గృత్సమద మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గృత్సమద (సంస్కృతం: गृत्समद), ఋషి, ఋగ్వేదంలోని రెండవ (2) మండలం 43 శ్లోకాలలో 36 శ్లోకాలు దర్శించినవాడు అత్యంత ఘనుడు. వీటిలో 27-29 శ్లోకాలు తనకుమారుడైన కూర్ముడు, 4-7 శ్లోకాలను సోమహుతి దర్శించారు. గృత్సమద మహర్షి మహా తపస్వి.[1]

పుట్టుక[మార్చు]

సంసారం[మార్చు]

  • గృత్సమదుని కుమారుడు కుచేతసుడు.[2]

జన్మవృత్తాంతం[మార్చు]

గృత్సమద మహర్షి ఇంద్రుడు, ముకుందా కుమారుడు. ఒకనాడు ఋషి రుక్మాంగదుడు పనిమీద బయట ఉన్నప్పుడు ఒకసారి, ఇంద్రుడు ఋషి యొక్క ఆశ్రమంలో ఉన్న అతని భార్య ముకుందాను ముని వేషంలో రమించాడు.. ఆ కారణంగా ఆమె గర్భవతి అయ్యింది, జన్మించిన ఈ పిల్లవాడికి గృత్సమదుడుగా నామకరణముతో ఉండి, ఒక పండితుడుగా పెరిగి పెద్దవాడయ్యాడు.

గృత్సమదుని శాపం[మార్చు]

ఎవరికీ కూడా పండిత చర్చలో అతనిని ఓడించడం సాధ్యం కాలేదు. ఒకసారి గృత్సమద మహర్షి, వశిష్ట మహర్షితో, ఇతరులుతో కలిసి మగధ వద్ద ఒక శ్రార్ధ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ, అత్రి మహర్షి అతన్ని తన తల్లిదండ్రుల విషయంలో పరిహసించారు. అతను తిరిగి వచ్చి తల్లి ముకుందాను ప్రశ్నించాడు. ఎవరు అతనికి నిజం చెప్పారు అని ఆరాతీసింది. అతను తన తల్లి చర్యలకు సిగ్గుపడుతున్నాను అని, ఆమెను ఒక చెట్టు అవుతావని నిందించారు. అతను ఒక దైత్యుడు కుమారుడు పొందమని ఆమె తిరిగి నిందించింది. గృత్సమద మహర్షి తను ఇచ్చిన శాపం, గణేశ పురాణం ప్రకారం గణపతి ఉపసంహరించుకున్నారు.

ప్రాముఖ్యం[మార్చు]

  • ఋగ్వేదంలోని 2.4, 19, 39, 41 మండల శ్లోకాలలో ఇతని పేరుని బహువచనంలో కనిపించడం అది గృత్సమదుని యొక్క వశమును సూచిస్తుంది.
  • శ్రీమద్భాగవతములో కొన్ని చోట్ల ఈ క్రింద సూచించిన శ్లోకము ద్వారా గృత్సమద మహర్షి యొక్క ప్రస్తావన ఉంది.[3]

కాశ్యః కుశో గృత్సమద ఇతి గృత్సమదాదభూత్
శునకః శౌనకో యస్య బహ్వృచప్రవరో మునిః

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 https://en.wikipedia.org/wiki/Dirghatamas
  2. 2.0 2.1 "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ
  3. శ్రీమద్భాగవత పురాణము - స్కంధము 9 - అధ్యాయము 17