నములకంటి జగన్నాథమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నములకంటి జగన్నాథం
నములకంటి జగన్నాథం
నములకంటి జగన్నాథంయ
జననంనములకంటి జగన్నాథం
ప్రసిద్ధిరాజకీయనాయకుడు, కవి
మతంహిందూ మతము

నములకంటి జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. రాజకీయనాయకుడు. కాంగ్రేసువాది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సభ్యులుగా, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. ఈ కవి ' అరుంధతీదేవి చరిత్రం ' అను వచన కావ్యాన్ని, ' వనితా విలాసం ' అను పద్యకావ్యాన్ని, నల్గొండ జిల్లాలోని యాదగిరి నరసింహస్వామిపై శార్దూల మత్తేభ విక్రీడితలతో ' శ్రీయాదగిరి నరసింహస్వామి ' శతకాన్ని రచించారు[1]... అంతేకాకుండా శివకేశవ భేదరాహిత్యాన్ని తెలుపుటకంటూ, ఉత్పలమాల, చంపకమాలలతో 'గిరిజా మనోహరా!' అను మకుటంతో, శతక రూపంలో ' శ్రీశైల గిరిజా మనోహరం ' అను కావ్యాన్ని రచించాడు. దీనిని నాటి ముఖ్యమంత్రి శ్రీకాసు బ్రహ్మానందరెడ్డికి....

శైలజామనోనాథుని- శతక కృతిని

స్వీకరింపుము శ్రీశైల క్షేత్రపతిని

గూర్చి వ్రాసితి శుభములు - గొనుము జగతి

మానితౌదార్య మాముఖ్యమంత్రివర్య! అంటూ అంకితమిచ్చాడు.

రచనలు[మార్చు]

  • అరుంధతీదేవి చరిత్రం (వచన కావ్యం)
  • వనితా విలాసం (పద్య కావ్యం)
  • శ్రీయాదగిరి నరసింహస్వామి (శతకం)
  • శ్రీశైల గిరిజా మనోహరం (శతకం)
అరుంధతీదేవి చరిత్రం
మాల, మాదిగలు పరాయి మతాలలోకి ప్రవేశించటానికి కారకులు ఎవరు?, నాడు 15 కోట్లు ఉండిన ఈ వర్గ జనాభా దేశం విడిచిపోతే మన సమాజ స్వరూపం ఎమయ్యేది? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ గ్రంథాన్ని రచించినట్లు రచయిత ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో తెలియజేశాడు[2].

మూలాలు[మార్చు]

  1. శ్రీశైల గిరిజామనోహరం, రచన:నములకంటి జగన్నాథమ్, అరవింద పబ్లికేషన్స్, హైదరాబాద్, ముందుమాట
  2. అరుంధతీ దేవి చరిత్రం, వైదిక గ్రంథ ప్రచారక మండలి, హైదరాబాద్-1968.