పాపి కొండలు
వికీపీడియా నుండి
పాపికొండలు, తూర్పు కనుమలలోని ఒక శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గర జలపాతం ఉన్నది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మద్య ప్రవహిస్తూ ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది. రాజమండ్రి నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మచ్రిపోలేని అనుభవం. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద కట్టబోతున్న పోలవరం ప్రాజెక్ట్ వలన పోలవరం నుండి ఘాటు రోద్దు మార్గం కనుమరుగు అవ్వబోతున్నది.