దక్షిణ గంగోత్రి
వికీపీడియా నుండి
దక్షిణ గంగోత్రి అంటార్కిటికా ఖండంలో భారతదేశపు ప్రథమ కేంద్రము. ఈకేంద్రాన్ని 1985 లో స్థాపించడము జరిగినది. గంగోత్రి అనగా హిమాలయాలలోని ఒక హిమానీనదము ('గ్లేషియర్'), ఇది గంగా నది జన్మస్థానము. అంటార్కిటికా ఖండంలోని దక్షిణ గంగోత్రి ప్రాంతం కూడ ఒక హిమానీనదము లేదా గ్లేషియర్ లాంటి ప్రాంతం, ఈప్రాంతం భూగోళానికి మరియు భారతదేశానికి కూడా దక్షిణాన గలదు (సంస్కృతపదమైన దక్షిణ్ (దక్షిణము) ఆధారంగా) గావున ఈకేంద్రాన్ని దక్షిణ గంగోత్రి అను నామకరణం జరిగింది. ఇప్పుడు ఈ కేంద్రాన్ని ఉపయోగించడం లేదు. "మైత్రి" అనే కేంద్రాన్ని ఇప్పుడు వాడుతున్నారు.