మా తెలుగు తల్లికి మల్లె పూదండ
వికీపీడియా నుండి
(తెలుగు తల్లి నుండి దారిమార్పు చెందింది)
మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేది తెలుగులో ప్రాచుర్యం కలిగిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర గీతంగా అధికారికంగా స్వీకరించబడిన ఒక గేయం. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. ఈ గేయంలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు.
విషయ సూచిక |
[మార్చు] గేయం
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
-
-
- గల గలా గోదారి కదలి పోతుంటేను
- బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
- బంగారు పంటలే పండుతాయి
- మురిపాల ముత్యాలు దొరలు తాయి
- గల గలా గోదారి కదలి పోతుంటేను
-
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
-
-
- రుద్రమ్మ భుజ శక్తి
- మల్లమ్మ పతిభక్తి
- తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
- మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
- రుద్రమ్మ భుజ శక్తి
-
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
[మార్చు] గేయం ప్రాముఖ్యత
- తేట తెలుగు, తెలుగుదనం
- నేల, నీరు
- సాహిత్యం, సంస్కృతి
- చరిత్ర
[మార్చు] విశేషాలు
- ప్రఖ్యాత గాయిని, నటి టంగుటూరి సూర్యకుమారి ఆలాపన ద్వారా అప్పటిలో ఈ గేయం బాగా జనాదరణ పొందింది.