పి. సరళాదేవి
Jump to navigation
Jump to search
1950వ దశకంలో ప్రముఖరచయిత్రులలో పి. సరళాదేవి ఒకరు. ఆమె తొలి కథ ”బావ చూపిన బ్రతుకు బాట” డిసెంబరు 1955 లో ప్రజాతంత్రలో ప్రచురితమైంది. ఆమె రచనలు కుంకుమరేఖలు కథాసంలనం, ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందు మాటతో ప్రచురణ అయింది. విశేషంగా ఆదరణ పొందిన సంకలనం ఇది. ఈ కథలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ధారావాహికంగా ప్రసారం చేసింది. 1979లో యువ మాసపత్రికలో కొమ్మా, బొమ్మా అను పేరుగల నవలిక ప్రచురించేరు. తెలుగు సామెతలు సాంఘిక చిత్రణ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని 1986 లో ప్రచురించారు. జననం 1937లో. విజయనగరంలో నివసించేరు 2007లో మరణించేవరకు.
రచనలు[మార్చు]
- కుంకుమరేఖలు
- సరళాదేవి కథలు (1977)
- కొమ్మా, బొమ్మా (1979)
- చిగురు (2004)
- తెలుగు సామెతలు సాంఘిక చిత్రణ (పరిశోధన గ్రంథం)
ఇతర రచయిత్రులతో కలిసి[మార్చు]
- షణ్ముఖప్రియ (ఆరుగురు రచయిత్రులు రాసిన నవల)
- సప్తపది (కొందరు రచయిత్రులు కలిసి రాసిన నవలః