చదలవాడ సుందరరామశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదలవాడ సుందరరామశాస్త్రి
జననంచదలవాడ సుందరరామశాస్త్రి
1865
వెంకన్నపాలెం
మరణం1925
వృత్తిపండితుడు, రచయిత
తండ్రిరామశాస్త్రి
తల్లిసీతమ్మ

చదలవాడ సుందరరామశాస్త్రి, సంస్కృతాంధ్రాలలో పండితుడు, బహుగ్రంథకర్త. వేంకటగిరి రాజాస్థానంలో ఆస్థాన పండితులుగా పనిచేశారు. "శారదాంబావిలాస ముద్రాక్షరశాల"ను స్థాపించి ఎన్నో గ్రంథాలను ప్రచురించారు. 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి తన సాహితీసేవకు గాను స్వర్ణకంకణం అందుకున్నారు.

ముద్రాక్షరశాల స్థాపన, నిర్వహణ[మార్చు]

శాస్త్రిగారు 1889లో "శారదాంబ విలాస ముద్రాక్షరశాల" స్థాపించారు. దీనికి అప్పటి వెంకటగిరి రాజా శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్రులు (1831-1892) ప్రధానపోషకులు. ఈ సంస్థ వెలువరించిన కొన్ని గ్రంథాలు - రాజావారు రాసిన "మనః సాక్ష్యము, గోపీనాథుని వెంకయ్య శాస్త్రి రాసిన కృష్ణజన్మఖండము, సర్వజ్ఞ కుమార యాచేంద్రులు రాసిన సభారంజని, చదలవాడ వారే రాసిన మనుధర్మశాస్త్రము (తెలుగు లిపిలో).

గ్రంథాల పట్టిక[మార్చు]

  • భగవద్గీతా పరమార్థ చంద్రిక (భగవద్గీతకు తెలుగు టీక)
  • శ్రీమద్రామాయణము (తెలుగులిపిలో, టీకాతాత్పర్యాలతో)
  • దక్షిణామూర్తి స్తోత్రం
  • ఆంధ్ర రుద్రాధ్యయనము
  • వేదాంత డిండిమము
  • అపరోక్షానుభూతి
  • గౌతమ స్మృతి
  • మనుధర్మ శాస్త్రము (తెలుగు లిపి, టీక)
  • అంబగీతం
  • శ్రీరామ హృదయము
  • శ్రీ రామాయన సార సంగ్రహము
  • ఆదిత్య హృదయము
  • ధర్మ సింధువు
  • ఆదివిరాట పర్వములు (టీక - దండిగుంట సూర్యనారాయణ శాస్త్రి తో కలిసి)
  • వశిష్ట రామాయణము
  • జగన్నాథ శతకము

మూలాలు[మార్చు]

తెలుగు జాతిరత్నాలు - వావిళ్ళ రామస్వామిశాస్త్రి, సి.పి.బ్రౌన్ ప్రచురణ 2009, అధ్యాయం -ఏడు.