పూర్ణకుంభం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూర్ణకుంభం

పూర్ణ కుంభం అనగా కుండని లేక కలశాన్ని సాధారణంగా నీటితో నింపి, పైన 'టెంకాయ' (కొబ్బరికాయ) నిలిపి, పై భాగంలో చుట్టూ మామిడాకులచే అలంకరించినది. దీనిని 2018 కి ముందు ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం లో వాడారు.

పూర్ణ కుంభ తయారీ[మార్చు]

దీని కొరకు సాంప్రదాయికంగా ఇత్తడి కుండను ఉపయోగిస్తారు, ఆది అందుబాటు కానప్పుడు లేదా మట్టి, లేక రాగి లేక కుండలు కూడా ఉపయోగిస్తారు. ఈ కుండను కలశం లేదా కుంభం అనికూడా అంటారు. కొన్నిసార్లు ఈ కుంభాన్ని బియ్యంతో నింపుతారు, తెల్లని లేదా ఎర్రని దారాన్ని ఈ కుండ మెడకు లేదా మొత్తం కుండకు కడతారు. మామిడాకులతో ఈ కుండ ముఖం వద్ద వృత్తాకారంలో అలంకరిస్త్రారు. కొన్నిసార్లు టెంకాయను తెల్లటి లేదా పసుపు బట్టతో కప్పుతారు. ఈ విధంగా పూర్ణకుంభ తయారవుతుంది. దీనిని సాంప్రదాయికంగా పవిత్రమైనదిగా భావిస్తారు, మంత్రోచ్ఛారణలతో తయారుచేస్తారు. దీనిని శుభసూచకంగా భావించి శుభకార్యాలలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు పెండ్లి, గృహప్రవేశం, రోజువారీ ప్రార్థనలు మొదలగునవి. దీనిని ముఖద్వారాలవద్ద 'స్వాగత సూచకంగా' ఉంచుతారు.


తిరుపతిలో శిలా పూర్ణ కుంబం

పూర్ణకుంభం చరిత్ర[మార్చు]


ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]