పానశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పానశాల, దువ్వూరి రామిరెడ్డి వ్రాసిన పద్య కావ్యము. పారసీక కవి ఆయిన ఉమర్ ఖయ్యాం (జననం:1048 - మరణం: 1123) రచించిన "రుబాయితు"లకు ఇది అనువాదం.

పానశాల కావ్యం ముఖచిత్రము

కాలగర్భంలో దాగియున్న కవుల చరిత్రలాంటిదే ఖయాం చరిత్ర కూడా. కాని ఆయన రాసిన రుబాయులు మాత్రం కాలంతో కలసిసాగుతున్నాయి. వీనిని ఎడ్వర్డ్ పిడ్జిరాల్డ్ (EDWARD FITZ GERALD) 1859లో ఆంగ్ల భాష లోనికి అనువదించాడు. ఆరోజుల్లో అమెరికాని ఒక ఊపు ఊపినయి ఈ రుబాయిలు ఫిట్ జెరాల్డూ తర్జుమా ప్రజాదరణ పొంది లక్షలకొలది ప్రతులు అమ్ముడు పొయాయి అని అంటారు.


ఖయ్యామ్ తన రుబాయిలలొ చర్చించిన విషయాలు "నేనెవ్వడను, ఎచతనుండి వచ్చాను, ఎచ్చాటికిపొతున్నాను, మానవకొటియందువైవిధ్యం ఏందుకు,స్రుష్టీకర్త ఒక డూన్నాడా, విచిత్రమైనస్రుష్టీకి అర్దమ్ ఎమిటి" మొదలగు అంశాల మీద ఛందొబద్దంగా రాసిన పధ్యాలు రుబాయీలు


"కవికోకిల" దువ్వూరి రామిరెడ్డి (జననం 1895 నవంబరు 9 ; మరణం 1947–9వనెల 11వతారీఖు ) పానశాల రచనాకాలం 1926లో ప్రథమంగా1928 భారతిలో ప్రచురించబడింది.

దువ్వూరి 1934 లో పానశాల కావ్యమును పుస్తకముగా ప్రకటించినప్పుడు, పానశాల పుస్తకములో 34 పుటల ఉపోద్ఝాతమును వ్రాసి చేర్చారు. ఈ ఉపోద్ఝాతములో మొదట పారసీక సాహిత్యము యొక్క చారిత్రక వైశిష్టతను వివరించారు. (పూర్వం (6 వశాతాబ్దికి ముందు) పారసీకమున నాగరికత, శూరత్వము, సంగర కళాకౌశలము అత్యున్నత దశయందువున్నది.7 వశాతాబ్దిలో ప్రారంభంలో అరబ్బులు పారశీకమును జయించి పరిపాలనముతోడ పారసీకములో కూడా మహమ్మదీయ మతమును వ్యాప్తి కావించారు.అలాగే పారసీక భాషలోకి అరబ్బుసాహిత్యప్రభావం మొదలై పారసీకం లోకి అరబ్బు పదాలు చేరాయి ( తెలుగు భాషలో సంస్కృత పదములు చేరినట్లుగా) ).అయితే కాలక్రమేనా పారసీక పండితులు తమ పారసీక భాషకు పూర్వ స్దితిని కల్గించారు.ఫిరదౌసికూడా షానామా గ్రంథాన్ని పారసీక భాషలోనే వ్రాసాడు.).అలాగే పారసీక భాషలోని కావ్యభేదాలను ఈ ఉపోద్ఝాతములో దువ్వూరుగారు వివరించారు.పారశీక చందస్సు మాత్రాగణబద్ధము.మన్నవి, కసీదా, గజల్, రుబాయ్, అను నాలుగు కావ్యభేదములు ప్రసిద్ధి చెందివున్నాయి.పారసీక సాహిత్యం గూర్చి ఈ పుస్తకములో 9 పుటలలో విపులంగా దువ్వూరి వివరించి పాఠకులకు పారసీక భాషను పరిచయం చేసాడు.మిగిలిన పుటలలో ఉమ్రఖయ్యామును చదువరులకు పరిచయము చేసాడు దువ్వూరి.

