నిరుపమ రావు

వికీపీడియా నుండి
Nirupama Menon Rao
నిరుపమ రావు

పదవీ కాలము
July 31, 2009 - Incumbent
ముందు Shiv Shankar Menon
తరువాత Ranjan Mathai

జననం డిసెంబర్ 6 1950 (1950-12-06) (వయసు 61)
Malappuram, Kerala, India
వృత్తి Civil Servant (Indian Foreign Service)

నిరుపమ మీనన్ రావు (డిసెంబర్ 6, 1950న జన్మించారు) ఒక ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి మరియు ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సేవలను అందిస్తున్నారు.[1]

జూలై 2009లో, ఆమె (చోకిలా అయ్యర్ తరువాత) ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా భారత విదేశాంగ కార్యదర్శి పదవిని చేపట్టిన రెండవ మహిళ అయ్యారు. ఆమె వృత్తి జీవితంలో అనేక పదవులను చేపట్టారు, అందులో వాషింగ్టన్‌లో పత్రికా వ్యవహారాల మంత్రిగా, మాస్కోలో డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ మిషన్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా (తూర్పు ఆసియా), (విదేశీ ప్రచారం) విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో మొదటి మహిళా అధికార ప్రతినిధిగా, సిబ్బంది ముఖ్యాధికారిగా, పెరూ మరియు చైనాకు రాయబారిగా మరియు శ్రీలంక హై కమిషనర్‌గా ఉన్నారు.[2][3]

విషయ సూచిక

[మార్చు] ప్రారంభ జీవితం

నిరుపమ రావు కేరళలోని మలప్పురంలో మీంపట్ థార్వాడ్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి భారత సైనికదళంలో పనిచేసేవారు. ఆమె తన విద్యాభ్యాసంను బెంగుళూరు, పూణే, లక్నో, కునూర్ వంటి అనేక నగరాలలో పూర్తిచేశారు. ఆమె తన BA(ఇంగ్లీష్) ఆనర్స్‌ను 1970లో బెంగుళూరులోని మౌంట్ కామెల్ కళాశాలలో చేశారు, [4] అది అప్పుడు మైసూరు విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉండేది. తరువాత, ఆమె ఆంగ్ల సాహిత్యంలో తన మాస్టర్స్‌ను అప్పట్లో మహారాష్ట్రాలో మరాఠ్వాడ విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఆమె 1973లోని ఆల్ ఇండియా సివిల్ సర్వీసస్ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచారు మరియు ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు.[3]

[మార్చు] వృత్తిజీవితం

నిరుపమ రావు 1973 యొక్క ఇండియన్ ఫారిన్ సర్వీస్ జట్టులో ప్రథమ స్థానంలో నిలిచారు. భారతదేశంలో ఆమె శిక్షణను ముగించిన తరువాత, డెభైల మధ్యలో ఆమె వియన్నాలోని(ఆస్ట్రియా) భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు. 1981-83 మధ్యకాలంలో శ్రీలంకలోని భారత హై కమిషన్‌లో మొదటి కార్యదర్శిగా ఆమె పనిచేశారు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఆమె పనిచేసిన ఆరంభ సంవత్సరాలలో, చైనాతో భారతదేశానికి ఉన్న సంబంధాలలో ఆమె ప్రత్యేకతను పొందారు మరియు ప్రధానమంత్రి డిసెంబర్ 1988లో బీజింగ్‌కు చారిత్రాత్మక పర్యటన చేసినప్పుడు అధికార సభ్యులుగా ఉన్నారు.

1992-93 మధ్యకాలంలో రావు హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని వెదర్‌హెడ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ విద్యార్థిగా ఉన్నారు, అక్కడ ఈమె ఆసియా-పసిఫిక్ భద్రత మీద ప్రత్యేక అధ్యయనం చేశారు.

వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాలలో మరియు మాస్కోలో మంత్రిగా మరియు డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ మిషన్‌గా వరుసగా పనిచేశారు. ఆమె మొదటిసారి రాయబారిగా పెరూకు పంపబడ్డారు మరియు 1995-1998 మధ్యకాలంలో బొలివియా బాధ్యతలను కూడా తీసుకున్నారు. 2001లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ యొక్క మొదటి మహిళా అధికార ప్రతినిధిగా నియమింపబడ్డారు. భారతదేశ హైకమిషనర్‌గా 2004లో ఆమె శ్రీలంకకు పంపబడింది. 2006లో, చైనాకు ఆమె భారతదేశం యొక్క మొదటి మహిళా రాయబారిగా అయ్యారు. ఆగష్టు 1, 2009న శివశంకర్ మీనన్ తరువాత ఆమె భారతదేశం యొక్క విదేశాంగ కార్యదర్శి అయ్యారు.

డిసెంబర్ 21, 2010న, భారత విదేశాంగ కార్యదర్శిగా నిరుపమ రావు పదవీకాలంను పొడిగించటానికి భారత ప్రభుత్వం అంగీకరించింది.[[5]]

[మార్చు] రచనా వృత్తి

ఆమె రైన్ రైజింగ్ అనే పేరుతో కవితా సంపుటిని వ్రాశారు.[6] ఆమె కవితలు చైనీస్ మరియు రష్యన్ భాషలలో అనువదించబడ్డాయి.

[మార్చు] సూచనలు

విదేశాంగ కార్యదర్శిగా నిరుపమ రావు పదవీ బాధ్యతలను తీసుకున్నారు

[మార్చు] బాహ్య లింకులు

  • ప్రొఫైల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ(భారతదేశం) వెబ్‌సైట్
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు