ఛాయా దేవి
వికీపీడియా నుండి
(ఛాయాదేవి నుండి దారిమార్పు చెందింది)
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఛాయాదేవి సూర్యుని భార్య. ఈమెకు సావర్ణి మనువు అను కుమారుడు జన్మించెను. ఈమె తన కుమారులను మాత్రమే చూచుకొనుచు సంజ్ఞాదేవి బిడ్డలను సవతి వలె చూడసాగినది. దీనికి కోపగించిన సూర్యుడు ఆమెను దండించాడు.
పిమ్మట సూర్యుడు తన మామ త్వష్ట ప్రజాపతిని కలిసి జరిగినదంతా తెలియజేయగా అతడు అల్లుని శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశములో సంచరించుచున్నదని తెలిపాడు. సూర్యుడు అక్కడికి వెళ్ళి గుర్రము రూపంలో ఉన్న నామెకు తన నోటిద్వారా వీర్యమును ఆమె నాసికలందు స్కలించినాడు. ఆ వీర్య ప్రభావముచే ఆ అశ్వినికి ఇరువురు పుత్రులు జన్మించారు. వారే అశ్వినీ దేవతలు గా ప్రసిద్ధులైనారు.