పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
వికీపీడియా నుండి
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1610[1]-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను భోధించిన యోగి,హేతువాది సంఘ సంస్కర్త. ఈయన తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని, జరగబోతున్నాయని భక్తుల విశ్వాసం.కడప జిల్లా లోని కందిమల్లాయపల్లి లో బ్రహ్మంగారు సజీవ సమాధి గావించబడ్డారు. వీరబ్రహ్మము గారి వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది.
విషయ సూచిక |
[మార్చు] తొలుత
చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయిన బ్రహ్మం గారు దేశాటన చేసి కాలమాన పరిస్థితులను అవగాహహన చేసుకున్నారు. చివరకు కర్నూలు మండలములోని బనగానపల్లె లో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో ఉంటూ వారి ఆవులను కాస్తూ రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాశారు. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపారు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించారు.
[మార్చు] బ్రహ్మంగారి మఠం
బ్రహ్మంగారి మఠం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. కర్ణాటక, తమిళనాడులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో భాగంగా ఉంది. ప్రస్తుతం బి.మఠం మండల కేంద్రం కూడా. బ్రహ్మం రు కులాలను రూపుమాపి సమసమాజ నిర్మాణానికి కృషి చేశాడు. ఈయన శిష్యులలో ముఖ్యుడైన దూదేకుల సిద్దయ్య దూదేకుల కులానికి, మరొక భక్తుడు మాదిగ కక్కయ్య పంచముడు అవడమే ఇందుకు తార్కాణము. ఈ చర్యలను నిరసించిన స్థానికులు బ్రహ్మంగారిని వెలివేశారు. నిప్పు, నీరూ ఇవ్వలేదు. నీటి అవసారాలు తీర్చుకోవడానికి రాత్రికి రాత్రే తన నివాసములో జింక కొమ్ముతో బావిని త్రవ్వుకున్నారు.
[మార్చు] వారసులు
బ్రహ్మంగారి కుమార్తె వీరనారయణమ్మ సంతతికి చెందిన (ఏడవ తరం)వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి ప్రస్తుత 11వ మఠాధిపతి. ఈయన బ్రహ్మంగారి సాహిత్యం, సారస్వతాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యాసంస్థలు వెలిశాయి. ఇంజినీరింగ్ కళాశాల, జూనియర్ కళాశాల, వేద పాఠశాల (తమిళనాడు భక్తుడు పట్నాల సన్యాసి రావు గారి ఏర్పాటు) నడుస్తున్నాయి.
[మార్చు] విశేషాలు
ప్రముఖ నటుడు, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు రాజకీయాలలోనికి రాకముందు మఠంలో 14 రోజులున్నారు. బ్రహ్మంగారి చరిత్రను కూలంకషముగా తెలుసుకొని "శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి" చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుగంగ పధకానికి శంకుస్థాపన చేసి మఠమును ఆనుకొనియున్న జలాశయానికి 'బ్రహ్మం సాగర్' గా నామకరణం చేశారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
- బ్రహ్మంగారి కాలజ్ఞానం
- బ్రహ్మంగారిమఠం
- శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మంగారి మీది విడుదలైన తెలుగు సినిమా.
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
|
|||||||||||||||||
|
|||||||