ఈ విధముగా పారసీక సాహిత్యము గుర్చి, ఉమ్రఖయ్యాము గూర్చి పాఠకులకు వివరించడం వలన పాఠకులకు ఖయ్యాము గురించి ఒక అవగాహనకు రావడం వలన కావ్యం సులభంగా అర్ధము చేసుకొనే అవకాశము లభించింది.

పానశాల అనువాద కావ్యమైనప్పటికి, స్వతంత్ర రచన లక్షణాలను కల్గివున్నది.ఖయ్యాము యొక్క రుబాయూతుల మూలభావాన్ని తీసుకొని రచనలో స్వ్తంత్రత వున్న కావ్యమిది.ఖయ్యాము రుబాయూలలో కథలేదు, విషయైక్యత ఉండదు.కవి కలానుగుణ్యముగా రాజాస్ధానమునందు, పండితుల గోస్ఠులందు, శిష్యులకు పాఠం చెప్పునప్పుడు, ప్రకృతి రమణియతను ఆస్వాదీస్తు, ఇష్టమున్నప్పుడు ఆశువుగా చెప్పిన రుబాయూతులు ఇవి.అందుచే ఇందులో భిన్నవిషాయాలు వ్యక్తమవ్వుతాయి.వేమన పద్య సంపుటములవలె ఖయ్యాము రుబాయూతులు కూడా కలగూర గంప.

ఉదాహరణలు[మార్చు]

అంతములెని యీ భువనమంత పురాతన పాంధశాల , విశ్ర్రాంతి గ్రుహంబు ,అందు యిరు సంధ్యలు రంగుల వాకిలుల్
ధరాక్రాంతులు,పాదుషాలు, బహరామ్ జమిషీడులు వెనవేలుగా కొంతసుఖించి పొయిరెటకొ పెరవారికి చొటొసంగుచున్

తూర్పు పడమరలు వాకిలులుగా గల ఈఅనంత విశ్వం ఒక సత్రం లాంటి ది అందులో రాజులు, పాదుషాలు కొంతకాలం సుఖంగాఉండి వచ్చే వారికి చొటిస్తూ ఎక్కడికొ వెల్లిపొయారని దీని బావం

జలజల మంజులార్బటులు జాల్కొను ఈసెలఏటికొవలన్
మొలచిన లేతపచ్చికల మొటుగ కాలిడ బొకు
దెవదూతల రుచిరాధర ప్రకృతి దాల్చెనొ సుందరమందగామి
ఎ లలిత శరిర మ్రుత్కాణాల జిగురించనొ ఎమొ కొమలి

జలపాతాలలో ఏగిసి పడే నీటి తుంపరలకి అంచున మెత్తగా పెరిగే గడ్డిని కాలితో తొక్కవద్దు. ఇది ఎ దేవదూతల పెదవుల ప్రక్రుతో లేక మెత్తనిశరీరం కల చనిపోయిన ఓ అందమైన అమ్మాయి శరిరం నుండి చిగురించినదో ఎవరికి తెలుసు

పరమొ గిరమ్మొ దానితలపై దొచెడు మన్నుచల్లి
సుందరి మెరుంగు కపొలముల దాచిన ముద్దులు దొంగిలించి
సంబరముగ శీధువానుము నమాజులు పూజలు చెయనేల
ఎవ్వరైనా వచ్చినారె మ్రుతివాటిక కేగిన పూర్వయాత్రికుల్

యిహము పరము అనేది లేదు ఉన్నంతకాలం బూమ్మీద సుఖపడం మాని ఖయ్యామ్ ఉద్దేశ్యమ్. చనిపోయినవారు ఎవరైనా తిరిగి వచ్చారా అని ప్రస్నిస్తున్నాడు


