జాంబవతి

వికీపీడియా నుండి
శ్రీకృష్ణునితో జాంబవతి వివాహం - 19వ శతాబ్దం నాటి పూనే చిత్రం

రామాయణం నాటి జాంబవంతుడి పెంపుడు కుమార్తె జాంబవతి. జాంబవంతుడు తనకు దొరికిన శ్యమంతక మణి జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప వీణా విద్వాంసురాలు.

జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు సాంబుడు. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ మరియు కృతు. జాంబవంతీ పుత్రులపై కృష్ణునికి ప్రత్యేక అభిమానమున్నది.[1]

శ్రీ కృష్ణదేవరాయలు జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా సంస్కృతములో జాంబవతీ కళ్యాణము అనే కావ్యాన్ని రచించాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://krsnabook.com/ch61.html
"http://te.wikipedia.org/w/index.php?title=జాంబవతి&oldid=808525" నుండి వెలికితీశారు