరీరాన్ని ఇక్కడి బృందావనంలో సమాధి చేశారు. మధ్వాచార్యుల యొక్క ప్రముఖమైన అనువ్యాఖ్యానం కు ఆయన వ్యాఖ్యాతగా ఉన్నారు, ఇది బ్రహ్మ సూత్రాల మీద వ్యాఖ్యానంగా ఉంది. న్యాయ సుధ అని పిలవబడే ఈ వ్యాఖ్యానం కొరకు ఆయన తీకాచార్య అని పేరొందారు.
- మాల్కేడ్ శ్రీ జయతీర్థ (ఉత్తరాదిమఠం)
- శరణ బసవేశ్వర దేవాలయం
- ఖ్వాజా బందే నవాజ్ దర్గా (K. B. N. దర్గా)
- రామ్త్రేత్ ఆలయం (ఆలాండ్ రోడ్ చెక్ పోస్ట్ సమీపాన)
- సిద్ధార్త్ బుద్ధ విహార్
- శ్రీరాం మందిర్ (జేవర్గి రోడ్)
- శ్రీ సాయి మందిర్ (ప్రసన్న R G)
- శ్రీ లక్ష్మీనారాయణ్ దేవాలయం (సేడం రోడ్)
మతసంబంధమైన ఆకర్షణీయాలతో పాటు వినోదాన్ని అందించే ప్రదేశాలను కూడా గుల్బర్గా కలిగి ఉంది, ఇందులో షెట్టీస్ టాకీ టౌన్ అనే బహుళ భవన సముదాయం ఉంది (ఫన్ సినిమాస్ యొక్క విలువ ఆధారమైన శాఖగా ఉంది),గుల్బర్గాలోని అలాండ్ రోడ్లో ఉన్న దీనిలో 4 చలనచిత్ర ప్రదర్శనా థియేటర్లు అన్ని సౌకర్యాలతో ఉన్నాయి.
గుల్బర్గా, జగత్లోని దర్గా రోడ్లో నూతన మాల్ నిర్మాణం కొనసాగుతోంది. గతంలో ఈ ప్రదేశంలో "తిరందాజ్ టాకీస్" అనే సినిమా హాలు ఉండేది.
చిత్రమాలిక [మార్చు]
సూచనలు [మార్చు]
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ http://www.గుల్బర్గాuniversity.kar.nic.in/AboutUs.html
బాహ్య లింకులు [మార్చు]
| Wikimedia Commons has media related to: Gulbarga |
- గుల్బర్గా సమాచారం
- గుల్బర్గావన్
- గుల్బర్గా పట్టాన వెబ్ సైట్
- ఆన్ లైన్ గుల్బర్గా
- గుల్బర్గా కు లింకులు
- గుల్బర్గా సిటీ కార్పోరేషన్ యొక్క అధికారిక వెబ్ సైట్
- నెట్ లో గుల్బర్గా
- గుల్బర్గా గురించి ఏంతో సమాచారం
- కర్ణాటక లో అన్ని జిల్లాల యొక్క ప్రోఫైళ్ళు
- గుల్బర్గా ఆన్ లైన్
- http://www.mapsofindia.com/maps/karnataka/districts/gulbarga.htm
- http://gulbarhgainfo.com
- Articles needing cleanup from March 2010
- Articles with invalid date parameter in template
- All articles needing cleanup
- Cleanup tagged articles without a reason field from March 2010
- Wikipedia pages needing cleanup from March 2010
- Articles needing additional references from May 2010
- All articles needing additional references
- Karnataka నగరాలు మరియు పట్టణాలు
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- గుల్బర్గా
- పూర్వపు ఇండియన్ రాజధాని పట్టణాలు