Coordinates: 16°17′28″N 80°38′38″E / 16.291148°N 80.643866°E / 16.291148; 80.643866

నందివెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందివెలుగు
—  రెవెన్యూ గ్రామం  —
నందివెలుగు
నందివెలుగు
నందివెలుగు
నందివెలుగు is located in Andhra Pradesh
నందివెలుగు
నందివెలుగు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°17′28″N 80°38′38″E / 16.291148°N 80.643866°E / 16.291148; 80.643866
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ ఆరిశెట్టి శివనారాయణ,
జనాభా (2011)
 - మొత్తం 6,880
 - పురుషుల సంఖ్య 3,404
 - స్త్రీల సంఖ్య 3,476
 - గృహాల సంఖ్య 1,935
పిన్ కోడ్ 522306
ఎస్.టి.డి కోడ్ 08644

నందివెలుగు, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన తెనాలి నుండి 3 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1935 ఇళ్లతో, 6880 జనాభాతో 470 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3404, ఆడవారి సంఖ్య 3476. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1262 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 140. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590289[1].ఈ గ్రామం త్రిలింగ క్షేత్రంగా పేరు పొందిన గ్రామం.ఈ గ్రామం మండల కేంద్రమైన తెనాలికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

త్రేతాయుగంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమే నందివెలుగు. అగస్త్యమహర్షి తపస్సు చేసిన భూమి ఇది. శివభక్తుడైన ఆయన ఇక్కడ ఆలయం నిర్మించే సమయంలో దక్షిణభాగంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందులో వజ్రాలతో నింపాడు. వాటిని నందీశ్వరుని కొమ్ములపై పడి శివలింగం పాదాలపై పడేలా ఏర్పాటుచేశారు. కొమ్ములనుండి వెలుగు వచ్చే గ్రామం కావటంతో "నందివెలుగు"గా నామకరణం వచ్చిందని ప్రతీతి.

సమీప గ్రామాలు[మార్చు]

కొలకలూరు 2 కి.మీ, అనుమర్లపూడి 3 కి.మీ, కఠెవరం 3 కి.మీ, సోమసుందరపాలెం 3 కి.మీ, దుగ్గిరాల 3 కి.మీ.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి తెనాలిలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల తెనాలిలోను, ఇంజనీరింగ్ కళాశాల చింతలపూడిలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల చింతలపూడిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

నందివెలుగులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

నందివెలుగులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

నందివెలుగులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 110 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 359 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 11 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 348 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

నందివెలుగులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 283 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 64 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

నందివెలుగులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, పసుపు, అరటి

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్యసౌకర్యం[మార్చు]

ఈ గ్రామం కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉంది. మహర్షి దయానంద వృద్ధాశ్రమం:- ఈ ఆశ్రమంలో, 2015, సెప్టెంబరు-6వ తేదీనాడు, కామధేను స్వేచ్ఛావిహార్ గోశాలను ప్రారంభించారు. [9]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామంలోని కాలువ లాకులు శిథిలమవడంతో వాటిస్థానంలో కొత్త లాకులను నిర్మించుచున్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఆరిశెట్టి శివనారాయణ, సర్పంచిగా ఎన్నికైయ్యాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

ఇక్కడ దుర్గాదేవి, శివుడు, రాముడు, హనుమంతుడు మొదలైన దేవాలయాలతో పాటు మసీదు, చర్చి కూడా ఉన్నాయి. అన్ని మతాల వారు వైషమ్యాలకు దూరంగా కలిసుంటారు. దుర్గాదేవి గుడి చాలా పురాతనమైనది, అందులోని నంది వల్లనే ఈ ఊరికా పేరు వచ్చింది. దుర్గాదేవికి ప్రతి ఏటా జరిగే దసరా ఉత్సవాలు ఈ చుట్టుప్రక్కల చాలా ప్రసిధ్ధి చెందినవి. వినాయక చవితి, శ్రీరామనవమి మొదలైన పండుగలు బాగా జరుపుతారు. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముగ్గులు, భోగిమంటలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు చూడముచ్చటగా ఉంటాయి.

అగస్తీశ్వర స్వామి ఆలయం[మార్చు]

శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

శాలివాహన శకం 1127-1130 మధ్యకాలంలో ఆంధ్ర కళింగ దేశాన్ని పాలించిన గజపతిరాజుల కాలంలో, బుధ కౌశిక యోగేంద్ర హృదయధ్యేయుడు, ఈ ఆలయంలో విగ్రహమూర్తులను ప్రతిష్ఠించినట్లు శాసనాల ద్వారా తెలియుచున్నది. ఆలయ ప్రాకారంలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలతోపాటు, ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయాన్ని, తూర్పువైపు ఎత్తయిన గాలిగోపురాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి నల్లరాతి శిలనూ, ఆంజనేయుని విగ్రహానికి ఎర్ర రాతి శిలనూ వినియోగించడం, ఇక్కడి ప్రత్యేకత. ఉత్తర ద్వార దర్శనానికి అనుగుణంగా అప్పట్లోనే ఆలయం దూరదృష్టితో నియమించారు. ఈ ఆలయానికి 23 ఎకరాల మాన్యం భూమి ఉండగా, అర్చకులకు, స్వామి కైంకరాలకు 12 ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమిపై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమచేస్తున్నారు. గతంలో శ్రీరామనవమి ఉత్సవాలను 16 రోజుల పండుగగా నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలమైనది.

ఈ ఆలయంలోని పురాతన ధ్వజస్తంభం శిథిలమవడంతో, నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు 2016, ఏప్రిల్-4వ తెదీ సోమవారంనాడు శ్రీకారం చుట్టినారు. నూతన ధ్వజస్తంభాన్ని దాత శ్రీ నూకల వెంకటభాస్కరరావు వితరణగా అందించారు.

జెండా చెట్టు, మసీదుల వద్ద జరిగే ముస్లిం పండుగలు, వారు ఇతర మతస్థులను పిలిచి వడ్డించే హలీము మరుపురానిది. ఒకప్పుడు ఊరికి దూరంగా ఉండే క్రిస్టియన్ కాలనీకి దూరం ఇప్పుడు చాలా తగ్గి పోయింది.

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామంలో అత్యధికుల వృత్తి వ్యవసాయము. కొందరు గ్రామస్థులు తెనాలి, గుంటూరు, విజయవాడలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు వ్యాపారపనులు నిర్వహిస్తారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

నూకల వెంకట భాస్కరరావు:- ఈ గ్రామానికి చెందిన వీరు, గ్రామాభివృద్ధిలో విశేషంగా తన సహాయసహకారాలు అందించుచున్నారు.

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 6685, పురుషుల సంఖ్య 3348, మహిళలు 3337, నివాస గృహాలు 1679, విస్తీర్ణం 470 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.