Coordinates: 26°55′N 71°55′E / 26.92°N 71.92°E / 26.92; 71.92

పోఖ్రాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?పోఖ్రాన్
రాజస్థాన్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°55′N 71°55′E / 26.92°N 71.92°E / 26.92; 71.92
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 233 మీ (764 అడుగులు)
జిల్లా (లు) జైసల్మేర్ జిల్లా జిల్లా
జనాభా 19,186 (2001 నాటికి)

పోఖ్రాన్ (ఆంగ్లం : Pokhran) లేదా పోకరాన్, రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా లోని, ఒక పట్టణం, పురపాలక సంఘం . ఇది థార్ ఎడారి ప్రాంతంలో ఉంది. భారత్ తన మొదటి అణుపరీక్ష ఇక్కడనే చేపట్టింది.

భూగోళికం[మార్చు]

పోఖ్రాన్ 26°55′N 71°55′E / 26.92°N 71.92°E / 26.92; 71.92 న ఉంది.[1] దీని సరాసరి ఎత్తు 233 మీటరులు (764 అడుగులు) రాళ్ళతో చుట్టబడిన ఇసుక ప్రాంతం. పోఖ్రాన్ అనగా 'ఐదు ఎండమావులు'. జోధ్‌పూరు నుండి జైసల్మేరు, బికనేరు నుండి జైసల్మేరు పోయే మార్గం మధ్యన పోఖ్రాన్ ఉంది.

జనగణన[మార్చు]

2001 గణాంకాల ప్రకారం,[2] పోఖ్రాన్ పట్టణ జనాభా 19,186,అందులో పురుషులు 55%, స్త్రీలు 45%. అక్షరాస్యత సరాసరి 56%, జాతీయ సరాసరి 59.5% కంటే తక్కువగా ఉంది. అక్షరాస్యత పురుషులలో 68%, స్త్రీలలో 41%. పోఖ్రాన్ లో 19% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారు ఉన్నారు.

అణు పరీక్ష ప్రదేశం[మార్చు]

1972 సెప్టెంబరు 7 న, పోఖ్రాన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ భాభా అణు పరిశోధనా సంస్థ (B.A.R.C) ట్రాంబేకు, భారత్ లో తయారైన అణు పరికరాన్ని పరీక్ష చేయడానికి అధికారాలు ఇచ్చింది. మే 18 1974 న భారత్ తన మొదటి అణుపరీక్ష చేపట్టింది. 1998 మే 11 నుండి మే 13 వరకు ఐదు అణుపరీక్షలు చేపట్టింది. ఆ తరువాత పరీక్షలకు నిషేధం ప్రకటించింది.

మూలాలు[మార్చు]

  1. "Falling Rain Genomics, Inc. - Map and weather data for Pokhran".
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పోఖ్రాన్&oldid=3834180" నుండి వెలికితీశారు