మరణయంబు నాకు అణుమాత్రము లేదు
మదీయ జీవ సంబరన భయంబె మిక్కుటము ప్రాణము దెవము వద్ద వడ్డి
బేహారముకు అప్పుగొం టి ఋణమంతయు ఇమ్మని తల్పు తట్టి న
సరసర హేమనిష్కముల సంచులు ముందర విప్పిపొసెదన్

తనకి చావు భయం కన్నా బ్రతుకు భయం ఎక్కువ అంటాడు. ప్రాణాన్ని దేవుని వద్ద తాకట్టు పెట్టి జీవితాన్ని అప్పుగా తెచ్చు కున్నానంటాడు అప్పు కోసం దేవుడు తలుపు తట్టినప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు తిసుకో అనొచ్చు అని దీని భావం

మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపొతి
పాతవై చినెగెను నెడున్ మరల చెప్పుల కొసము వచ్చినాడన్
నెమ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపగరాను
నీవు చచ్చినయెడ వీడిపొయెదవు చెప్పులవొలె నమాజుసైతమున్

పొయినసారి దొంగిలించిన చెప్పులు చినిగిపొయినవి మరలా చెప్పుల కోసం వచ్చాను కాని నమాజు కోసం కాదు చచ్చి పొయిన తరువాత చెప్పులాగే నమాజులు కుడా పొతాయి కదా అంటాడు ఖయామ్

గతము గతంబె యెన్నటికిన్ కన్నుల గట్టదు సంశయాంధ సంవృతముభవిష్యదర్డ్హము
ఒక్క వర్తమానమె సతత మవ స్యమగు సంపద విషాదపాత్రకి
ఈమతమున తావులేదు క్షణ మాత్రవహింపుము పానపాత్రికన్

గతము కానరాదు భవిష్యత్తు తెలియదు. ఒక్క వర్తమానం మాత్రం అనుభవించటానికి పనికి వచ్చె సంపద. విషాదా నికి తావు లేదు ఆనందంగా మధుపాత్ర తిసికొ మంటాడు ఖయ్యామ్

తారాశుక్తులు రాల్చినట్టి జిగిముత్యాలట్లు పూరేకులన్
జారెన్ సన్నని మంచుతుంపురులు వాసం తొదయశ్రీ కి
కాం తారత్నం అనువెన నెచ్చెలిగ ఉద్యానంబునం దొచె
మిత్రా రారమ్ము సుఖింపుము ఈఅదను వ్యర్ధంబై న రాదెన్నడున్

పూల రెకులనుం జారిపడె మంచు చినుకుల్ని ఆకాశంలొ నక్షత్రాలు రాల్చె ముత్యాలు గా వర్నిస్తాడు
మిత్రుడా వసంతఋతువులొ ఉద్యానం అనువుగాఉంది ఈ అదను పొతె మల్లి రాదు అని అంటున్నాడు ఖయ్యామ్

ఆదిమధ్యాంత రహితమై యలరచుండు
కాలయవనిక భేధింప గలమె మనము
ఇటకు ఎందుండి వచ్చె ఇకెటకు బొవు
ప్రాణియను ప్రశ్నకు ఎవ్వాండుబదులుచెప్పు
మొదలు చివర లెని ఈ కాలతెర ను కనుగొనలెము

ఇ క్కడికి ఎక్కడ నుండి వచ్చాము ఎక్కడికి వెలుతున్నము
ఈప్రశ్నకు బదులు ఎవరు చెప్థారు

అఖిల శాస్త్ర పురాణ తత్వాబుధు లీది
పరమ విజ్ఞాన దీపమౌ పండితుండు
కాలరాత్రిని మార్గంబు కానలెక
అల్ల మాములు కథ జెప్పి అంతరించు
సకల శాస్త్రలు సదివిన పండితుడు కుడా
పొయెటప్పుడు అందరు చెప్పె మాములు కథె చెబుతాడు


