చారు మజుందార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చారు మజుందార్
చారు మజుందా
జననం1918
మరణంజూలై 28, 1972
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నక్సలిజం

సి.ఎం.గా సుప్రసిద్ధుడైన చారు మజుందార్ (1918 - జూలై 28, 1972) నక్సలైటు నాయకుడు, నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. అతని ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలో చేరారు. కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ళ పోరాటాలలో పాల్గొన్నవారే చివరిదాకా విప్లవకారులుగా నిలబడగలుగుతారని ఆయన యువతకి చెప్పాడు. అతను మరణించిన జూలై 28వ తేదీని భారతదేశంలోని మార్క్సిస్టు-లెనినిస్టులు అమరవీరుల దినంగా పాటిస్తారు.

బాల్యం[మార్చు]

చారు మజుందార్ 1918 ల సిలిగురిలోని ఒక జమీందారు కుటుంబంల జన్మించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన పెట్టి-బూర్జువా జాతీయ విప్లవకారులచే ప్రభావితుడై అనుశీలన్ గ్రూపుకి అనుబంధ సంస్థ అయిన బెంగాల్ విద్యార్థి సంఘంల (All Bengal Students Association) సభ్యునిగా చేరాడు. న్యాయవాది అయిన అతని తండ్రి కాంగ్రెస్‌లో చురుకైన స్వాతంత్ర్య సమరయోధుడు.అతని తల్లి ఆమె కాలానికి ప్రగతిశీల భావాలు కలది. 1937-38 ల ఆయన కళాశాల విద్యను వదిలిపెట్టి, కాంగ్రెస్ కార్యకర్తగా బీడీ కార్మికులను, ఇతరులను సంఘటిత పరిచాడు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో[మార్చు]

కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ని వదిలిపెట్టి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)ల చేరి రైతు సంఘంల పనిచేసాడు. మొదట జల్‌పైగురి రైతులతో పనిచేసి వారిలో సర్వసమ్మతమైన నాయకునిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రభుత్వం అతని మీద అరెస్టు వారెంటు జారీ చేయగా అతను అజ్ఞాతంలకి వెళ్ళాడు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలవ్వగానే సి.పి.ఐ పార్టీ నిషేధించబడింది. రైతులతో రహస్య కార్యకలాపాలు నిర్వహించి, 1942 ల కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జల్‌పైగురి జిల్లా కార్యవర్గంల సభ్యుడయ్యాడు. 1943 ల పెద్ద కరువు వచ్చినపుడు, జల్‌పైగురిల పంటలను స్వాధీనపర్చుకోడానికి అందరినీ సంఘటితపరిచాడు. 1946ల 'తెభాగ ' ఉద్యమంల పాల్గొని, ఉత్తర బెంగాల్ రైతు పోరాటాలను నిర్వహించాడు. ఈ ఉద్యమం ఆయనపై ప్రగాఢ ప్రభావం చూపి, సాయుధ రైతాంగ విప్లవోద్యమంపై ఆయన ఆలోచనలకు స్పష్టతనేర్పరచింది. తర్వాత ఆయన డార్జిలింగ్ జిల్లాల తేయాకు కార్మికులతో పనిచేసాడు.

1984ల సి.పి.ఐ నిషేధించబడగా ఆయన తర్వాతి మూడు సంవత్సరాలు జైలుల గడిపిండు. 1954 జనవరిల జల్‌పైగురికి చెందిన సి.పి.ఐ సభ్యురాలు లీల మజుందార్ సేన్‌గుప్తను ఆయన వివాహమాడిండు. ఆయన కార్యకలాపాలకు కేంద్రమైన సిలిగురికి వాళ్ళు వెళ్ళింరు. పూర్వీకుల ఆస్తి పోగొట్టుకొని అనారోగ్యంతో ఉన్న ఆయన తండ్రి, అవివాహిత అయిన ఆయన చెల్లెలు ఆర్థిక ఇబ్బందుల మధ్య అక్కడే జీవించింరు. రైతాంగ పోరాటం తగ్గుముఖం పట్టడంతో తేయాకు కార్మికులు, రిక్షా కార్మికులను సంఘటితపర్చడానికి అతను కృషి చేసాడు. 1956ల పాల్‌ఘాట్ కాంగ్రెస్ తర్వాత, పార్టీతో ఆయనకున్న అభిప్రాయ భేదాలు పెరిగాయి. ఆయనకున్న ఇబ్బందికర పరిస్థితులకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. కాని అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంల జరుగుతున్న పెద్ద చర్చ (The Great Debate) ఆయనకు ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇండో-చైనా యుద్ధం సందర్భంగా ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళాడు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)లో[మార్చు]

