నిజాం కళాశాల
|
నిజాం కళాశాల |
|
|---|---|
| స్థాపన | 1887 |
| తరహా | సార్వత్రిక |
| ప్రదేశం | హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్, భారత్ |
| క్యాంపస్ | పట్టణ ప్రాంతం |
| అనుబంధాలు | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
| వెబ్సైటు | [1] |
నిజాం కళాశాల హైదరాబాదు నగరంలో ప్రముఖ ఉన్నత విద్యా సంస్థ, మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయము. నిజాం కళాశాల 1887లో ఆరవ అసఫ్జాహీ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో స్థాపించబడినది. ఇది హైదరాబాదులోని బషీర్భాగ్ ప్రాంతములో ఉన్నది.
నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నది. సంవత్సరం పొడుగునా జరిగే ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్ధి అయిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సురేష్ రెడ్డి జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది ప్రముఖ పూర్వవిద్యార్ధులు పాల్గొన్నారు.
చరిత్ర [మార్చు]
ప్రస్తుతమున్న ప్రధాన కళాశాల భవనము హైదరాబాదు నగర ప్రముఖులలో ఒకడైన ఫక్రుల్ ముల్క్ II యొక్క మహలు. హైదరాబాదు పాఠశాల (నోబుల్ పాఠశాల) మరియు మద్రసా-ఏ-ఆలియాలను కలిపి నిజాం కళాశాలను స్థాపించారు. కళాశాల స్థాపకుడు మరియు విద్యావేత్త అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ సరోజినీ నాయుడు తండ్రి అయిన డా. అఘోరనాథ్ ఛటోపాధ్యాయను ఏరికోరి కళాశాల తొలి ప్రిన్సిపాలుగా నియమించాడు.
ప్రముఖ పూర్వవిద్యార్ధులు [మార్చు]
- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
- సురేష్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్
- నందమూరి బాలకృష్ణ - సినీనటుడు
- రాకేశ్ శర్మ - వ్యోమగామి
- టి.సుబ్బరామిరెడ్డి - రాజ్యసభ సభ్యుడు
- అబ్బూరి ఛాయాదేవి - ప్రముఖ కథా రచయిత్రి.
- బూర్గుల రామకృష్ణారావు - హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
- సీతారాం యేచూరి - పార్లమెంటు సభ్యుడు, సి.పి.ఎం. నాయకుడు
- శ్యాం బెనగళ్ - భారతీయ సినిమా దర్శకుడు
- ఖండవల్లి లక్ష్మీరంజనం - సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు
- సూరి భగవంతం - సుప్రసిద్ధ శాస్త్రవేత్త