తిరుక్కన్నపురం విజయరాఘవన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుక్కన్నపురం విజయరాఘవన్ (తమిళం: திருக்கண்ணபுரம் விஜயராகவன்; నవంబరు 30 1902 - ఏప్రిల్ 20 1955) మద్రాసు ప్రాంతానికి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త. 1920 మధ్యకాలంలో ఆయన ఆక్స్‌ఫర్డుకు పిసాట్- విజయరాఘవన్ సంఖ్యలు పై పరిశోధనా నిమిత్తం వెళ్ళినపుడు ఆయన జి.హె.హార్డీతో కలసి పనిచేసారు. ఈయన 1934 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఫెలోగా ఎంపిక కాబడ్డారు.

విజయరాఘవన్ సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతుడు. ఆయన తిరుక్కన్నపురం పట్టప్పస్వామి అనే ప్రముఖ ఉపన్యాసకుని కుమారుడు. పట్టప్ప స్వామి 20 వ శతాబ్దంలో శ్రీవైష్ణవ లేదా రామానుజ మతానికి చెందిన ముఖ్యమైన వ్యక్తి. విజయరాఘవన్ ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన ఆండ్రి వైల్ కు మిత్రుడు. ఆయనతో కలసి ఆలీఘర్ విశ్వవిద్యాలయంలో సేవలనందించాడు. ఆ తరువాత ఢాకా విశ్వవిద్యాలయానికి బదిలీ కాబడ్డారు.[1]

విజయ రాఘవన్ సమూక కరణులకు సంబంధించిన హెర్ష్‌ఫెల్డ్ సిద్ధాంతం యొక్క ప్రత్యేక సందర్భాన్ని ఈ క్రిందివిధంగా నిరూపించాడు.:[2]

converges if and only if

మూలాలు[మార్చు]

  1. M.S. Raghunathan, Artless innocents and ivory-tower sophisticates: Some personalities on the Indian mathematical scene.
  2. Ramanujan, S. Collected Papers of Srinivasa Ramanujan (Ed. G. H. Hardy, P. V. S. Aiyar, and B. M. Wilson). Providence, RI: American Mathematical Society (2000), p. 348.

ఇతర లింకులు[మార్చు]