నిన్నటి రోజు కుమ్మరిని కనుకొం టి బజారువీధిలొ
మన్నొక ముద్దజెసి మడమం జెడంద్రొక్కుచు నుండ వానితొ అది
చిన్నగ మందలించె నది దీనత మెల్లగ సలంగ ద్రొక్కు మయన్న
ఎరుంగవే నన్నునొకప్పుడు నీవలె నందగాడినె
మట్టి ముద్ద ను తొక్కు తున్న కుమ్మరి తొ ఆముద్ద
అన్నా మెల్లిగా తొక్కు నెనుకుడా నికుమాదిరిగా ఒకప్పుడు అంగాడినె అని అంటుంది
ప్రతివాడు మట్టి లొ కలసి పొయెవాడె అని ఖయ్యామ్ అంటాడు


ఇల చదరంగం అదుజెనులెల్లరు పావులు లహస్సులున్ నిశల్
తెలుపు నలుపు గళ్ళ కదిలించును రాజును బంటును టక్కు పావుల
విధి ఆటగాడు పలుపొకల్న్ ద్రిప్పును గళ్ళూ మార్ఛు నవ్వల
నొకటొకటిన్ జదిపివైసు నగాధ సమాధి పెటికన్

ఈభుమి ఒక చదరంగము పగలు రాత్రి నలుపు తెలుపు గళ్ళు జనులందరు పావులు
ఆట గాడు విధాత చివరకు రాజులు బంటులు అందరూ సమాధి లొ కి వెల్లెవారె


విషము నమ్రు తంపు మసిబుడ్ల్ల విధి కలంబు ముంచి
లొకుల నుదుట లిఖించు మొదట
గరంగ దరుంబేద కన్నిటి కాల్వ నదియు
పరమ భక్తుని యనుతాప వహ్ని జెడదు
విషాన్ని అమ్రుతాన్ని కలిపి మానవుల నుదుట రాసెరాతలకు

మెమెం దుకు బలి కావాలి దెవుడా అని అడుగు తున్నాడు ఖయ్యామ్ ఇవి మొచ్చుకు కొన్నిమాత్రమే 125 రుబాయీలలో 10% మాత్రమే

1928 మొదలు 1991 వరకు 10 ముద్రణలు వెలువడింది. దీనిని బట్టి ఈపానశాలకు ఎంత ప్రజాదరణ ఉందొ తెలుస్తుంది. పారశికములో ఖయ్యామ్ రుబాయీలు ఎలాఉంటాయొ తెలీయదుగాని దువ్వురి రామిరెడ్డి గారి పానశాల మాత్రం తెట తెలుగులో హృదయానికి హత్తు కునే విధంగా ఆనందంగా అహాల్హాదం గా మరచి పొలెని మధురానుభుతిని అందిస్తాయీ అన్నది అక్షరసత్యం.

చివరిగా రామిరెడ్డి గారిని గురించిక్లుప్తంగా ఊరు నెల్లూరు దగ్గర పెమ్మారెడ్డి పాలెం చదువు 8వతరగతి వ్యవసాయదారుడు

ఇతర రచనలు[మార్చు]

  • రసికజనానందము'
  • కర్షక విలాసము
  • జలదాంగన
  • కడపటి వీడ్కొలు
  • ఫలితకేశము

మొదలగు అనేక రచనలు చేసారు అన్నిటికన్నా పానశాల అత్యత ప్రజాదరణ పొదిన కావ్యం' కొల్లి శివరామకృష్ణా రెడ్డి హైదరాబాదు

ప్రచరణ[మార్చు]

ప్రస్తుతము పానశాల కావ్యాన్ని విజయవాడకు చెందిన 'క్లాసిక్ బుక్స్ 'వారు అగస్టు 2012లో ముద్రించారు.ముఖచిత్రాన్ని తేజోమూర్తుల కేశవరావు చిత్రించాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=పానశాల&oldid=3887387" నుండి వెలికితీశారు