పర్యావరణ కవితోద్యమము
పర్యావరణ కవితోద్యమం తెలుగు నాట ప్రారంభమైన ఓ ఉద్యమం. ఇది 2008 లో ప్రారంభమైనది. తెలుగు సాహిత్యంలో ఇది ఓ గొప్ప మలుపు[ఆధారం కోరబడినది]. తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ తేవాలనే తపనతో ఈ ఉద్యమం ప్రారంభమైనది. అది 2008, తెలుగు కవి లోకం దళితవాదం, స్త్రీవాదం గురించి చర్ఛిస్తున్న రోజుల్లో ఈ ఉద్యమం కవులను తన వైపు ఆకర్షించింది. ఒక్కసారి అందరినీ ఆలోచింపచేసింది[ఎవరు?]. ఇప్పటికి దీని ప్రభావం తెలుగు కవిత్వం మీద ఎంతో ఉంది[ఆధారం కోరబడినది]. అనేకమంది కవులు దీనికి ప్రభావితులు అయ్యారు[ఎవరు?].
విషయ సూచిక |
హరిత కవిత [మార్చు]
హరిత కవిత అనేది పర్యావరణ కవితోద్యమం లో ఒక కార్యక్రమము. ఇది అంతర్జాతీయ తెలుగు కవితల పోటీ. జాగృతీకిరణ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని మల్లెతీగ అనే పత్రికతో కలసి ప్రారంభించింది. .2008లో ప్రారంభమైన ఈ ఉద్యమానికి శ్రీకారం హరిత కవితతోనే జరిగింది. సృజనాత్మక ప్రక్రియలద్వారా, రచనలద్వారా పర్యావరణం మీద అవగాహన కల్పించాలనదే ఈ ఉద్యమం యొక్క ముఖ్యలక్ష్యం.
హరిత కత [మార్చు]
హరిత కత 2009 లో ప్రారంభింపబడినది. ఇది తెలుగు కధానికల పోటి. జాగృతీకిరణ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని కధాకేళి అనే పత్రికతో కలసి ప్రారంభించింది.
హరిత చిత్ర [మార్చు]
హరిత చిత్ర ఇది తెలుగు కార్టూనుల పోటీ. జాగృతీకిరణ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.