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ చీలికతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)ల చేరినా, ముఖ్యమైన సైద్ధాంతిక ప్రశ్నలపై నాయకత్వం తప్పించుకుంటునట్టు అతను భావించాడు. 1964-65 ల అతని ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కమ్యూనిజం, మావో ఆలోచన గురించి అధ్యయనం చేయడానికి, రాయడానికి సమయాన్ని వినియోగించాడు. 1965-67 వరకు అతని రచనల వల్ల, ఉపన్యాసాల వల్ల నమోదు చేయబడిన అతని భావాలు ఈ సమయంలోనే ఏర్పడ్డాయి. అవే తర్వాత చారిత్రక ఎనిమిది పత్రాలు (Historic Eight Documents)గా పిలువబడి నక్సల్బరి ఉద్యమానికి రాజకీయ-సైద్ధాంతిక మూలం అయ్యాయి.1967ల నక్సల్బరీ ఉద్యమం మొదలైన తర్వాత పోలీసులకి పట్టుబడకుండా చారు మజుందార్ అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. కొన్ని వారాల తర్వాత ఆయన ఇట్లా రాసాడు, "వందలాది నక్సల్బరీలు భారతదేశంల నిప్పు రాజుకుంటున్నయి...నక్సల్బరీ చావలేదు,నక్సల్బరీకి చావు లేదు."

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) ఏర్పాటు[మార్చు]

మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనను వ్యాపింపజేస్తూ, దీని మూలంగా అన్ని కమ్యూనిస్టు విప్లవకారులను ఏకం చేస్తూ, నక్సల్బరీ తరహా రైతాంగ విప్లవ పోరాటాలను వృద్ధి చేసే లక్ష్యంతో ఏప్రిల్ 1969లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) (సి.పి.ఐ.ఎం.ఎల్) ఏర్పడింది. మే 1970, సి.పి.ఐ.ఎం.ఎల్ కాంగ్రెస్ సమావేశంల ఏర్పడిన కేంద్రకమిటీకి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. తర్వాత కాలంలో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు మాయం చేయబడినా, చాలా మంది ముఖ్య నాయకులు చంపబడినా, అనారోగ్యంతో ఉన్న ఆయన పోలీసులనుండి తప్పించుకోగలిగాడు.

పోలీసు నిర్బంధంల మరణం[మార్చు]

జూలై 16, 1972న, కొరియర్‌ని చిత్రహింసలు చేయగా తెలిసిన సమాచారంతో ఆయన కలకత్తాలోని ఒక స్థావరంలో పట్టుబడ్డాడు. పట్టుబడిన సమయంలో ఆయన గుండెజబ్బు వలన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పోలీసు నిర్బంధంలో ఆయన ఉన్న పది రోజులు ఆయనను చూడడానికి ఆయన న్యాయవాదిని కాని, కుటుంబ సభ్యులని కాని, వైద్యున్ని కాని పోలీసులు అనుమతించలేదు. 1972 జూలై 28 తెల్లవారుఝామున 4 గంటలకు, చారు మజుందార్ లాల్‌బజార్ పోలీస్ నిర్బంధంలో మరణించాడు. ఆయన శవాన్ని కూడా ప్రభుత్వం కుటుంబానికి అందజేయలేదు. పోలీసులు కుటుంబ సభ్యులతో శవాన్ని ఒక దహనవాటికకు తీసుకపోయి, సమీప బంధువులను కూడా రానివ్వకుండా కట్టుదిట్టం చేసి ఆయన శవాన్ని దహనం చేశారు. ఆయన మరణంతో భారత దేశములో విప్లవోద్యమ మొదటి ఘట్టం ముగిసింది.

బయటి లింకులు[మార్చు]