Coordinates: 16°07′54″N 80°52′20″E / 16.131681°N 80.872193°E / 16.131681; 80.872193

నడకుదురు(చల్లపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నడకుదురు
—  రెవెన్యూ గ్రామం  —
నడకుదురు is located in Andhra Pradesh
నడకుదురు
నడకుదురు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°07′54″N 80°52′20″E / 16.131681°N 80.872193°E / 16.131681; 80.872193
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ పుట్టి వీరాస్వామి
జనాభా (2001)
 - మొత్తం 3,710
 - పురుషులు 1,874
 - స్త్రీలు 1,836
 - గృహాల సంఖ్య 1,058
పిన్ కోడ్ 521126
ఎస్.టి.డి కోడ్ 08671

నడకుదురు, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చల్లపల్లి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1216 ఇళ్లతో, 3620 జనాభాతో 1439 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1838, ఆడవారి సంఖ్య 1782. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1057 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 24. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589745.[1]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పురిటిగడ్డ, నిమ్మగడ్డ, నాదెండ్లవారిపాలెం, రాముడుపాలెం, వెలివోలు, పాగోలు గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి చల్లపల్లిలోను, మాధ్యమిక పాఠశాల పురిటిగడ్డలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మచిలీపట్నంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చల్లపల్లిలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

నడకుదురులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

నడకుదురులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

నడకుదురులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 961 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 477 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 477 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

నడకుదురులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 158 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 319 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

నడకుదురులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అరటి, పసుపు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

ఇటుకలు, బియ్యం

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చల్లపల్లి మండలం[మార్చు]

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు , నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరువెనుక చరిత్ర[మార్చు]

శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడిగా ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి నాడు నరకాసురుడిని ఇక్కడే సంహరించాడని స్కంద పురాణం చెబుతున్నది. ఈ వూరి పురాతన నామాలు :- నరకోత్తారక క్షేత్రం, నరకొత్తూరు, నడకదూరు. [2]

మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామంలో ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకాన్ని నిర్మించారు. ఈ పథకానికి రోటరీ క్లబ్ ఆఫ్ చల్లపల్లి వారు రు.3.7 లక్షల విలువగల యంత్రాలను, భవనం మరమ్మత్తులకు సహకారాన్నీ అందించారు. నడకుదురు పంచాయతీ తరపున భవన నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం, నీటి సదుపాయం ఏర్పాటు చేసారు. [6]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం[మార్చు]

నడకుదురు గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుచున్న గ్రామ సచివాలయభవనం, 21.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుచున్న రైతు భరోసా కేంద్రం భవనాలకు,2020,సెప్టెంబరు-27న మంత్రి శ్రీ సింహాద్రి రమేష్‌బాబు శంఖుస్థానగావించారు. [10]

గ్రామపంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో పుట్టి వీరాస్వామి సర్పంచిగా, 8 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పృధ్వీశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

  1. కారీకమాసంలో భక్తులు వేకువఝామునుండియే ఈ ఆలయానికి చేరుకొని కృష్ణానదిలో పుణ్యస్నానాలాచరించి, ఆలయ ద్వజస్తంభం చుట్టూ ప్రమిదలతో కార్తీకదీపాలు వెలిగించెదరు. శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [5]
  2. ఈ అలయంలో, 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం ఉదయం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో శతసహస్ర నామాలతో ఘనంగా బిల్వార్చన నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ పృధ్వీశ్వరుడు దర్శనమిచ్చాడు. [4]
  3. ఈ ఆలయానికి రాముడుపాలెం గ్రామంలో 2.76 ఎకరాల మాన్యం భూమి ఉంది. []

శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం[మార్చు]

పాటలీవనంలో కొలువైయున్న ఈ ఆలయంలో భక్తులు, 2014,అక్టోబరు-27, నాగులచవితి మరియూ కార్తీకసోమవారం సందర్భంగా స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి తమ మొక్కుబడులు తీర్చాలంటూ పాటలీవృక్షాలకు తమ మొక్కుబడులు కట్టినారు. [5]

శ్రీ రామాలయం[మార్చు]

పాతనడకుదురు గ్రామంలో రు. 8 లక్షలతో నూతనంగా నిర్మించిన ఈ రజక రామాలయంలో, 2o15-మార్చ్-28వ తేదీ,శనివారం, శ్రీరామనవమి రోజున విగ్రహ ప్రతిష్ఠా మహొత్సవం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేయించి ఐదుగురు దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణం చేయించారు. భక్తులకు పానకం, వడపప్పు అందించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [7]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

అరిపిరాల విశ్వం వీరు ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక గురువు. "ఆనందఘన"గా సుప్రసిద్ధులు.

కీ.శే.కళ్ళేపల్లి శ్రీమన్నారాయణ:- పాతనడకుదురు గ్రామంలో, సా.శ. 1922 లో జన్మించిన వీరు, బాలనటుడిగా రంగస్థల ప్రవేశం చేసి, 18 వ సంవత్సరాల వయసు నుండి, రంగస్థల నటుడిగా ఖ్యాతి గడించడమేగాక, ఎంతోమందిని కళాకారులుగా తీర్చిద్దినారు. వీరు 94 సంవత్సరాల వయసులో, 2017,జనవరి-5న తన స్వగృహంలో, వయో భారంతో కన్నుమూసారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3710. ఇందులో పురుషుల సంఖ్య 1874, స్త్రీల సంఖ్య 1836, గ్రామంలో నివాస గృహాలు 1058 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1439 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.

వెలుపలి లింకులు[మార్చు]