నన్ను దోచుకొందువటే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.నా.రె

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని...అను ఈ పాట గులేబకావళి కథ (1962) అను సినిమాలోనిది. ఇందులో ఎన్.టి. రామారావు, జమున కలిసి నటించారు. ఈ సినిమాలోని పాటలన్నీ దాదాపుగా ఘంటసాల, పి.సుశీల గారు కలిసి ఆలపించారు.

పాట[మార్చు]

పల్లవి:

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ...

కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి .... నిన్నే నా స్వామి

నన్ను దోచుకొందువటే.........

చరణం 1 :

ఆమె:

తరియించును నీ చల్లని చరణమ్ముల నీడలోన

తరియించును నీ చల్లని చరణమ్ముల నీడలోన

పూల దండవోలే ...కర్పూర కళికవోలె... కర్పూర కళిక వోలె...

అతడు:

ఎంతటి నెరజాణవు... నా అంతరంగమందు నీవు

ఎంతటి నెరజాణవు... నా అంతరంగమందు నీవు

కలకాలము వీడని సంకెలలు వేసినావు...సంకెలలు వేసినావు

నన్ను దోచుకొందువటే.........

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ...

కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి .... నిన్నే నా స్వామి

చరణం 2 :

ఆమె:

నా మదియే మందిరమై... నీవే ఒక దేవతవై

నా మదియే మందిరమై... నీవే ఒక దేవతవై

వెలసినావు నాలో నే కలిసిపోదు నీలో....కల్సిపోదు నీలో

అతడు:

ఏనాటిదో మమ బంధం..... ఎరుగరాని అనుబంధం

ఏనాటిదో మమ బంధం..... ఎరుగరాని అనుబంధం

ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం....ఇగిరిపోని గంధం...

నన్ను దోచుకొందువటే.........

నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని ...

కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి .... నిన్నే నా స్వామి

నన్ను దోచుకొందువటే.........

వివరణ[మార్చు]

డా.సి.నారాయణరెడ్డి గారు ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ సినిమాకు గాను ఆయన రాసిన మొదటి పాట ఇది. అందరూ పాడుకునేలా సరళమైన పదాలతో, ఎంతో అర్ధం వచ్చేలా రాశారు.