జరాసంధుడు
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
జరాసంధుడు పరమ శివ భక్తుడు మరియు రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వం వచ్చే పాత్ర.
విషయ సూచిక |
[మార్చు] జన్మ వృత్తాంతం
బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. ఒకరోజు బృహద్రధుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహార్షి చూస్తాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం వేదని సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. బృహధ్రద మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతనం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రి లొనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుండి. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజుకి తీసుకొని వెళ్ళి జరిగిన వృంత్తాంతాన్ని చెగుతుంది. ఒకరోజు చందకౌశిక మహర్షి బృహద్రడుడి రాజ్యానికి వచ్చి జరాసంసంధుడిని చూసి , జరాసంధుడూ పరమ శివ భక్తులలో ఒకడౌతాడు అని చెబుతాడు.
[మార్చు] యుధిష్టరుడి రాజసూయం-శ్రీకృష్ణుడు,భీముడు,పార్థుడు యుద్ధ బిక్ష
ధర్మరాజు రాజసూయయాగము చేయ నిశ్చయించి శ్రీకృష్ణుడి వద్ద కు వెళ్ళి తన అభిప్రాయాన్ని వెల్బుచ్చుతాడు. రాజసూయానికి కావలసిన ధనము అవసరము అని ఆ జరాసంధుడి వద్ద మిక్కిలి ధనము ఉన్నదని , జరాసంధుడు అనేక రాజుల ను బంధించి హింసిస్తునాడని, రాజు లను శివుడికి బలి క్రింద ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు చెబుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు తొ సమాలోచన జరిపి తాను,భీముడు అర్జునుడు జరాసంధుడి వద్దకు బ్రాహ్మణు వేషముతో వెళ్ళి యుద్ధ భ్క్ష వేడుతాను అని చెప్పి మగధ బయలు దేరుతాడు. మగధ పొలిమేరలకు చేరు కొనుచుండగా జరాసంధుడి కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు. ఆ డంకాలు శత్రువులు ఎవరైన రాజ్యములొ ప్రవేశిస్తే తామంటతామే మోగుతాయి. భీముడికి చెప్పి ఆ ఢంకాలను భీముడీ ఉదరముతో చీల్చమని చెబుతాడు. ఢంకలు ధ్వంసము చేశాక శ్రీకృష్ణ,అర్జున,భీములు రాజ మారగ్ములొ కాకుండా దొడ్డిమార్గములొ రాజధాని లొ ప్రవేశిస్తారు. జరాసంధుడు వారికి అర్ఘ్య్పాద్యాలు ఇచ్చి, తాంబూలము ఇవ్వబోతే శ్రీకృష్ణుదు వాటిని నిరాకరిస్తాడు. అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడిని కారణము అడుగగా యుద్ధ భిక్ష కోరుతాడు. జరాసంధుడు భీముడి తో మల్లయుద్ధము చేయడానికి అంగీకరించి వారి వారి పరిచయాలు చెప్పమంటాడు. అప్పుడు వారు వారి పరిచయాలు చెబుతారు.జరాసంధుడు తన కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకము చేసి మల్ల యుద్ధానికి దిగితాడు.
[మార్చు] జరాసంధుడు-భీముల యుద్ధము
యుద్ధం 27 రోజులు గడూస్తుంది. జరాసంధుడు-భీముడు ఘోరాతిఘోరంగా పోరాడుతుంటారు. శ్రీకృష్ణుడి సూచన మేరపు భీముడు జరాసంధుడి శరీరాన్ని రెందు భాగాలుగా చీల్చి రెండు భాగాలను వేరే వేరే దిక్కులకు విసిరేస్తాడు.ఆ విధంగా జరాసంధుడు అస్తమిస్తాడు.
[మార్చు] మూలాలు
- వేదవ్యాసుని మహాభారత మూలం
- గీతా ప్రెస్, గోరఖ్పూర్
- Gibbs,Laura. Ph.D. Jarasandha Modern Languages MLLL-4993. Indian Epics.