తుఫాను నర్గిస్

వికీపీడియా నుండి

నర్గీస్ తుఫాను అని పేరు పెట్టబడిన ఈ తుఫాను మే నెల 2008 సంవత్సరములో వచ్చిన అతి భయంకరమైన తుఫాను. ఈ తుఫాను ముఖ్యముగా బర్మా దేశము లొ విధ్వసం సృష్టించింది. 22,000 మంది మరణించారు మరియు 41,000 మంది తుఫానులో చిక్కుబడి తప్పి పోయారు.ప్రపంచ వాతావరణ సంస్థ సూచనల ప్రకారం మన దగ్గర కూడా తుపాన్లకు పేర్లు పెడుతున్నారు. దీనివల్ల ప్రజలు తేలిగ్గా సదరు ఉత్పాతాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఉత్తర హిందూమహాసముద్ర దేశాలైన బంగ్లాదేశ్‌, భారత్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఓమన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు వంతుల వారీగా పేర్లను పెడుతున్నాయి. 2010 మే తుపానుకు లైలా అని పాకిస్థాన్‌ పేరు పెట్టింది. 2009లో భారత్‌, బంగ్లాదేశ్‌లో వచ్చిన తుపాను పేరు ఐలా.