పి. శ్రీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రచయిత్రి-డా-పి-శ్రీదేవి

పి.శ్రీదేవి (1929-1961) ప్రముఖ తెలుగు రచయిత్రి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శ్రీదేవి తండ్రి గుళ్ళపల్లి నారాయణమూర్తి. వివాహం పెమ్మరాజు కామరాజుతో 1956లో. విద్యాభ్యాసం కాకినాడ, విశాఖపట్నంలో. ఈమెకథలు ప్రస్తుతం కథానిలయం.కామ్ వెబ్ సైటులో లభ్యం. జూన్ 29వ తేదీ, 1961లో అనారోగ్యంవలన అకాలమరణం పొందారు.

విద్యాభ్యాసం[మార్చు]

ఉద్యోగం[మార్చు]

  • గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతకాలం. తరువాత ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టుకున్నారు.
  • తెలుగు స్వతంత్రలో అసిస్టెంటు ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసారు.

సాహిత్యరంగం[మార్చు]

ఈమె కథ వాళ్ళు పాడిన భూపాలం ఆమెని ఉత్తమశ్రేణి రచయిత్రిగా నిలబెట్టింది. ఆమె రాసిన ఒకే ఒక నవల కాలాతీతవ్యక్తులు తెలుగు సాహిత్యచరిత్రలో మైలురాయిగా నిలిచింది. ప్రముఖ కవయిత్రి నాయని కృష్ణకుమారి, శ్రీదేవి స్మృతిచిహ్నంగా రాసిన కవిత "ఏం చెప్పను నేస్తం" బహుళ జనాదరణ పొందిన కవిత.

సాహిత్యకృషి[మార్చు]

కవితలు[మార్చు]

కథలు[మార్చు]

నవలలు[మార్చు]

1958లో పుస్తకరూపంలో వెలువడింది. 1962లో రెండవ ముద్రణ దాచేపల్లి కిష్టయ్య అండ్ సన్స్, సికిందరాబాదు. మార్చి 1981లో యం. శేషాచలం అండ్ కో మూడవ ముద్రణ ప్రచురించారు. అంతే కాక, ఈనవలను నాటికగా ఆకాశవాణిలో 1960లో ప్రసారం చేయబడింది. చదువుకున్న అమ్మాయిలు అన్నపేరుతో చలనచిత్రంగా కూడా రూపొందింది.

సమీక్షలు[మార్చు]

ప్రాచుర్యం[మార్చు]

కాలాతీత వ్యక్తులు నవల తెలుగు సాహిత్యరంగంలో గొప్పనవలల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. సాహిత్యరంగంలోని ఐదు గొప్ప నవలల్లో ఒకటిగా ఈ నవలను సాహిత్య విమర్శకులు గుర్తించారు.

మూలాలు[మార్చు]

  • ఓరుగంటి పార్వతీదేవి. డా. పి. శ్రీదేవి కల్పనాసాహిత్య సమీక్ష. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎం.ఫిల్. డిగ్రీకోసం సమర్పించిన సిద్ధాంతవ్యాసం. మే 1981.
  • <ref>పి. శ్రీదేవి కథలు, కవితలు<\ref>