గోరంట్ల వెంకన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోరంట్ల వెంకన్న చౌదరి
జననం1871
ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం గ్రామం
మరణం1948 నవంబరు 21
మతంహిందువు
తల్లిదండ్రులుగోరంట్ల వీరన్న, పున్నమ్మ

గోరంట్ల వెంకన్న చౌదరి (1871 - 1947), తెలుగు వారిలో మహాదాతగా ప్రసిద్ధి చెందాడు. ఆర్ష సంస్కృతీ సముద్ధరణ కోసం తన జీవితార్జిత సర్వస్వాన్నీ ధారపోసి చిరస్మరణీయుడైన వ్యక్తి. [1]

జననం, విద్య[మార్చు]

ప్రకాశం జిల్లా, తిమ్మసముద్రం గ్రామానికి, గోరంట్ల అనే ఇంటి పేరు గల కమ్మ వారు నరసరావుపేట ప్రాంతంలోని మురికిపూడి గ్రామం నుండి వలస వచ్చి స్థిరపడ్డారు. వీరి మూలపురుషుడు చంద్రప్ప. గోరంట్ల కుటుంబాలలో వీరన్న అనేవారు సుప్రసిద్ధులు. ఇతని రెండవ భార్య పున్నమ్మకు వెంకన్న, రామన్న, వెంకటస్వామి అను ముగ్గురు కుమారులు పుట్టారు. పెద్దవాడైన వెంకన్నచౌదరి 1871 లో జన్మించాడు. వీరిది 1200 ఎకరాల భూస్వామ్య కుటుంబం. వెంకన్నకు చిన్నప్పటినుండి విద్యాభిరుచి, జ్ఞానతృష్ణ ఎక్కువ. అచ్యుతన్న రామ శాస్త్రి అనే మహాపండితుని సాంగత్యం వల్ల సంస్కృతభాష, ఆయుర్వేద వైద్యం, పురాణశ్రవణం మొదలగు విషయాలపై అపారమైన అభిమానం ఏర్పడింది.

మహాదాత[మార్చు]

ఒక ధార్మిక సంస్థను ఏర్పరిచి దానికి తన వాటా ఆస్తి 268 ఎకరాలను దానంచేసాడు. ఈ ట్రస్ట్ ద్వారా వేదశాస్త్ర, సంస్కృత భాష, ఆయుర్వేద వైద్యానికి విశేషమైన సేవ అందించాడు[1]. స్వగ్రామంలో కృష్ణమందిరం ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఉత్సవాలు జరిపించాడు. ఈ ఉత్సవాలలో రాష్ట్రం నలుమూలల నుండి సంస్కృత పండితులను రప్పించి సత్కరించేవాడు.ఆయుర్వేద వైద్యంపై ఇతనికి మక్కువ, స్వయంగా పూర్ణ చంద్రోదయ, వసంత కుసుమాకరం, సిద్ధమకరధ్వజ ఔషధాలను చేయించి వాటిని రోగులకు పంచేవారు.

తన ఊరు తిమ్మసముద్రంలో సంస్కృత విద్యాపీఠం స్థాపించి అన్ని వర్ణాలవారు చదువుకునేట్లు, విద్యార్థులందరికీ ఉచితవిద్య, అన్నదానం చేసే ఏర్పాట్లు చేయించాడు. తిమ్మసముద్రంలో వెంకన్న స్థాపింఛిన సంస్కృత విద్యాపీఠం ఇప్పుడు శ్రీ గోరంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాలగా మార్పు చెందింది[2]. ఈనాటికి అతను నెలకొల్పిన ధార్మిక సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం వేద, సంస్కృత, ఆయుర్వేద పండితులకు సత్కారం చేస్తున్నారు. ఒంగోలులో ఒక హైస్కూల్ ఒరియంటల్ స్కూల్ స్థాపించారు.వేటపాలెం గ్రామంలో 1918 లో స్థాపించిన సారస్వత నికేతనం అనబడే గ్రంథాలయానికి ఇతను భూరి విరాళం ఇచ్చి దాని అభివృద్ధికి తోడ్పడ్డాడు[1].

స్వాతంత్ర పోరాటం[మార్చు]

వెంకన్న ప్రకాశం పంతులు ముఖ్య అనుచరుడు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, స్వామి సీతారాం తిమ్మసముద్రానికి ఆహ్వానించి, వారిచే ప్రసంగాలిప్పించారు. వెంకన్న దేశభక్తి, త్యాగనిరతి గురించి తెలుసుకున్న గాంధీజీ రెండుసార్లు తిమ్మసముద్రం వచ్చాడు. గాంధీ సమక్షంలో ఏడు ఎకరాల భూమి హరిజనులకు పట్టాల రూపేణా ఇచ్చారు. 1936లో వచ్చిన పెనుతుఫాను బీభత్సంలో గాంధీ బాధితులను ఆదుకొనడానికి తిమ్మసముద్రం వస్తే ఈ ప్రాంతం వారిని విషయం నేను చూసుకుంటాను మిగతా ప్రాంతాలను మీరు చూడండి అని భరోసా ఇచ్చిన మహాదాత వెంకన్న.

మరణం[మార్చు]

తన జీవితాన్ని, సంపదను, భూమిని సంఘం కోసం త్యాగం చేసి సంస్కృత భాషకు, ఆర్షసంస్కృతికీ నిస్వార్ధసేవ చేసిన మహనీయుడు గోరంట్ల వెంకన్న చౌదరి గారు 1948 నవంబరు 21 నలో పరమపదించారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 భావయ్య చౌదరి, కొత్త (2005). కమ్మ వారి చరిత్ర. గుంటూరు: పావులూరి పబ్లిషర్స్. p. 227.
  2. శ్రీ గోరంట్ల వెంకన్నఓరియంటల్ కాలేజి: http://mycollege.in/college.php?id=1733&name=Sri-Gorantla-Venkanna-Oriental-College Archived 2007-10-08 at the Wayback Machine