చేబ్రోలు సరస్వతీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేబ్రోలు సరస్వతీదేవి
జననం[[]] 1900
పుల్లెల గ్రామం, నల్గొండ జిల్లా
నివాస ప్రాంతంనీలగిరి
భార్య / భర్తచేబ్రోలు రాజగోపాలం
తండ్రిరాజగోపాలనాయుడు

కవి కలహంసి బిరుదాంకితురాలైన చేబ్రోలు సరస్వతీదేవి తెలుగు కవయిత్రి. ఈమె రచించిన సరస్వతీ శతకము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి రచయితల మన్ననలు పొందినది. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ క్లాసుకు పాఠ్యగ్రంథంగా ఎన్నుకొనబడింది. ఉత్తరకాండకు తొలిపలుకు రాస్తూ దివాకర్ల వేంకటావధాని ఆమె రచన ధారాళమై, భావనిర్భరమై, ఔచిత్య శోభితమై, నిర్దుష్టమై, అత్యంత హృద్యముగానున్నదని, మొల్ల, వెంగమాంబ కవితలతో సాటిగానున్నదని వ్రాసినారు.

ఈమె భర్త నూజివీడు జమీందారైన రాజా గోపాలమనాయుడు. ఈమెకు ముగ్గురు కుమారులు.

సరస్వతీదేవి సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు జ్యోతిషము కూడా అభ్యసించారు. ఈమె గురువు కందాడై కృష్ణమాచార్యులు, పంచకావ్యములు, నాటకాలంకారములు జ్ఞానసముపార్జన దృష్టితో బోధించేరని సుమిత్రాదేవి పేర్కొన్నారు.

ఈమె జటప్రోలు సంస్థానకవి వాజపేయాజుల రామసుబ్బరాయశాస్త్రి స్థాపించిన స్నేహలతా సంఘానికి ఉపాధ్యక్షురాలుగానూ, గృహలక్ష్మి మాసపత్రికకి ఉపసంపాదకురాలుగానూ పనిచేసింది.

సాహిత్యకృషి[మార్చు]

  • సరస్వతీ రామాయణము
  • శ్రీ సరస్వతీశతకము
  • సత్యనారాయణ వ్రతకల్పము
  • ఆత్మోపదేశము
  • పతివ్రతాశతకము

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  • గూడ సుమిత్రాదేవి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీతలు, 1988