నజ్మా హెప్తుల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నజ్మా హెప్తుల్లా (Najma Heptulla)
మైనారిటీ సంక్షేమ మంత్రి
Assumed office
26 మే 2014
ప్రథాన మంత్రినరేంద్ర మోడీ
రాజ్యసభ ఉపాధ్యక్షురాలు
In office
1985-1986, 1988 - 2004
రాజ్యసభ సభ్యురాలు
In office
2004-2010, 2012-present
వ్యక్తిగత వివరాలు
జననం (1940-04-13) 1940 ఏప్రిల్ 13 (వయసు 84)
భోపాల్
జీవిత భాగస్వామిఎ. అక్బర్ అలి హెప్తుల్లా (1966-2007) (మరణం)

నజ్మా హెప్తుల్లా ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. మోడీ కేబినెట్‌లో ఏకైక ముస్లిం నేతగా నిలిచి వార్తలలో కెక్కారు.

నేపధ్యం[మార్చు]

ఈమె ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనుమరాలు. భోపాల్‌కు చెందినవారు. ఆమె నాలుగుసార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు రాజ్యసభ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. సోనియా గాంధీతో వచ్చిన విభేదాల కారణంగా 2004లో కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. హమీద్ అన్సారీ మీద భారతీయ జనతా పార్టీ తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడారు. ఆమె జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. పలు పరిశోధన వ్యాసాలు రచించారు. నజ్మాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]