పునాదిరాళ్ళు

వికీపీడియా నుండి
(పునాది రాళ్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పునాదిరాళ్ళు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం గూడపాటి రాజ్‌కుమార్‌
తారాగణం రోజారమణి,
నరసింహరాజు
సంగీతం ప్రేమ్‌జీ
నిర్మాణ సంస్థ ధర్మవిజయ పిక్చర్స్
భాష తెలుగు

పునాదిరాళ్ళు 1979లో గూడపాటి రాజ్‌కుమార్‌ దర్శకత్వంఓ విడుదలైన తెలుగు చలనచిత్రం. 5 నంది అవార్డులు అందుకున్న ఈ చిత్రం చిరంజీవి తొలిచిత్రం.

కథ[మార్చు]

ఒక పల్లెటూర్లో ఆ వూరి సర్పంచి రఘురామయ్య, కరణం, పటేలు, వెంకటయ్య అనే షావుకారు ఈ దుష్టచతుష్టయం గ్రామ ప్రజలను పీల్చుకుని తింటుంటారు. వారు చేసే అత్యాచారాలకు కొదువలేదు. శాంతి అనే యువతి వారి పశుత్వానికి బలవుతుంది. స్కూలు మాస్టరైన ఆ యువతి తండ్రి కూడా వారి అఘాయిత్యానికి గురవుతాడు. శాంతి పిచ్చిదానిలా నటిస్తూ, ఆ వూర్లోనే తిరుగుతూ వుంటుంది. పట్టణంలో చదువుకుని ఇంటికి వచ్చిన రఘురామయ్య కొడుకు రవికి కొద్ది రోజుల్లోనే వూళ్ళో జరిగే భాగోతం అంతా అర్థమౌతుంది. తన మిత్రులందరినీ తోడు తెచ్చుకుని నర్సుగా ఆ వూరికి వచ్చిన రాధ సహాయంతో దుర్మార్గపు ముఠాపై తిరగబడతాడు[1].

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • భారతదేశపు భావిపౌరులం ,
  • చిరు చిరు నవ్వుల
  • యాతవేసి పోసినా ఏరు

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. పి.ఎస్. (25 June 1979). "చిత్ర సమీక్ష - పునాదిరాళ్ళు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 84. Retrieved 25 December 2017.[permanent dead link]