పానుగంటి లక్ష్మీ నరసింహారావు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
పానుగంటి లక్ష్మీ నరసింహరావు (Panuganti Lakshmi Narasimha Rao) (1865 - 1940) ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.
విషయ సూచిక |
[మార్చు] బాల్యం, విద్యాభ్యాసం
రచయితగా పేరుపడిన నరసింహరావు రక్తాక్షి సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి నాడు అనగా 1865, నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ మరియు వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు.
వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. తరువాత పెద్దాపురం హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.
[మార్చు] సంస్థానాల దివాను
వీరు లక్ష్మీనరసాపురం జమిందారిణి రావు చెల్లయమ్మ గారి దివానుగా చేరారు. ఆరు సంవత్సరాల తర్వాత అభిప్రాయభేధాల మూలంగా ఉద్యోగం మానివేశారు. తరువాత ఉర్లాము సంస్థానం లోను, బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలోను దివానుగా కొంతకాలం పనిచేశారు.
పిఠాపురం మహారాజా శ్రీ సూర్యారావు బహదూరు వారికి మైనారిటీ తీరగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పంతులుగారిని 1915-16 మధ్య 'నాటక కవి'గా తమ ఆస్థానంలో నియమించారు. వీరి కోరికపై అనేక నాటకాలు వ్రాసారు. వాటి నన్నింటిని మహారాజుగారే అచ్చువేయించారు.
సుమారు ఇరవై సంవత్సరాలు వీరికి జీవితం సుఖంగా జరిగింది. ఆ రోజుల్లో దివాణం తరువాత వ్యయానికి వీరి గృహమే అనేవారు. ఆధునిక శ్రీనాధునిగా జీవించారు.
వాణి సంఘములో చురుకైన సభ్యునిగా ఉండేవాడు.
[మార్చు] చరమదశ
ఉద్యోగాల వలన మరియు రచనల వలన వీరు విశేషంగా డబ్బు గడించినా దానిని నిలువచేయడంలో శ్రద్ధ కనపరచలేదు. ఆధునిక శ్రీనాధుని వలెనే అనుభవించినన్నాళ్ళూ బాగా అనుభవించి, తుది రోజులలో పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. మహారాజావారు బాగా పోషించినా, పంతులుగారికి తుదిదశలో వైషమ్యాలేర్పడి, తమదగ్గర ఏనాడో చేసిన ఋణం కొరకు వారికి ఇచ్చే నూటపదహారు రూపాయల గౌరవ వేతనం వేతనంలో కొంతభాగం తగ్గించడానికి ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్యంలో వీరు అటు ఇటు తిరిగి సంపాదించలేకపోయారు. చేతికి అందివచ్చిన కుమారులు ఉన్నా వారిని ఉద్యోగాలకు పంపలేకపోయారు. కవి శేఖరుని దుస్థితి గురించి పానుగంటి వ్రాసిన లేఖను ఆంధ్రపత్రికలో యర్రవల్లి లక్ష్మీనారాయణ ప్రచురించాడు - నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును[1]
1933 నుండి శారీరకంగా, మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో పిఠాపురంలో సప్తరిపూర్త్వుత్సవాలు పురజనులు సన్మానించారు. ఈ ఉత్సవానికి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు అధ్యక్షత వహించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన అక్టోబరు 7న, 1940లో మరణించాడు.
[మార్చు] కొన్ని రచనలు
- సాక్షి వ్యాసాలు (వికీసోర్స్లో కొన్ని పూర్తి వ్యాసాలున్నాయి)
- విప్రనారాయణ చరిత్ర
- పాదుకా పట్టాభిషేకం
- కాంతాభిరామము
- రాతి స్తంభము
- కళ్యాణ రాఘవము
- విజయ రాఘవము
- వనవాస రాఘవము
- ముద్రిక
- నర్మదా పురుకుత్సీయము
- సారంగధర
- ప్రచండ చాణక్యము
- రాధాకృష్ణ
- కోకిల
- బుద్ధబోధ సుధ
- వృద్ధ వివాహము
- కంఠాభరణము
- పూర్ణిమ
- సరస్వతి
- వీరమతి
- చూడామణి
- పద్మిని
- మాలతీమాల
- గుణవతి
- మణిమాల
- సరోజిని
- విచిత్ర వివాహము
- రామరాజు
- పరప్రేమ
- మనోమహిమము
[మార్చు] వికీ మూలాలలొ
- వికీ సోర్స్లో పానుగంటి లక్ష్మీ నరసింహరావు గురించిన విషయాలున్నాయి.
- s:పానుగంటి లక్ష్మీ నరసింహారావు - పానుగంటి లక్ష్మీ నరసింహరావు గురించి వికీసోర్స్లోని పేజీ
- s:సాక్షి సంఘనిర్మాణము - పూర్తి వ్యాసం - వికీసోర్స్లోని పేజీ
[మార్చు] మూలాలు
- ↑ శత వసంత సాహితీ మంజీరాలు లో పింగళి వెంకటరావు ఉపన్యాస వ్యాసం - ప్రచురణ : ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం, నిజయవాడ (2002)
- Panuganti Lakshmi Narasimha Rao: Makers of Indian Literature, Mudigonda Veerabhadra Sastry, Sahitya Akademi, New Delhi, 1993.(ISBN 8172014996)[1]
- రాధాకృష్ణ ఆంగ్లానువాదం - Radhakrishna: Panuganti Lakshmi Narasimha Rao, English Translation by Mudigonda Veerabhadra Sastry, Sahitya Akademi, New Delhi, 2002.(ISBN 8126013907)
- కళ్యాణ రాఘవము (Kalyana Raghavamu: Panuganti Lakshmi Narasimha Rao, 1915).ఇంటర్నెట్ ఆర్చీవులో అభ్యం
- నర్మదా పురుకుత్సీయం (Narmadapurukutsiyam: Panuganti Lakshmi Narasimha Rao, 1973) ఇంటర్నెట్ ఆర్చీవులో అభ్యం.
- రాతి స్తంభాలు (Raathi Sthambhamu: Panuganti Lakshmi Narasimharao,1930) ఇంటర్నెట్ ఆర్చీవులో అభ్యం.